Health News: పరగడుపున ఈ జ్యూస్ తాగొద్దు.. ప్లీజ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మనలో చాలామంది బరువు తగ్గడానికి జ్యూస్లు ఎక్కువగా తాగుతుంటారు. బ్రేక్ ఫాస్ట్ మానేసి మరీ జ్యూస్ ల మీద పడతారు. పరగడుపున వాకింగ్, జాగింగ్ తర్వాత మీకు జ్యూస్ తాగే అలవాటుంటే మాత్రం కొన్ని జాగ్రత్తలు పాటించాలి. నారింజ, ద్రాక్షపండు, నిమ్మకాయ లేదా సీజనల్ వంటి ఎక్కువ సిట్రస్ పండ్ల రసాలను ఉదయం తాగడం మంచిది కాదని డాక్టర్లు చెబుతున్నారు. ఎందుకంటే ఈ పండ్ల రసాలను ఖాళీ కడుపుతో తీసుకోవడం వల్ల కడుపులో ఆమ్లత్వం పెరుగుతుందని నిపుణులు తెలుపుతున్నారు.
ఎందుకంటే ఈ పండ్లలో సిట్రస్ కంటెంట్ ఉంటుంది. ఇది శరీరానికి హాని కలిగిస్తుంది. ఎసిడిటీ లాంటివి కలుగచేస్తాయి. అలాగే చల్లని జ్యూస్ కూడా తాగడం మంచిది కాదు. శరీరంలో శ్లేష్మ పొరలు దెబ్బతిని జీర్ణవ్యవస్థకు సంబంధించిన సమస్యలు కలుగుతాయి. చాలా మందికి ఉదయం నిద్ర లేవగానే జ్యూస్ తాగడం అలవాటు ఉంటుంది. ఇలా చేయడం వల్ల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
Also Read
- Fridge Wall Gap : ఫ్రిజ్ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
- Festival Recipes : రక్షా బంధన్ స్పెషల్.. ఇంట్లోనే సింపుల్గా కాజు కట్లీ రెడీ..!
- Paneer Bhurji Recipe: పప్పు, కూరలతో బోర్ కొడుతోందా.? అయితే "పనీర్ భుర్జీ"తో కొత్త టేస్ట్ ఆస్వాదించండి..!
- Kitchen Tips: అల్లం తొక్క క్షణాల్లో ఊడిపోవాలంటే ఈ టెక్నిక్ పాటించండి
వీటిని తాగడానికి ముందు కొంత ఆహారం తీసుకోవాలని సూచిస్తున్నారు. అంతకంటే ముందు ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిని తాగితే మంచిది. ఎందుకంటే గోరువెచ్చని నీరు శరీరంలోని మలినాలను, హానికారక క్రిములను బయటకు పంపేస్తుంది. ఉదయం వేడినీళ్ళు తాగాక కాలకృత్యాలు తీర్చుకుంటే ఆరోజంతా ఉల్లాసంగా వుంటారు. శరీరం బరువుగా కాకుండా తేలికగా మారుతుంది. కొన్ని రకాల జ్యూస్ ల వల్ల శరీరానికి అవసరమైన విటమిన్లు, మినరల్స్ వంటి పోషకాలు లభిస్తాయి. ఇవి శరీరానికి మంచి ప్రయోజనాలను ఇస్తాయి. ఉదయం నూనె పదార్ధాలు, ఫ్రైలు కాకుండా ఇడ్లీ లాంటివి లైట్ ఫుడ్ తీసుకోవాలి.
తాజావార్తలు
-
CM Vijay: పుజల్ జైలులో సీఎం విజయ్ సడన్ ఇన్స్పెక్షన్.. ఆసుపత్రి, లైబ్రరీ, కంప్యూటర్ సెంటర్ తనిఖీ
-
Suryakumar Yadav: కెప్టెన్గా విజయాల పరంపర.. కట్ చేస్తే జట్టులో చోటే లేదు.. తొలిసారి స్పందించిన సూర్య.. సంచలన వ్యాఖ్యలు
-
Nam vs SA: టీ20ల్లో సంచలనం.. సౌతాఫ్రికాను మరోసారి మట్టికరిపించిన నమీబియా.!
-
Devool Band 2: రూ.8 కోట్ల బడ్జెట్ తో రూ.100 కోట్లు కొల్లగొట్టిన మరాఠీ సినిమా.. లాభాలన్నీ రైతు కుటుంబాలకే ..
-
Nepal Floods: 5 వేల మీటర్ల ఎత్తున.. అసలేం జరిగింది? హిమాలయాల గుండెల్లో దాగిన మిస్టరీ!
ట్రెండింగ్
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!
-
Fridge Wall Gap : ఫ్రిజ్ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!