Giriraj Singh: ‘‘హిందువులు ఎప్పుడూ సెలవులను డిమాండ్ చేయరు’’.. నమాజ్ బ్రేక్ రద్దుపై కేంద్రమంత్రి..
- నమాజ్ బ్రేక్ ఎత్తేసిన అస్సాం ప్రభుత్వంపై కేంద్రమంత్రి ప్రశంసలు..
- అందరికి ఒకేలా చట్టాలు ఉండాలన్న గిరిరాజ్ సింగ్..
- హిందువులు ఎప్పుడూ సెలవుల్ని డిమాండ్ చేయరు..
- ఇండియా కూటమి అధికారంలోకి వస్తే దేశం మరో పాకిస్తాన్- బంగ్లాదేశ్ అవుతుంది.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Giriraj Singh: బ్రిటీష్ కాలం నుంచి అమలులో ఉన్న అస్సాం అసెంబ్లీలోని రెండు గంటల నమాజ్ విరామాన్ని హిమంత బిశ్వ శర్మ ప్రభుత్వం ఎత్తేసింది. ఈ నిర్ణయాన్ని కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ శనివారం ప్రశంసించారు. మతం ఆధారంగా ప్రాధాన్యత ఇవ్వకూడదని అననారు. ఈ చర్య తీసుకున్న అస్సాం సీఎం, అసెంబ్లీ స్పీకర్, ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. చట్టంలో ఏకరూపత కలిగి ఉండటం చాలా అవసరం మరియు ఏ మత సమాజానికి ప్రాధాన్యత ఇవ్వకూడదని ఆయన బీహార్ బెగుసరాయ్లో మాట్లాడారు.
Read Also: Maharashtra: సోదరిని ముక్కలు ముక్కలుగా నరికి నదిలో పడేసిన తమ్ముడు..
Also Read
- Explainer: రెస్టారెంట్ కిచెన్లో బొద్దింకల కాపురం..ఈగల సంసారం.. మీరు తింటున్నది ఇదే!
- Jharkhand Student Protest: జార్ఖండ్లో ఉద్రిక్తంగా మారిన నిరుద్యోగుల పోరు.. అర్ధరాత్రి పోలీసులు ఎందుకు వచ్చారు?
- Air India Incident: గంజాయి సేవించి విమానం నడిపాడు.. డ్రగ్ టెస్టులో పైలెట్ ఫెయిల్.!
- IEA: మహిళలే మోడీని గెలిపించారు.. ఉజ్వల పథకంపై అంతర్జాతీయ ప్రశంసలు..
హిందుత్వవాదిగా పేరున్న గిరిరాజ్ సింగ్, అస్సాం ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న ఇండియా కూటమి నేతలపై ఫైర్ అయ్యారు. ప్రతిపక్షాలు ఇదే విధంగా ఏదో రోజు భారత్ని పాకిస్తాన్, బంగ్లాదేశ్గా మారుస్తారని అన్నారు. రాహుల్ గాంధీ, అఖిలేష్ యాదవ్, తేజస్వి యాదవ్ వంటి నాయకులు ముస్లిం ఓటు బ్యాంకుకు ఛాంపియన్లని ఎద్దేవా చేశారు. వారు తమ మార్గంలోనే ఉంటే ప్రతీ శుక్రవారం దేశవ్యాప్తంగా సెలవు ఇచ్చేవారని దుయ్యబట్టారు.
హిందువులు వారంలో చాలా రోజులను పవిత్రంగా జరుపుకుంటారని, కానీ ఎప్పుడూ సెలవు కోరుకోరని గిరిరాజ్ సింగ్ అన్నారు. హిందువులు శివుడిని పూజించే సోమవారం, హనుమంతుడిని పూజించే మంగళవారం సెలవుల్ని కోరుకోరని చెప్పారు. ప్రతిపక్ష ఇండియా కూటమి అధికారంలోకి వస్తే దేశాన్ని పాకిస్తాన్, బంగ్లాదేశ్లా మారుస్తారని అన్నారు. అస్సాంలో 1937లో ముస్లిం లీగ్కి చెందిన సయ్యదు సాదుల్లా జుమ్మా సమయంలో 2 గంటల విరామాన్ని ప్రకటించారు. అప్పటి నుంచి కొనసాగుతున్న ఈ పద్ధతిని తొలగించారు.
తాజావార్తలు
-
Bhadradri Kothagudem: తీవ్ర విషాదం.. వేటగాళ్ల విద్యుత్ ఉచ్చుకు ఫారెస్ట్ ఆఫీసర్ బలి!
-
Mecca Pact Explained: పాకిస్థాన్ పాచికలు చెల్లవు.. మక్కా ఒప్పందం వెనుక ఉన్న అసలు రహస్యం ఇదే!
-
Explainer: టాటా నానో రీఎంట్రీ..!? ఆటోమొబైల్ ఇండస్ట్రీలో మరో అద్భుతం!
-
Tabu AI Deepfake Case: ఏఐ వీడియోలపై కోర్టుకెక్కిన టబు.. 150 లింకులపై కీలక ఆదేశాలు!
-
Explainer: రెస్టారెంట్ కిచెన్లో బొద్దింకల కాపురం..ఈగల సంసారం.. మీరు తింటున్నది ఇదే!
ట్రెండింగ్
-
4K 180Hz డిస్ప్లేతో 55, 65, 75 అంగుళాల్లో Hisense UR8S MiniLED TVలు లాంచ్..!
-
9,070mAh బ్యాటరీ, IP69 రేటింగ్, AMOLED డిస్ప్లేతో REDMI K100 Pro Max లాంచ్..!
-
200MP ట్రిపుల్ కెమెరా సెటప్, 8,580mAh బ్యాటరీ, 185Hz డిస్ప్లేతో REDMI K100 Pro లాంచ్.. ధర ఎంతంటే?
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!