Union Minister Giriraj Singh: హిందువులు అలాంటి మాంసం తినొద్దు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హిందువులు హలాల్ మాంసాన్ని తినకూడదు.. ఒక్క ఝట్కా ( ఒక్క వేటుతో జంతువులను చంపడం )తో జంతువులను వధించడం ద్వారా లభించే ఝట్కా మాంసాన్ని మాత్రమే తినాలని ఆయన చెప్పుకొచ్చారు. బీహార్లోని తన పార్లమెంటరీ నియోజకవర్గమైన బెగుసరాయ్లో ప్రజలను ఉద్దేశించి కేంద్రమంత్రి ఈ కామెంట్స్ చేశారు. హిందువుల ఆహార ఆచారాలకు కట్టుబడి ఉండాలని గిరిరాజ్ సింగ్ వెల్లడించారు.
Read Also: Salaar Release Trailer: ఎన్నిసార్లు వాయిదా వేస్తారండీ?
Also Read
- Niti Aayog: నీతి ఆయోగ్ కొత్త సీఈవోగా అనురాగ్ జైన్ నియామకం.. కేంద్రం ఉత్తర్వులు
- Cab Driver: నమ్మించి వంచించాడు.. నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి ఎయిర్లైన్స్ ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ దాడి..
- Uday Krishna Reddy: అనాథగా పెరిగి ఐపీఎస్ దాకా.. ముఖ్యమంత్రిచే ప్రశంసలు.. ఉదయ్ కృష్ణారెడ్డి బ్యాగ్రౌండ్ తెలిస్తే కన్నీళ్లు ఆగవు!
- Donald Trump: ఇరాన్ వంతెనలు, విద్యుత్ కేంద్రాలే టార్గెట్.. హార్ముజ్పై ట్రంప్ వార్నింగ్..
ఇక, హలాల్ మాంసాన్ని తినకుండా ప్రతిజ్ఞ చేయాలని తన మద్దతుదారులను కేంద్ర గిరిజన మంత్రిత్వ శాఖ గిరిరాజ్ సింగ్ కోరారు. కేవలం హలాల్ మాంసాన్ని మాత్రమే తినే ముస్లింలను నేను అభినందిస్తున్నాను అంటూ ఆయన చెప్పారు. ఇప్పుడు హిందువులు తమ మత సంప్రదాయాల పట్ల ఇదే విధమైన నిబద్ధతను కలిగి ఉండాలని పేర్కొన్నారు. హిందువులు జంతుబలి ఇచ్చినప్పుడల్లా ఒకే దెబ్బతో చంపుతుంటారు.. అలాగని హిందువులు హలాల్ మాంసాన్ని తిని తమను తాము భ్రష్టు పట్టించుకోకూడదంటూ కేంద్రమంత్రి తెలిపారు. వారు ఎల్లప్పుడూ ఝట్కా మాంసం తినేందుకు కట్టుబడి ఉండాలి అని గిరిరాజ్ సింగ్ సూచించారు.
Read Also: Joe Biden Car Crash: భద్రతా వైఫల్యం.. జో బైడెన్ కాన్వాయ్ను ఢీకొన్న కారు!
అయితే, కేవలం ఝట్కా మాంసాన్ని అమ్మేందుకు మాత్రమే రిటైల్ ఔట్లెట్లను ఏర్పాటు చేసే కొత్త వ్యాపార నమూనా వైపు మళ్లాలని కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ వ్యాపారులను చెప్పారు. ఈ విషయంపై కొన్ని వారాల క్రితం బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్కు సైతం లేఖ రాశారు.. ఉత్తర ప్రదేశ్లోని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం లాగా హలాల్ అని లేబుల్ చేసిన ఆహార ఉత్పత్తుల అమ్మకాలపై నిషేదం విధించాలని ఆయన వేడుకున్నారు. హిందువులు తమకు ఖాళీ సమయం దొరికినప్పుడల్లా సాయంత్రం పూట దేవాలయాన్ని సందర్శించాలి అని స్థానికులకు కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ వెల్లడించారు.
తాజావార్తలు
-
Criminal Lawyer: కోర్టులో లాయర్.. బయట గంజాయి స్మగ్లర్! పుష్ప స్టైల్లో స్మగ్లింగ్..
-
TG-AP THEFTS: తెలుగు రాష్ట్రాల్లో రెచ్చిపోయిన దోపిడీ దొంగలు.. నిమిషాల్లోనే ఎలా చక్కబెట్టారంటే..!
-
Niti Aayog: నీతి ఆయోగ్ కొత్త సీఈవోగా అనురాగ్ జైన్ నియామకం.. కేంద్రం ఉత్తర్వులు
-
Kaylee Hottle: హాలీవుడ్లో విషాదం.. ‘గాడ్జిల్లా వర్సెస్ కాంగ్’ ఫేమ్ కేలీ హాటిల్ కన్నుమూత
-
Cab Driver: నమ్మించి వంచించాడు.. నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి ఎయిర్లైన్స్ ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ దాడి..
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!