Andhra Pradesh: అగ్ర స్థానంలో ఆంధ్రప్రదేశ్.. మరికొద్ది రోజుల్లో 10 కోట్ల మార్క్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Andhra Pradesh: కొవిడ్-19 బూస్టర్ డోస్ టీకా విషయంలో తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అగ్ర స్థానంలో నిలిచింది. ఏపీలో ఇప్పటికే సుమారు 59 లక్షల మంది ఈ మూడో డోస్ వేయించుకున్నారు. దేశం మొత్తమ్మీద ఏ రాష్ట్రంలోనూ లేదా ఏ కేంద్ర పాలిత ప్రాంతంలోనూ ఇంత తక్కువ వ్యవధిలో ఇంత ఎక్కువ మంది బూస్టర్ డోస్ తీసుకోలేదు. ఆంధ్రప్రదేశ్లో మూడు డోసులూ వేయించుకున్నవారి సంఖ్య ప్రస్తుతానికి 9.8 కోట్లకు చేరింది. మరికొద్ది రోజుల్లో 10 కోట్ల మార్క్ కూడా దాటబోతోంది. ఈ దిశలో శరవేగంగా దూసుకెళుతోంది.
పెద్దోళ్లకు బూస్టర్ డోస్ని ఉచితంగానే ఇస్తుండటంతో జనం భారీగా క్యూ కడుతున్నారు. ఏపీలో వయోజనులు, 15-18 ఏజ్ గ్రూప్వాళ్లు ఇప్పటికే వంద శాతం రెండు టీకాలు వేయించుకున్నారు. 12-14 ఏజ్ గ్రూప్వాళ్లు మొత్తం 14.9 లక్షల మంది ఉండగా 14.8 లక్షల మంది రెండు డోసులూ తీసుకున్నారు. ఈ ఏజ్ గ్రూప్లోనూ సెంట్ పర్సెంట్ వ్యాక్సినేషన్ ఫీట్ను త్వరలో చేరుకోనుంది. ఆంధ్రప్రదేశ్లో గడచిన మూడు నెలల్లోనే దాదాపు 55 లక్షల మంది టీకాలు వేయించుకోవటం చెప్పుకోదగ్గ విషయం.
Also Read
read more:
Botsa Satyanarayana: వాళ్లు విలీన మండలాలు అడిగితే.. రెండు రాష్ట్రాలను మళ్లీ కలపాలని మేం డిమాండ్ చేస్తాం
అక్కడ 18-60 ఏజ్ గ్రూప్వాళ్లకు బూస్టర్ డోస్ను ఈ నెల 15 నుంచి ఇస్తున్నారు. వ్యాక్సినేషన్ విషయంలో ఏపీ ఇలా రికార్డులు నెలకొల్పుతున్నప్పటికీ రోజూ నమోదవుతున్న కొత్త కరోనా కేసుల సంఖ్య సైతం మరోసారి పెరుగుతోంది. మే నెలలో నిత్యం పది కన్నా ఎక్కువ పాజిటివ్ కేసులు వచ్చేవి కాదు. కానీ ఇప్పుడు రోజుకి ఏకంగా 400 నుంచి 500 మంది వరకు ఈ మహమ్మారి బారిన పడుతున్నారు. జూన్ 8 వరకు కూడా డైలీ యాక్టివ్ కేసుల సంఖ్య పట్టుమని వంద దాటేది కాదు. ఇప్పుడది 2,760 వద్ద ఉంది. జూన్లో సగటు పాజిటివిటీ రేట్ 2.9 శాతం ఉండగా జూలైలో 10 శాతం దాటింది.
బూస్టర్ డోస్ను ఎక్కువ మంది వేయించుకోవటానికి ఇది కూడా ఒక కారణం కావొచ్చని పరిశీలకులు అంటున్నారు. 2020, 2021 సంవత్సరాల్లో కరోనా పీక్ స్టేజ్లో ఉన్నప్పుడు కేసుల కట్టడికి సీఎం జగన్ సరైన చర్యలు చేపట్టలేదని ప్రతిపక్ష పార్టీలు విమర్శించేవి. ఆ స్థితి నుంచి రాష్ట్రం ఇవాళ వ్యాక్సినేషన్ విషయంలో దేశంలోనే మొదటి స్థానాన్ని ఆక్రమించటం గొప్ప పరిణామమని అంటున్నారు. ఈ ఘనత సాధించటంలో వైద్య సిబ్బంది పాత్ర కీలకమని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందుకే వాళ్లకే ఈ ప్రశంసలు దక్కాలి.
తాజావార్తలు
-
Covid 19: కోవిడ్పై కేంద్రం క్లారిటీ.. భయపడాల్సిన అవసరం లేదట..!
-
Mehbooba Mufti: ‘దేశంలో పిల్లల కంటే ఆవులే సురక్షితం’.. మెహబూబా ముఫ్తీ సంచలన వ్యాఖ్యలు
-
Story Board : ఎల్నినో నుంచి యుద్ధాల వరకు.. సామాన్యుడిపై ప్రభావం ఎంత?
-
OTR: మూతపడ్డ CCI ఫ్యాక్టరీపై మళ్లీ రాజకీయ రగడ… బీఆర్ఎస్ భారీ స్కెచ్?
-
Pawan Kalyan : ఎర్రచందనం మాఫియాకు పవన్ వార్నింగ్.. మూలాలతో సహా నిర్మూలించాలి..
ట్రెండింగ్
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?