Harish Rao: తెలంగాణకు కేంద్రం ఒక్క మెడికల్ కాలేజ్ కూడా ఇవ్వలేదు
Harish Rao Inaugurate Dialysis Centre In Choutuppal: తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఒక్క మెడికల్ కాలేజ్ కూడా ఇవ్వలేదని మంత్రి హరీశ్ రావు వ్యాఖ్యానించారు. చౌటుప్పల్లో 5 పడకల డయాలసిస్ను ప్రారంభించిన ఆయన.. మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి విజ్ఞప్తి మేరకు 5 పడకల డయాలసిస్ను ఏర్పాటు చేశామని స్పష్టం చేశారు. చౌటుప్పల్లో క్యాన్సర్ పేషంట్ల కోసం పాలియేటివ్ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. డయాలసిస్ కేంద్రాల పనితీరులో దేశంలోనే మార్గదర్శకంగా నిలబడ్డామని పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన డయాలసిస్ కేంద్రాలు, వాటి పనితీరు దేశంలో మరెక్కడా లేవన్నారు. తమిళనాడు సీఎం స్టాలిన్ తెలంగాణ పర్యటకు వచ్చినప్పుడు.. కిడ్నీ వ్యాధిగ్రస్తులకు తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న చికిత్స చూసి మెచ్చుకున్నారని, తెలంగాణ తరహాలోనే తమిళనాడులోనూ డయాలసిస్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారని తెలిపారు. కిడ్నీ వ్యాధిగ్రస్తులకు బస్ పాస్లు, ఆసరా పెన్షన్లు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రమని నొక్కి వక్కాణించారు.
Pushpa: ఆమిర్, ప్రభాస్ రికార్డులని బ్రేక్ చేసిన పుష్ప, నెక్స్ట్ టార్గెట్ షారుఖ్ ఖాన్
Also Read
- Harish Rao: ఆర్టీసీ డ్రైవర్ శంకర్గౌడ్ మృతికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిదే బాధ్యత..
- TGSRTC Driver Death: ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ మృతి.. సీఎం రేవంత్ తీవ్ర దిగ్భ్రాంతి!
- Telangana Cabinet: రాష్ట్ర కేబినెట్లో కీలక నిర్ణయాలు.. అక్కడ అతి పెద్ద స్టేడియం నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
- Telangana Cabinet: తెలంగాణ కేబినెట్లో ఆర్టీసీ కార్మికుల సమ్మెపై చర్చ.. రేపు కీలక భేటీ..
తెలంగాణ ఏర్పడిన తర్వాత 50 లక్షల డయాలసిస్ పెన్షన్లను పూర్తి చేశామని హరీశ్ రావు చెప్పారు. ఒక సంవత్సరానికి ఒక డయాలసిస్ సెంటర్ నిర్వహణకు వందకోట్ల వరకు ఖర్చు చేస్తున్నామన్నారు. రాబోవు రోజుల్లో మునుగోడు నియోజకవర్గంలో 100 పడకల ఆస్పత్రిని ప్రారంభించబోతున్నామని హామీ ఇచ్చారు. మెడికల్, పీజీ సీట్లను పెంచి.. ఎంబిబిఎస్ విద్యార్థులు విదేశాలకు వెళ్లకుండా తెలంగాణలోనే ఏర్పాటు చేసుకున్నామన్నారు. నర్సింగ్, పారామెడికల్ కాలేజీల్లో ఉద్యోగ కోర్సులు కూడా ఏర్పాటు చేసుకున్నామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం బీబీనగర్లో ఒక ఎయిమ్స్ ఆసుపత్రి ఇస్తామంటే.. తాము ఐదు కోట్ల విలువైన భూమిని ఇచ్చామని, అయితే అక్కడ ఎంబిబిఎస్ చదువుతున్న విద్యార్థులకు కనీస సౌకర్యాలను సైతం కేంద్రం కల్పించలేదని విమర్శించారు. భువనగిరి ఎయిమ్స్లో ఎమర్జెన్సీ సేవలు, బ్లడ్ బ్యాంక్, ఆపరేషన్ థియేటర్లు, గర్భిణులకు కావాల్సిన సేవలేవీ లేవన్నారు. ఒకే సంవత్సరంలో తెలంగాణలో 8 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయగా.. మరో ఎనిమిది కాలేజీలు ఏర్పాటు చేస్తామన్నారు. నల్గొండ, సూర్యాపేటలో మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేసిన చరిత్ర సీఎం కేసీఆర్దేనని హరీశ్ రావు పేర్కొన్నారు.
Balayya vs Chiranjeevi: డల్లాస్లో చిరు, బాలయ్య ఫ్యాన్స్ మధ్య గొడవ
తాజావార్తలు
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
Bengal Election: బెంగాల్లో రికార్డ్ స్థాయిలో ఓటింగ్.. ఎవరికి లాభం.. ఎవరికి నష్టం!
-
Mumbai Indians Unwanted Record: ముంబై ఇండియన్స్ అత్యంత చెత్త రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే ఇదే మొదటిసారి!
-
NBK 112 : ‘బాలయ్య-కొరటాల’ మాస్ విధ్వంసానికి ముహూర్తం ఫిక్స్
ట్రెండింగ్
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!
-
Lava Bold N1 5G కొత్త వేరియంట్ లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
Moong Dal Pakoda Recipe: శనగపిండి వాడకుండా ఆరోగ్యకరంగా, రుచిగా ఉండే ‘పెసరపప్పు పకోడీ’లను చేసేయండి ఇలా..!
-
మిడ్-రేంజ్లో ఫ్లాగ్షిప్ ఫీచర్లు.. 200MP కెమెరా, 5-స్టార్ డ్రాప్ & క్రష్ సర్టిఫికేషన్, 7000mAh బ్యాటరీతో HONOR 600 సిరీస్ లాంచ్..!
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!