Himachal Pradesh: పర్యాటకులతో మనాలిలో భారీ ట్రాఫిక్.. నెటిజన్ల ఫన్నీ రియాక్షన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రస్తుతం హిమల్చల్ ప్రదేశ్ పర్యాటకులతో కిటకిటలాడుతోంది. క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకల నేపథ్యంలో దేశ నలుమూలల నుంచి పర్యాటకులు పోటేత్తున్నారు. భారీ సంఖ్యలు పర్యాటకులు రావడంతో మనాలి, అటల్ టన్నెల్ వద్ద ట్రాఫిక్ సమస్యలు తలెత్తాయి. కిలోమీటర్ల మేర వాహనాలు వరుస కట్టిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పొగమంచు, వేల సంఖ్యలో పర్యాటకుల రాకతో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో అక్కడ సుమారుగా 5 గంటల పాటు వాహనదారులు ట్రాఫిక్లో చిక్కుకుపోయారు. దీనిపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు.
కొందరు అసహనం వ్యక్తం చేస్తుండగా.. మరికొందరు సరదాగా స్పందిస్తున్నారు. అంతేకాదు ఆ సమయంలో ట్రాఫిక్లో చిక్కుకుపోయిన వారు కూడా స్వయంగా తమ అనుభవాన్ని కామెంట్స్ రూపంలో తెలిపారు. ఓ వ్యక్తి ‘అటల్ టన్నెల్ వద్ద ఐదు గంటల నుంచి చిక్కుకుపోయి ఉన్నాను’ మరికొందరు ఈ జామ్ క్లియర్ అయ్యేలోగా.. హాలిడే అయిపోతుందేమో..! అంటూ ఫన్నీగా స్పందిస్తున్నారు. మరో యూజర్ ‘క్రిస్మస్ కంటే ముందు వచ్చాం కాబట్టి మాకు ఇంత ట్రాఫిక్ జామ్ ఎదురుకాలేదు.. ఇప్పుడు వచ్చే ప్లాన్ చేసుకోని రావాలి అని సూచిస్తున్నారు. ఇలా ట్రాఫిక్తో ప్రజలు ఇబ్బంది పడుతున్న తరుణంలో కొందరు ఆకతాయిల చర్యలు నెటిజన్లను ఆగ్రహానికి గురిచేశాయి. రోడ్డుపై డోర్లు తెరిచి ఓ వ్యక్తి కారు నడుపుతుండగా.. మరికొందరు ఆ డోర్లకు వేలాడిన దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి.
Also Read
- Union Budget: అక్టోబర్ 12 నుంచి కేంద్ర బడ్జెట్ కసరత్తు.. కీలక అంశాలపై ఫోకస్
- Central Employees: కేంద్ర ఉద్యోగుల జీతాల్లో ఊహించని మార్పు.. 3 శాతం ఉన్న ఇంక్రిమెంట్ 6 శాతానికి..?
- PM Modi: ఉజ్బెకిస్థాన్కు చేరుకున్న మోడీ.. అధ్యక్షుడు మిర్జియోయెవ్ ఘన స్వాగతం
- Reservation row: కేంద్ర మంత్రుల మధ్య మాటల యుద్ధం.. మంట పెట్టిన ‘‘రిజర్వేషన్’’ అంశం..
Manali to Atal Tunnel pic.twitter.com/bYW6PGaaiB
— Weatherman Shubham (@shubhamtorres09) December 23, 2023
ఇలాంటి చర్యలతో కారు అదుపు తప్పే ప్రమాదం ఉందని, రోడ్లపై ఇలాంటి స్టంట్లు చేయొద్దని పోలీసులు విజ్ఞప్తి చేశారు. ఈ ట్రాఫిక్ వీడియో ఏకంగా ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ స్పందిస్తూ టూరిస్ట్లను స్వాగతించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. మొన్నటి వరకు వరదలతో అల్లాడిన హిమాచల్ ప్రదేశ్ పర్యాటకులతో కళకళలాడుతోందంటూ ఆనందం వ్యక్తం చేశారు. 10 వేల అడుగుల ఎత్తులో ఉన్న ప్రపంచంలోనే అత్యంత పొడవైన అటల్ టన్నెల్ నుంచి డిసెంబర్ 24న 12 వేల వాహనాల్లో 65వేల మంది ప్రయాణించారు. ప్రకృతి విపత్తు నుంచి కోలుకున్న హిమాచల్ ప్రదేశ్.. ఈ పండగ సీజన్లో పర్యాటకులను ఆహ్వానిస్తోంది’ అంటూ ఆయన రాసుకొచ్చారు.
Holidays are nowadays spent on roads. Jab tak jam khulega chutti khattam!!🤠 https://t.co/Opllq6odOF
— Alok Jain ⚡ (@WeekendInvestng) December 24, 2023
తాజావార్తలు
-
Kapil Dev: ఫాలో ఆన్ ఇచ్చి కూడా గెలవలేరా? కపిల్ దేవ్ ప్రశ్నల వర్షంతో టీమిండియాలో ప్రకంపనలు..
-
NASA: అంగారక గ్రహంపై ఏలియన్ ‘జెల్లీఫిష్’ కలకలం.. నాసా ఫొటోతో వెలుగులోకి షాకింగ్ విషయాలు..
-
Food Poisoning: జగిత్యాల జిల్లాలో విషాదం.. పెళ్లి భోజనం తిని 15 మందికి అస్వస్థత..
-
Emraan Hashmi: సినిమా సక్సెస్ జోష్లో ఇమ్రాన్ హష్మీకి బిగ్ షాక్.. స్వైన్ ఫ్లూ పాజిటివ్!
-
T20 Cricket: కేవలం 7 పరుగులకే ఆలౌట్, 10 రన్స్కే కుప్పకూలిన జట్లు, టీ20 చరిత్రలోనే అత్యంత దారుణ స్కోర్లు ఇవే!
ట్రెండింగ్
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!