ICC T20 Rankings: టీ20 ప్రపంచకప్ సెమీస్లో టీమిండియాకు ఇంగ్లండ్ రూపంలో షాక్ తగిలింది. ఫైనల్కు వెళ్లి చిరకాల ప్రత్యర్థిని ఎదుర్కొని కప్ను ముద్దాడే అవకాశాన్ని కోల్పోయింది. అయితే సెమీస్లో ఇంగ్లండ్ చేతిలో ఓడిపోయినా ఐసీసీ టీ20 ర్యాంకుల్లో మాత్రం టీమిండియా అగ్రస్థానంలోనే కొనసాగుతోంది. భారత్ ఖాతాలో 268 పాయింట్లు ఉన్నాయి. ఇంగ్లండ్ (264), పాకిస్థాన్ (258), దక్షిణాఫ్రికా (256), న్యూజిలాండ్ (253) తర్వాతి స్థానాలను ఆక్రమించాయి. దీంతో కప్ పోయినా.. ర్యాంకు మిగిలిందంటూ నెటిజన్లు సెటైర్లు…
టీ20 వరల్డ్ కప్లో మొదటి నుంచి అద్భుతంగా రాణించిన టీమిండియా సెమీస్లో ఉసూరుమనిపించింది. టీమిండియా సెమీస్లోనే వెనుదిరగడంతో క్రీడాభిమానులు నిరాశను వ్యక్తపరస్తున్నారు.
Team India: టీ20 ప్రపంచకప్ తర్వాత టీమిండియా బిజీ బిజీగా గడపనుంది. ఈ మేరకు న్యూజిలాండ్లో టీమిండియా పర్యటించనుంది. అక్కడ వన్డేలు, టీ20లు ఆడనుంది. అయితే ఈ రెండు సిరీస్ల నుంచి స్టార్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, మహ్మద్ షమీకి సెలక్టర్లు విశ్రాంతి ఇచ్చారు. అయితే ఆశ్చర్యకరంగా న్యూజిలాండ్ పర్యటన తర్వాత సొంతగడ్డపై బంగ్లాదేశ్తో ఆడనున్న టెస్టులు, వన్డేలకు మాత్రం స్టార్ ఆటగాళ్లను సెలక్టర్లు ఎంపిక చేశారు. నవంబర్ 18 నుంచి…