ఢిల్లీలో కాపీ కొడతారు, గల్లీకి వచ్చి తిడతారని మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. మన పథకాలు కాపీ కొట్టి దేశ వ్యాప్తంగా అమలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, రైతు బంధు పథకాలు కాపీ కొట్టి అమలు చేస్తున్నారని ఆరోపించారు.
శీతాకాల విడిది నిమిత్తం సోమవారం సాయంత్రం హైదరాబాద్లోని హకీంపేట విమానాశ్రయానికి చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు గవర్నర్ తమిళిసై, ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు ఘనస్వాగతం పలికారు.