హిజాబ్ వ్యవహారంపై అత్యవసర విచారణకు మరోసారి నిరాకరించింది సుప్రీంకోర్టు.. హిజాబ్పై కర్ణాటక హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ముస్లిం విద్యార్థులు వేసిన పిటిషన్పై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.. విద్యార్థుల తరఫు సీనియర్ న్యాయవాది దేవదత్ కామత్ వాదనలు వినిపిస్తూ.. హైకోర్టు ఆదేశాల కారణంగా విద్యార్థులకు వార్షిక పరీక్షలో సమస్య ఏర్పడిందని సుప్రీం దృష్టికి తీసుకెళ్లారు.. విద్యార్థులు పరీక్షలకు హాజరుకాలేరు మరియు ఒక సంవత్సరం నష్టపోలేరు కాబట్టి సమస్య అత్యవసం అన్నారు.. దీనిపై ప్రధాన…
హిజాబ్ వివాదంపై కర్ణాటక హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. విద్యాసంస్థల్లో హిజాబ్ నిషేధాన్ని సవాలు చేస్తూ దాఖలైన అన్ని పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది. స్కూళ్లు, కాలేజీల్లో హిజాబ్ ధరించడం తప్పనిసరి కాదు అంటూ స్పష్టం చేసింది. ఇస్లాం మతపరంగా అంతగా ముఖ్యమైన అంశం కాదని హైకోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది. చీఫ్ జస్టిస్ రితూ రాజ్ అవస్థి నేతృత్వంలో జస్టిస్ కృష్ణ దీక్షిత్, జస్టిస్ జేఎస్ ఖాజీలతో కూడిన ధర్మానం ఈ మేరకు మంగళవారం తీర్పు వెలువరించింది.…
Karnataka High Court Going Verdict Tomorrow on Hijab Row Issue. దేశ వ్యాప్తంగా సంచలన సృష్టించిన హిజాబ్ వివాదంపై క్లారిటీ రానుంది. తరగతులకు హిజాబ్తో రావద్దంటూ ఓ విద్యా సంస్థ ఇచ్చిన ఆదేశంతో రేగిన ఈ వివాదం కర్ణాటకను అల్లకల్లోలానికి గురి చేసింది. కేవలం ఒకే ఒక్క విద్యా సంస్థ జారీ చేసిన ఈ ఉత్తర్వులు దేశవ్యాప్తంగా మత విద్వేషాలను రెచ్చగొట్టే ప్రమాదముందంటూ జనం భయాందోళనలకు గురయ్యారు. దీంతో దీనిపై కర్ణాటక హైకోర్టు విచారణ…
కర్ణాటకలోని జిల్లాలో కుందాపూర్, ఉడుపి, బిందూర్లో మొదలైన హిజాబ్ వివాదం.. క్రమంగా మిగతా ప్రాంతాలకు పాకింది.. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ను కూడా తాకింది.. బుర్కా వేసుకొచ్చామన్న కారణంతో కాలేజీ యాజమాన్యం అనుమతించడం లేదంటూ విజయవాడలోని లయోలా కాలేజీలో ముస్లిం విద్యార్థినులు ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే.. బుర్కా వేసుకొచ్చారన్న కారణంతో లోపలికి అనుమతించడం లేదంటూ విద్యార్థినులు తెలిపారు.. దీనిపై విద్యార్థినుల కుటుంబసభ్యులు, ముస్లిం పెద్దలు కూడా ఆందోళన చేసిన సంగతి మరువక ముందే.. ఇప్పుడు మరో చోట హిజాబ్…
కర్ణాటకలోని విద్యా సంస్థల్లో మొదలైన హిజాబ్ వ్యవహారం.. మరికొన్ని రాష్ట్రాలకు పాకింది.. ఇప్పుడు తమిళనాడును కూడా తాకింది.. స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా.. మధురైలో హిజాబ్ ధరించి వచ్చిన ఓ మహిళను బీజేపీ బూత్ ఏజెంట్ అడ్డుకోవడంతో ఉద్రిక్తత ఏర్పడింది.. హిజాబ్ తొలగించిన తర్వాతే ఆ మహిళ ఓటు వేయాలని.. అప్పుడే ఓటు వేయడానికి అనుమతించాలంటూ బీజేపీ ఏజెంట్ పోలింగ్ బూత్లో వీరంగం సృష్టించాడు.. దీంతో, కాసేపు ఉద్రిక్త పరిస్థితి ఏర్పడగా.. డీఎంకే, అన్నాడీఎంకే సహా ఇతర…
హిజాబ్ వివాదం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది.. ఇక, ఈ వ్యవహారంపై కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు కొందరు విద్యార్థులు.. ఆ కేసులో విచారణ కొనసాగుతుండగా.. ఇవాళ ఆసక్తికరమైన వాదనలు జరిగాయి.. కర్ణాటక సర్కార్ తరఫున అడ్వకేట్ జనరల్ ప్రభులింగ్ నవాద్గీ హైకోర్టులో వినిపించిన వాదనలకు ప్రాధాన్యత ఏర్పిడింది.. హిజాబ్ ఇస్లాం మతానికి అవసరమైన మతపరమైన ఆచారం కాదన్న ఆయన.. హిజాబ్ ధరించడాన్ని నిరోధించడం మత స్వేచ్ఛను అడ్డుకున్నట్టు కాదన్నారు. మత స్వేచ్ఛకు హామీనిచ్చే భారత రాజ్యాంగంలోని ఆర్టికల్-25ను ఉల్లంఘించినట్టుకాదని…
కర్ణాటకలో హిజాబ్ వివాదం ఇంకా నడుస్తోంది. తాజాగా విజయపుర జిల్లాలోని ఇండి ప్రభుత్వ పీయూసీ కాలేజీకి తిలకం (సింధూరం) పెట్టుకుని వచ్చిన హిందూ విద్యార్థిని లెక్చరర్లు అడ్డుకున్నారు. తిలకం తీసేసి లోపలికి రావాలని ఆదేశించారు. దీనికి విద్యార్థి తిరస్కరించాడు. అయితే తిలకం ఉంటే కాలేజీ లోపలకు వచ్చేందుకు వీల్లేదని, ఇంటికి వెళ్లిపోవాలని లెక్చరర్లు స్పష్టం చేశారు. దీంతో భజరంగ్ దళ్, శ్రీరామ్ సేన కార్యకర్తలు కాలేజీ ఎదుట ఆందోళనకు దిగారు. సింధూరం అనేది మతానికి సంబంధించినది కాదని,…
కర్ణాటక రాష్ట్రంలో హిజాబ్ ధరించి విద్యార్థులు పాఠశాల, కళాశాలలకు హజరుకావద్దనే వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడీ హిజాబ్ అంశం ఏపీకి పాకింది. ఇదే తరహాలో బెజవాడలో కూడా ఓ ఘటన చోటు చేసుకుంది. విజయవాడకు చెందని ఓ కాలేజీ యాజమాన్యం బుర్కా వేసుకొచ్చారని కొంత మంది ముస్లిం విద్యార్థినులను కాలేజీలోకి అనుమతించలేదు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. అయితే ఫస్ట్ ఇయర్ నుంచి తాము బుర్కాలోనే కళాశాలకు హజరవుతున్నామని,…
కర్ణాటకలో హిజాబ్పై వివాదం చేలరిగి దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ‘హిజాబ్’ ‘పర్దా’లకు వ్యతిరేకంగా నిరసనల పేరుతో ద్వేషాన్ని వ్యాప్తి చేస్తున్న వ్యక్తులను ఎదుర్కోవడానికి ముస్లిం మహిళలు తప్పనిసరిగా ముందుకు రావాలని ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు (AIMPLB) పేర్కొంది. “నా ప్రియమైన సోదరీమణులారా, హిజాబ్ గురించి ప్రజలకు తెలియజేయడానికి, పక్షపాతాన్ని పారద్రోలడానికి, మీరు హిజాబ్తో అణచివేయబడలేదని, కానీ దానితో గౌరవంగా మరియు స్వేచ్ఛగా ఉన్నారని తెలియజేయడానికి ఈ సమయాన్ని…
కర్ణాటకలో చెలరేటిన హిజాబ్ వ్యవహారం ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది. అయితే తాజాగా లోక్సభ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఆదివారం ట్విట్లర్ వేదికగా.. హిజాబ్ ధరించిన అమ్మాయి ఏదో ఒక రోజు భారత ప్రధానమంత్రి అవుతుందని అన్నారు. హిజాబ్లు ధరించినందుకు ముస్లిం విద్యార్థుల బృందం తమ కళాశాలలోకి ప్రవేశించకుండా నిరోధించిన తర్వాత కర్ణాటక హిజాబ్ వ్యవహారం చెలరేగిన నేపథ్యంలో ఇది జరిగింది. ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ చీఫ్ ఒవైసీ ఆదివారం ఒక వీడియోను ట్వీట్…