Myth N Fact: మన ఇంట్లో చిన్న పిల్లలు అప్పుడప్పుడూ లేదా వరుసగా కొన్ని రోజుల పాటు రోజులో కొద్దిసేపు గుక్క పట్టి ఏడుస్తుంటారు. తద్వారా వాళ్లు తమ బాధను బయటికి చెప్పుకోలేక తమలోతామే తీవ్రంగా ఇబ్బందిపడటం జరుగుతుంటుంది. అలా తల్లడిల్లిపోతున్న చిన్నారులను చూసి వాళ్ల తల్లిదండ్రులు కూడా కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటారు. పసికందులు ఎందుకు అలా ఏడుస్తున్నారో అర్థంకాదు. ఆ సందర్భంలో ఏం చేయాలో కూడా తోచదు.
Women: 'ఆమె'కు మరోసారి వందనం. ఎందుకంటే 'ఆమె' ఆకాశంలో సగమేనేమో గానీ అవయవదానంలో మాత్రం అంతకుమించి. తల్లిగా, సోదరిగా, ఇల్లాలిగా ప్రేమను పంచటంలో మాత్రమే కాదు. చివరికి తన శరీర భాగాలను పంచటంలో సైతం 'ఆమె' తనకుతానే సాటి అని నిరూపించుకుంది.
Andhra Pradesh: కొవిడ్-19 బూస్టర్ డోస్ టీకా విషయంలో తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అగ్ర స్థానంలో నిలిచింది. ఏపీలో ఇప్పటికే సుమారు 59 లక్షల మంది ఈ మూడో డోస్ వేయించుకున్నారు. దేశం మొత్తమ్మీద ఏ రాష్ట్రంలోనూ లేదా ఏ కేంద్ర పాలిత ప్రాంతంలోనూ ఇంత తక్కువ వ్యవధిలో ఇంత ఎక్కువ మంది బూస్టర్ డోస్ తీసుకోలేదు.
మనలో చాలామంది బరువు తగ్గడానికి జ్యూస్లు ఎక్కువగా తాగుతుంటారు. బ్రేక్ ఫాస్ట్ మానేసి మరీ జ్యూస్ ల మీద పడతారు. పరగడుపున వాకింగ్, జాగింగ్ తర్వాత మీకు జ్యూస్ తాగే అలవాటుంటే మాత్రం కొన్ని జాగ్రత్తలు పాటించాలి. నారింజ, ద్రాక్షపండు, నిమ్మకాయ లేదా సీజనల్ వంటి ఎక్కువ సిట్రస్ పండ్ల రసాలను ఉదయం తాగడం మంచిది కాదని డాక్టర్లు చెబుతున్నారు. ఎందుకంటే ఈ పండ్ల రసాలను ఖాళీ కడుపుతో తీసుకోవడం వల్ల కడుపులో ఆమ్లత్వం పెరుగుతుందని నిపుణులు…
ఆహార అలవాట్లపైనే మన ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. ఆరోగ్యంగా ఉండాలంటే మంచి ఆహారం తినాలి. చాలామంది రకరకాల డైట్లు ఫాలో అవుతుంటారు. ఇందుకోసం డబ్బులు ఖర్చు పెట్టడమేకాకుండా.. ఏవేవో తింటుంటారు. కానీ మన ఇంట్లో దొరికే ఆహార పదార్థాలతోనే ఆరోగ్యాన్ని పెంపొందించుకోవచ్చు. ప్రతి రోజూ మనం తినే ఆహారంలో ఈ ఐదింటిని చేర్చుకోవడంతో రోగాల బారిన పడకుండా జాగ్రత్తగా ఉండొచ్చు. మరి ఆ ఆహార పదార్థాలేంటో చూద్దామా.. పెరుగు పెరుగు ఆరోగ్యానికి ఎంతో మంచిది. ప్రతిరోజు పెరుగును…
ప్రస్తుతం ప్రపంచాన్ని మరో వైరస్ వణికిస్తోంది. కరోనా మహమ్మారి ఇంకా పూర్తిగా కనుమరుగు అవ్వకముందే మరో ప్రాణాంతక వ్యాధి మానవాళికి సవాలు విసురుతోంది. అదే మంకీపాక్స్. పశ్చిమ ఆఫ్రికాలో మొదలైన ఈ వైరస్ ఇప్పటికే అనేక దేశాలకు పాకింది. ఈనేపథ్యంలోనే డబ్ల్యూహెచ్వో ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించింది. మంకీపాక్స్ అధికంగా వ్యాప్తి చెందడానికి శృంగారమే ప్రధాన కారణమనని పేర్కొంది. మంకీపాక్స్ ఉన్నవారు ఇతరులతో శారీరకంగా కలవడం కారణంగా వైరస్ వ్యాప్తి అధికంగా ఉందని ఆరోగ్య సంస్థ చీఫ్…
నీళ్లు ఎంత తాగితే అంత మంచిది ఇది మనం ఎప్పుడు అందినోట వినే మాట. దాని వల్ల చాలా అనారోగ్యాల నుంచి బయట పడవచ్చనీ మనకు తెలుసు. కానీ, తగిన మోతాదుకు మించి నీళ్లు తాగడం అన్నది అనారోగ్యం నుంచి బయట పడొచ్చని మనందరికి తెలుసు కానీ.. మోతాదుకు మించి నీళ్లు తాగడం అన్నది ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదు. ఓవర్హైడ్రేషన్ వల్ల శరీరం రకరకాల ఇబ్బందులకు గురి అవుతుంది. మనిషికి జీవించేందుకు నీరు అత్యవసరం. సరైన…
వైద్యుడు చెప్పేవరకూ తెలియదు. ఆమాటకొస్తే పరీక్ష చేసేవరకూ వైద్యుడికే తెలియదు. అంత మాయదారి సమస్య హైపర్టెన్షన్. నియంత్రణలో ఉంచుకుంటే బానిసలా పడి ఉంటుంది. లక్ష్మణరేఖ దాటగానే.. దశకంఠుడిలా విజృభిస్తుంది. సకల రోగాలకూ స్వాగతద్వారం అవుతుంది. బీపీ విషయంలో జీవనశైలి సర్దుబాటుకు సాటివచ్చే చికిత్సా విధానమే లేదు. అధిక రక్తపోటు (హైపర్టెన్షన్).. నిశ్శబ్దంగా దాడి చేస్తుంది. చాపకింద నీరులా విస్తరిస్తుంది. సునామీలా ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. ప్రళయమై జీవితాన్ని కబళిస్తుంది. మారుతున్న జీవన శైలి, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, నామమాత్రమైన…
ఎన్నో ఆరోగ్య సమస్యలు వేధిస్తుంటాయి. ముఖ్యంగా ముఖంపై మచ్చలు, ముడతలతో యువతీ, యువకులు బాధపడుతూ వుంటారు. వారు అనేక క్రీములు వాడుతుంటారు. అయితే తాజాగా మార్కెట్లోకి వచ్చింది ఫ్రీక్వెన్నీ థెరపీ. ఇది పెట్టుకుంటే ఎలాంటి నల్ల మచ్చలైనా మాయం అయిపోతాయి. ముడతలు మటుమాయం అవుతాయంటున్నారు శ్రీచందన. ఎన్టీవీ హెల్త్ లో ఆమె ఏం చెప్పారో చూద్దాం.
ఈమధ్యకాలంలో ఎన్నో ఆరోగ్య సమస్యలు చుట్టుముడుతున్నాయి. ముఖ్యంగా ఎక్కువసేపు కూర్చుని పనిచేసేవారు, ఏసీల్లో వుండేవారికి బాధించే ప్రధాన సమస్య పైల్స్. హెమరాయిడ్స్.. మలద్వారం దగ్గర మొదలయ్యే ఈ పైల్స్ సమస్య ఎంతో ఇబ్బందికరంగా ఉంటుంది. సరిగా కూర్చోలేరు.. నిలబడలేరు అన్నట్లుగా వుంటుంది వీరి పరిస్థితి. కొన్నిసార్లు మొలల సమస్యను తగ్గించుకునేందుకు ఆపరేషన్ కూడా అవసరం అవుతుంది. సాధారణంగా మొలలు జన్యు కారణాలు, వృద్ధ్యాప్యంకి చేరుకుంటున్నకొద్దీ ఎక్కువ అవుతుందని చెబుతారు. గర్భవతుల్లో సమస్య ఎక్కువగా ఉంటుంది. తరచుగా పొట్ట…