BJP: బీహార్లో ఎన్డీయే కూటమి సంచలన విజయం దిశగా దూసుకెళ్తోంది. 243 సీట్లలో ఏకంగా 190+ స్థానాల్లో లీడింగ్లో ఉంది. ఆర్జేడీ+కాంగ్రెస్ పార్టీల ‘‘మహాఘట్బంధన్’’ కూటమి ఘోర పరాజయం దిశగా వెళ్తోంది. కేవలం 50 లోపు స్థానాలకు మాత్రమే పరిమితం అవ్వడం తేజస్వీ యాదవ్, రాహుల్ గాంధీలను షాక్కు గురిచేస్తోంది. బీహార్ ఎన్డీయే విజయంపై బీజేపీ, జేడీయూ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Minister Atchannaidu: పత్తి రైతుల సమస్యలపై కేంద్ర టెక్స్టైల్ మంత్రి గిరిరాజ్ సింగ్ కు లేఖ రాశారు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు. మొంథా తుఫాన్ ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా పత్తి పంట తీవ్రంగా దెబ్బతిన్నదని లేఖలో పేర్కొన్నారు. రైతులు ప్రస్తుతం కనీస మద్దతు ధర (MSP) కంటే తక్కువ ధరలకు పత్తిని విక్రయించాల్సి వస్తోందని అచ్చెన్నాయుడు ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 2025–26 ఖరీఫ్ సీజన్లో 4.56 లక్షల హెక్టార్లలో పత్తి సాగు జరుగుతుందని, దాదాపు…
Giriraj Singh: బ్రిటీష్ కాలం నుంచి అమలులో ఉన్న అస్సాం అసెంబ్లీలోని రెండు గంటల నమాజ్ విరామాన్ని హిమంత బిశ్వ శర్మ ప్రభుత్వం ఎత్తేసింది. ఈ నిర్ణయాన్ని కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ శనివారం ప్రశంసించారు.
బీహార్లో కేంద్రమంత్రి గిరిరాజ్సింగ్పై ఓ వ్యక్తి దాడికి యత్నించాడు. దీంతో అక్కడే ఉన్న బీజేపీ శ్రేణులు అడ్డుకోవడంతో తప్పించుకున్నారు. ఒక పబ్లిక్ ఈవెంట్లో ఈ ఘటన జరిగింది. మంత్రి కార్యక్రమాన్ని ముగించుకుని వస్తుండగా ఈ ఘటన జరిగింది. మైక్రోఫోన్ను లాక్కొని కేంద్రమంత్రిపై పిడిగుద్దులు కురిపించేందుకు ప్రయత్నించాడు.
బెంగాల్లో ప్రజాస్వామ్యం లేదు.. ఉత్తర కొరియా నియంత కిమ్ జాంగ్ ఉన్ లాంటి ప్రభుత్వాన్ని మమతా బెనర్జీ నడిపిస్తున్నట్లు కనిపిస్తోంది అని కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ అన్నారు.
BJP: బీహార్ రాజకీయంలో కేంద్రమంత్రి, బీజేపీ నేత గిరిరాజ్ సింగ్ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే రేపుతున్నాయి. బీహార్ ముఖ్యమంత్రి నితిష్ కుమార్ పార్టీ జేడీయూ, లాలూ ప్రసాద్ యాదవ్ పార్టీ ఆర్జేడీలు త్వరలో విలీనం అవుతాయంటూ కేంద్రమంత్రి శనివారం వ్యాఖ్యలు చేయడం సంచలనంగా మారింది.
కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హిందువులు హలాల్ మాంసాన్ని తినకూడదు.. ఒక్క ఝట్కా ( ఒక్క వేటుతో జంతువులను చంపడం )తో జంతువులను వధించడం ద్వారా లభించే ఝట్కా మాంసాన్ని మాత్రమే తినాలని ఆయన చెప్పుకొచ్చారు.
BJP: పార్లమెంట్ భద్రతా ఉల్లంఘనపై ప్రతిపక్షాల విమర్శలకు అధికార బీజేపీ ఘాటుగా స్పందిస్తోంది. ఈ వ్యవహారాన్ని ప్రతిపక్షాలు రాజకీయం చేయాలని చూస్తున్నాయంటూ మండిపడింది. తాజాగా కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ శనివారం ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీని టార్గెట్ చేస్తూ ఘాటు విమర్శలు చేశారు. పార్లమెంట్ చొరబాటుదారులు ముస్లింలైతే పరిస్థితి మరోలా ఉండేదని జేడీయూ, ఎంఐఎం, కాంగ్రెస్ పార్టీలు ఆరోపించిన నేపథ్యంలో వారికి కేంద్రమంత్రి సమాధానం ఇచ్చారు.
తిరుపతి గాంధీభవన్ లో ఘనంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకల్లో పాల్గొన్న కేంద్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీ శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.