Fake Currency: నకిలీ నోట్ సామ్రాట్..
- అహ్మదాబాద్లో ఫేక్ కరెన్సీ ముఠా అరెస్ట్ ..
- అహ్మదాబాద్ డిటెక్షన్ ఆఫ్ క్రైమ్ బ్రాంచ్ నేతృత్వంలో ఆపరేషన్..
- ముఠా వెనుక స్వయంప్రకటిత గాడ్మ్యాన్ ప్రదీప్ జోతంగియా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గుజరాత్లో నకిలీ నోట్ల ముఠా భరతం పట్టారు పోలీసులు. తీగ లాగితే డొంక కదిలినట్లు ఈ కేసులో కింగ్ పిన్గా ఉన్న వ్యక్తి సైతం పట్టుబడ్డాడు. అంతే కాదు .. తనకు తాను గాడ్మ్యాన్గా చెప్పుకుంటూ.. యోగాశ్రమం ముసుగులో ఫేక్ కరెన్సీ రాకెట్ నడిపిస్తున్న వ్యక్తిని పోలీసులు కటకటాల్లోకి నెట్టారు. ఇంతకీ కంత్రీ గాడ్మ్యాన్ ఎవరు? అసలు ఫేక్ కరెన్సీ ముఠా బాగోతం ఎలా బయటకు వచ్చింది? వారు పేక్ కరెన్సీ ఎక్కడెక్కడ చలామణి చేశారు?
నకిలీ నోట్ సామ్రాజ్యం..
Also Read
- Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
- Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
- Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
- Pakistan: పాకిస్తాన్ మరోసారి.. భారత విమానాలపై గగనతల ఆంక్షలు పొడగింపు..
గుజరాత్లోని అహ్మదాబాద్లో ఫేక్ కరెన్సీ ముఠాను పోలీసులు పట్టుకున్నారు. ఆ ముఠా దేశవ్యాప్తంగా తమ నెట్వర్క్ ద్వారా పెద్ద ఎత్తున ఫేక్ కరెన్సీ చలామణి చేసిందనే విషయం బయటపడింది. మొత్తంగా ఈ ఆపరేషన్ అంతా.. అహ్మదాబాద్ డిటెక్షన్ ఆఫ్ క్రైమ్ బ్రాంచ్.. DCB నేతృత్వంలో జరిగింది. ఇందులో ప్రధాన సూత్రధారుడు స్వయంప్రకటిత గాడ్మ్యాన్ ప్రదీప్ జోతంగియా అలియాస్ ప్రదీప్జీతోపాటు మరో ఏడుగురిని అరెస్ట్ చేశారు పోలీసులు.
నిజానికి పోలీసుల కళ్లుగప్పి ఈ నకిలీ నోట్ల ముఠా పెద్ద ఎత్తున కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఐతే ఇటీవల అహ్మదాబాద్లోని అమ్రైవాడి ప్రాంతంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న ఓ వాహనాన్ని పోలీసులు అడ్డగించారు. ఆ వెహికిల్ తనిఖీ చేయడంతో రూ. 500 నోట్లు కట్టలు కట్టలుగా కనిపించాయి. ముందుగా అన్అకౌంటెడ్ మనీ అనుకున్నారు పోలీసులు. ఆ తర్వాత క్షుణ్నంగా తనిఖీ చేస్తే..ఫేక్ కరెన్సీ అని బయటపడింది. అందులోని వ్యక్తులను ఇంటరాగేషన్ చేయడంతో సూరత్లో నకిలీ నోట్ల ప్రింట్ చేస్తూ.. మర్కెట్లోకి వదులుతున్న విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో పోలీసులు సూరత్లోని కమ్రేజ్ ప్రాంతంలో ఉన్న శ్రీ సత్య యోగా ఫౌండేషన్లో సోదాలు నిర్వహించారు. అక్కడ ఏకంగా 2.38 కోట్ల రూపాయల విలువైన ఫేక్ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు.
పోలీసుల ప్రాథమిక విచారణలో సంచలన విషయాలు వెల్లడయ్యాయి. సత్య యోగ ఫౌండేషన్ను నిర్వహిస్తున్న ప్రదీప్ జోతంగియా తనకు తాను గాడ్మ్యాన్గా ప్రకటించుకున్నాడు. కోట్లాది మంది భక్తులను తయారు చేసుకున్నాడు. ఆ ముసుగులో ఫేక్ కరెన్సీ దందా స్టార్ట్ చేశాడు. తన ఆశ్రమంలోనే ఫేక్ కరెన్సీ నోట్లు తయారు చేస్తూ కస్టమర్లకు స్వయంగా డోర్ డెలివరీ చేస్తున్నాడు. దేశవ్యాప్తంగా తన సొంత వాహనాల్లోనే నకిలీ కరెన్సీ రవాణా చేస్తున్నాడు.
ప్రదీప్ జోతంగియా నేతృత్వంలోని ఈ ముఠా కేవలం గుజరాత్కే పరిమితం కాకుండా ఇతర రాష్ట్రాలకు కూడా నకిలీ కరెన్సీ పంపిణీ చేసే నెట్వర్క్ను ఏర్పాటు చేసిందని పోలీసులు భావిస్తున్నారు. ముఖ్యంగా పండుగలు, పెద్ద ఈవెంట్ల సమయంలో మార్కెట్లో నకిలీ నోట్లను చలామణి చేసే ప్రయత్నాలు చేసినట్లు సమాచారం. ఈ కేసు నేపథ్యంలో నకిలీ కరెన్సీ రాకెట్లపై రాష్ట్రవ్యాప్తంగా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు. త్వరలోనే ఈ కేసులో మరిన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
తాజావార్తలు
-
OTR : వైసీపీ నేతలతో టచ్.. టీడీపీ ఎమ్మెల్యేతో మ్యాచ్? కాకినాడలో హాట్ టాపిక్
-
Story Board : ఇరాన్ యుద్ధం గల్ఫ్ కు చేసిన నష్టమేంటి..? దుబాయ్ గతానికి, ప్రస్తుతానికి తేడా ఏంటి..?
-
Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
-
Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
-
Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!