IND vs NZ 1st T20: టాపార్డర్ విఫలం.. భారత్ ఘోర పరాజయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India Lost First T20I Match Against New Zealand: జేఎస్సీఏ ఇంటర్నేషనల్ స్టేడియం కాంప్లెక్స్ వేదికగా న్యూజిలాండ్తో జరిగిన తొలి టీ20 మ్యాచ్లో భారత్ ఘోర పరాజయం చవిచూసింది. ప్రత్యర్థి జట్టు కివీస్ కుదిర్చిన 177 పరుగుల లక్ష్యాన్ని భారత్ చేధించలేకపోయింది. టాపార్డర్ ఘోరంగా విఫలం కావడం వల్లే, భారత్ ఈ పరాభావాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. మధ్యలో సూర్యకుమార్ యాదవ్, వాషింగ్టన్ సుందర్ మంచి ప్రదర్శనలు కనబరిచి ఆశలు చిగురించినా.. చివరికి అవి నీరుగారిపోయాయి. మిగిలిన బ్యాటర్లు సైతం పెద్దగా రాణించలేకపోయారు. దీంతో భారత్ 21 పరుగుల తేడాతో ఓటమి చవిచూడాల్సి వచ్చింది.
Peas: శనగలతో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు.. రోజూ విడిచిపెట్టరు
Also Read
- Mohammed Siraj: భారత జట్టులో కీలక మార్పు.. సిరాజ్ ఔట్.. అసలు విషయం ఇదే..!
- SL A vs Ind A: 100వ మ్యాచ్లో శతకంతో చెలరేగిన రుతురాజ్ గైక్వాడ్.. భారత్ స్కోర్ ఎంతంటే.?
- Vaibhav Sooryavanshi: సచిన్ రికార్డు బద్దలు.. కానీ ఆ ఒక్క మార్క్ను అందుకోలేకపోయిన వైభవ్!
- Ben Stokes: ఒక్క తప్పిదం.! కెప్టెన్ గానే కాదు.. జట్టులో స్థానం కూడా ప్రశ్నార్థకం..
తొలుత టాస్ గెలిచి భారత్ బౌలింగ్ ఎంపిక చేసుకోగా.. న్యూజిలాండ్ బ్యాటింగ్ చేసేందుకు రంగంలోకి దిగింది. ఓపెనర్లు ఫిన్ అలెన్ (35), డెవాన్ కాన్వే (52)లతో పాటు మిడిలార్డర్లో వచ్చిన డేరిల్ మిచెల్ (59 నాటౌట్) బాగా రాణించడంతో.. నిర్ణీత 20 ఓవర్లలో కివీస్ ఆరు వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. అనంతరం 177 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్కు ఆదిలోనే ఝలక్లు తగిలాయి. టాపార్డర్ దారుణంగా విఫలమైంది. కివీస్ బౌలర్ల ధాటికి భారత్ వెనువెంటనే మూడు వికెట్లు కోల్పోయింది. అప్పుడు క్రీజులోకి వచ్చిన సూర్యకుమార్ యాదవ్.. కష్టాల్లో ఉన్న జట్టుని గట్టెక్కించాడు. తన అద్దిరిపోయే షాట్లతో పరుగుల వర్షం కురిపించి.. భారత్ స్కోర్ బోర్డును ముందుకు కదిలించాడు. అయితే.. అతడు ఔటయ్యాక భారత్ మళ్లీ కష్టాల్లో పడింది.
Prostitution : హైటెక్ వ్యభిచారం గుట్టు రట్టు.. బాలీవుడ్ సినీ రచయిత అరెస్ట్
ఆ సమయంలో వాషింగ్టన్ సుందర్ భారత్కి మళ్లీ ఊపిరి పోశాడు. క్రీజులోకి వచ్చినప్పటి నుంచి కివీస్ బౌలర్లపై అతడు విరుచుకుపడ్డాడు. 28 బంతుల్లోనే 5 ఫోర్లు, 3 సిక్సుల సహాయంతో 50 పరుగులు చేశాడు. అతడు క్రీజులో ఉన్నంతవరకు భారత్ గెలవొచ్చన్న ఆశలు చిగురించాయి. కానీ.. అర్థశతకం చేసిన వెంటనే అతడు పెవిలియన్ బాట పట్టాడు. దాంతో.. భారత్ ఓటమి ఖాయమైంది. వచ్చినవాళ్లు వచ్చినట్టే ఔటయ్యారే తప్ప, ఎవ్వరూ ఖాతా తెరువలేదు. దీంతో.. భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 155 పరుగులే చేసింది. నిజానికి.. 177 లక్ష్యం పెద్దదేమీ కాదు. సునాయాసంగానే దాన్ని చేధించొచ్చు. కానీ.. సుందర్, సూర్య మినహా ఎవ్వరూ రాణించకపోయేసరికి భారత్ ఓటమిపాలైంది.
తాజావార్తలు
-
Driving License: ఇక లైసెన్స్ టెన్షన్ తీరినట్లే.. ఏకంగా 50 ఏళ్లపాటు చెల్లుబాటు అయ్యేలా సరికొత్త ప్లాన్!
-
India – Oman Gas Pipeline: ఇక, హార్మూజ్తో నో లింక్.. గల్ఫ్ నుంచి నేరుగా గ్యాస్ సరఫరా..! భారత ఇంధన రంగానికి గేమ్ ఛేంజర్..
-
India Rank: ప్రపంచ టాప్-5 సైనిక శక్తుల్లో భారత్.. భారీగా అణ్వాయుధాలు, రక్షణ వ్యయం..
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి
-
పార్లమెంట్లో 2/3 మెజారిటీనే టార్గెట్.. డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం బీజేపీ వ్యూహం..
ట్రెండింగ్
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!
-
India Fertility Rate: యువ భారత్కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!
-
7.7 మి.మీ. మందం, 5200mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే కేవలం రూ.11,999లకే.. Infinix Smart 20 లాంచ్.!