Health Tips: ఆహారంలో ఇవి ఉంటే.. ఆరోగ్యం మీ వెంటే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆహార అలవాట్లపైనే మన ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. ఆరోగ్యంగా ఉండాలంటే మంచి ఆహారం తినాలి. చాలామంది రకరకాల డైట్లు ఫాలో అవుతుంటారు. ఇందుకోసం డబ్బులు ఖర్చు పెట్టడమేకాకుండా.. ఏవేవో తింటుంటారు. కానీ మన ఇంట్లో దొరికే ఆహార పదార్థాలతోనే ఆరోగ్యాన్ని పెంపొందించుకోవచ్చు. ప్రతి రోజూ మనం తినే ఆహారంలో ఈ ఐదింటిని చేర్చుకోవడంతో రోగాల బారిన పడకుండా జాగ్రత్తగా ఉండొచ్చు. మరి ఆ ఆహార పదార్థాలేంటో చూద్దామా..
పెరుగు
పెరుగు ఆరోగ్యానికి ఎంతో మంచిది. ప్రతిరోజు పెరుగును ఆహారంగా తీసుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఇందులో ప్రోటీన్లు, గట్ బ్యాక్టీరియా పుష్కలంగా లభిస్తుంది. కాల్షియంతో పాటు విటమిన్ బీ2, విటమిన్ బీ12, పొటాషియం, మెగ్నీషియం కూడా అధికంగా ఉంటాయి. ఇవి జీర్ణక్రియ మెరుగుపడటంలో సహాయపడతాయి. అలాగే మానసిక ఒత్తిడిని తగ్గించడంతోపాటు దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే అవకాశాన్ని తగ్గిస్తాయి.
Also Read
- Chandipura virus: 22 మంది చిన్నారులు మృతి.. ఏమిటి చండీపుర వైరస్.? మెదడుపై ఎలా దాడి చేస్తుంది.?
- Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ 'జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు'.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
- PCODతో ఇబ్బందా.? మెంతులు-దాల్చినచెక్క టీతో ఇన్సులిన్ బ్యాలెన్స్.!
- Mushroom Onion Pakoda: ఈజీ స్నాక్ రెసిపీ..10 నిమిషాల్లో కరకరలాడే 'మష్రూమ్ ఆనియన్ పకోడీ'.! చేసేయండి ఇలా..
పప్పు దినుసులు
మనం తరచూ తినే పప్పుల్లో పుష్కలంగా లభిస్తాయి. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఫైబర్, ప్రోటీస్లు కూడా అధికంగా ఉంటాయి. ఇవి జీర్ణ వ్యవస్థ సక్రమంగా పనిచేసేలా సహాయపడుతాయి. అలాగే కొత్త కణాలు పునరుత్పత్తి అవ్వడంలో సహకరిస్తాయి. పప్పు దినుసుల్లో విటమిన్ ఏ, విటమిన్ బీ, విటమిన్ సీ, విటమిన్ ఈ, మెగ్నిషియం, ఐరన్, జింక్ కూడా లభిస్తాయి.
మిల్లెట్లు
మన తాత ముత్తాతలు ఒకప్పుడు ఎక్కువగా రాగి, జొన్న, సజ్జ ఎక్కువగా తినేవాళ్లు. అందుకే వారు చాలాకాలం ఆరోగ్యంగా జీవించారు. ఈ మిల్లెట్లలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. అలాగే జీర్ణక్రియకు అవసరమయ్యే మంచి బ్యాక్టీరియా ఏర్పడటంలో ఇవి ఎంతగానో దోహదపడతాయి. అంతేకాకుండా పేగు కేన్సర్ వచ్చే అవకాశాన్ని కూడా మిల్లెట్లు తగ్గిస్తాయి. బరువు తగ్గాలని అనుకునేవారికి ఇది మంచి ఆహారం.
మసాలా దినుసులు
మన వంట్లో మసాలా దినుసులు తప్పనిసరిగా వాడుతుంటాం. కూరల్లో వేసే పసుపు, లవంగాలు, మెంతులు, మిరియాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. నొప్పి నివారణ, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు వీటిలో ఎక్కువగా ఉంటాయి. గాయాలను తగ్గించడంతో పాటు రోగ నిరోధక శక్తిని పెంచడంలో ఇవి ఉపయోగపడతాయి. చూసారుగా.. మీరు కూడా ఈఐదు పదార్థాలను ఆహారంలో ఉపయోగించుకుని మంచి ఆరోగ్యాన్ని మీ సొంతం చేసుకుందాం.
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!