IND vs SL 2nd ODI: శ్రీలంకపై భారత్ విజయం.. సిరీస్ కైవసం
India Won ODI Series Against Sri Lanka: ఈడెన్ గార్డెన్స్ వేదికగా శ్రీలంకతో జరిగిన రెండో వన్డే మ్యాచ్లో భారత్ విజయం సాధించింది. లంక కుదిర్చిన 216 పరుగుల లక్ష్యాన్ని.. ముక్కుతూ, మూలుగుతూ అతి కష్టం మీద భారత్ చేధించింది. టాపార్డర్ చేతులు ఎత్తేసిన నేపథ్యంలో.. కేఎల్ రాహుల్ (64) భారత్కి అండగా నిలిచాడు. హార్దిక్ పాండ్యాతో కలిసి మంచి భాగస్వామ్యం నెలకొల్పాడు. అఫ్కోర్స్.. అతడు మరీ నిదానంగా రాణించినప్పటికీ, కష్టాల్లో ఉన్న భారత్ని ఆదుకోవడం కోసం కీలక ఇన్నింగ్స్ ఆడాడు. లక్ష్యం కూడా చిన్నదే కాబట్టి, ఆచితూచి రాణించాడు. చివరివరకూ క్రీజులోనే ఉంటూ, ఇతర ఆటగాళ్లతో మంచి పార్ట్నర్షిప్లు నెలకొల్పుతూ.. భారత్కి విజయాన్ని అందించాడు.
Putin: “పుతిన్కు నెక్ట్స్ బర్త్ డే ఉండదు”.. వాళ్లే చంపుతారు.. రష్యా ప్రతిపక్ష నేత సంచలన వ్యాఖ్యలు..
Also Read
- మరోసారి వక్రబుద్ధి బయట పెట్టిన పాకిస్తాన్.. Vaibhav Sooryavanshi బ్యాట్లో AI చిప్ అంటూ కారుకూతలు.!
- Angkrish Raghuvanshi: కోపం ఖరీదు.. 20% మ్యాచ్ ఫీజు జరిమానా.!
- Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
- IPL 2026లో కొంపముంచుతున్న క్యాచ్ డ్రాప్లు.. మారిపోతున్న మ్యాచ్ల లెక్కలు..
తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంపిక చేసుకున్న శ్రీలంక.. భారత బౌలర్ల ధాటికి కేవలం 215 పరుగులకే కుప్పకూలింది. మొదట్లో నువానిదు ఫెర్నాండో (50), కుసల్ మెండిల్ (34) కలిసి అద్భుతంగా రాణించినప్పటికీ.. ఆ తర్వాత వచ్చిన ఆటగాళ్లెవ్వరూ సత్తా చాటలేకపోయారు. భారత బౌలర్ల దెబ్బకు.. క్రీజులోకి వచ్చినట్టే వచ్చి పెవిలియన్ బాట పట్టారు. మధ్యలో వచ్చిన దునిత్ (32) ఒక్కడే కాస్త పర్వాలేదనిపించాడు కానీ, మిగతా వాళ్లు చేతులెత్తేశారు. గత వన్డేలో సెంచరీతో చెలరేగిన షణక ఈ మ్యాచ్లో మళ్లీ సేమ్ మ్యాజిక్ రిపీట్ చేస్తాడని భావిస్తే.. అతడు కూడా నిరాశపరిచాడు. కేవలం 2 పరుగులకే ఔట్ అయ్యాడు. దీంతో.. శ్రీలంక జట్టు 39.4 ఓవర్లలోనే 215 పరుగులకి ఆలౌట్ అయ్యింది. బౌలర్లలో కుల్దీన్, సిరాజ్లు లంక బ్యాటర్లకు ముచ్చెమటలు పట్టించారు.
Flipkart Fined: డెలివరీ చేయలేదు ఫోన్.. పడింది ఫైన్..
ఇక 216 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్కి లంక బౌలర్లు గట్టి షాక్లే ఇచ్చారు. టాపార్డర్ని కుప్పకూల్చారు. ఈ దెబ్బకు టీమిండియా కష్టాల్లో పడింది. అప్పుడు కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా కలిసి జట్టుని ఆదుకున్నారు. ఇద్దరు కలిసి ఐదో వికెట్కి 75 పరుగుల భాగస్వామ్యాన్ని జోడించారు. వీరి పుణ్యమా అని, కష్టాల్లో ఉన్న భారత జట్టు గట్టెక్కింది. ముఖ్యంగా కేఎల్ రాహుల్ వెన్నెముకలాగా నిలబడ్డాడు. అక్షర్ పటేల్తోనూ అతడు మంచి పార్ట్నర్షిప్ జోడించాడు. చివరగా కుల్దీప్ యాదవ్తో కలిసి.. భారత్ని గెలిపించాడు. ఈ మ్యాచ్ గెలవడంతో.. మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ భారత్ కైవసం అయ్యింది. భారత్ స్కోర్: 219/6.
Minister KTR: పారిశ్రామిక దిగ్గజాలతో కేటీఆర్ భేటీ.. పెట్టుబడులపై చర్చ
తాజావార్తలు
-
Amrit Bharat Express: రైల్వే ప్రయాణికులు శుభవార్త.. పట్టాలపైకి మరో రెండు అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు..
-
Sorakaya Garelu Recipe: కరకరలాడే కమ్మని సొరకాయ గారెలు.. 10 నిమిషాల్లో ఇలా రెడీ చేసేయండి.!
-
Petrol Shortage: పెట్రోల్ బంకుల్లో నిబంధనలు.. ద్విచక్ర వాహనానికి రూ.200, కారుకు రూ.1000 మాత్రమే..
-
Sun Pharma: అమెరికా గడ్డపై భారత ఫార్మా జెండా.. లక్ష కోట్లతో దిగ్గజ కంపెనీని కొనుగోలు చేసిన సన్ ఫార్మా!
-
వందేళ్ల వైభవానికి అరుదైన గౌరవం.. Andhra Universityకు కేంద్రం ప్రత్యేక గుర్తింపు
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!