RSS: దేశ ద్రోహులు ఆర్ఎస్ఎస్ను అర్థం చేసుకునే అవకాశం లేదు.. !
- దేశ ద్రోహులు ఆర్ఎస్ఎస్ ను అర్థం చేసుకోలేరంటూ కేంద్రమంత్రి ఆగ్రహం..
- భారత్ పరువు తీసేందుకే రాహుల్ గాంధీ విదేశీ పర్యటనలు చేస్తారు..
- రాహుల్ లాంటి వారు ఎన్నో జన్మలు ఎత్తిన ఆర్ఎస్ఎస్ విధానాలను అర్థం చేసుకోలేరు: గిరిరాజ్ సింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
RSS: ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న రాహుల్ గాంధీ కేంద్రం ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. టెక్సాస్లోని యూనివర్సిటీలో ప్రవాస భారతీయులతో ముచ్చటిస్తూ.. ప్రధాని మోడీ, బీజేపీ, ఆర్ఎస్ఎస్పై విమర్శలు చేశారు. అయితే, రాహుల్ కామెంట్స్ పై బీజేపీ ఘాటుగా రియాక్ట్ అయింది. ఇతర దేశాల్లో భారతదేశాన్ని అవమానించే అలవాటు ఆయనకీ ముందు నుంచే ఉందంటూ మండిపడింది. ఈ మేరకు కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ మాట్లాడుతూ.. దేశ ద్రోహులు ఆర్ఎస్ఎస్ ను అర్థం చేసుకోలేరని సీరియస్ అయ్యారు. భారత్ పరువు తీసేందుకే రాహుల్ విదేశీ పర్యటనలు చేస్తారని అన్నారు.
Read Also: Box Office: రచ్చ రేపుతున్న శనివారం.. పాపం గోట్!
Also Read
- IMD Alert: దేశవ్యాప్తంగా భారీ వర్షాల హెచ్చరిక.. 3 రాష్ట్రాలకు రెడ్ అలర్ట్
- Pralhad Joshi: ధర్మేంద్ర ప్రధాన్ వారసుడిగా ప్రహ్లాద్ జోషి.. కొత్త విద్యాశాఖ మంత్రిగా నియామకం
- Indai: దేశ చరిత్రలో రాజీనామాలు చేసిన కేంద్రమంత్రులు ఎవరంటే..!
- CJP Protest: అభిజిత్ హీరో.. సోనమ్ జీరోనా..? వాంగ్చుక్ను పట్టించుకోని సీజేపీ..
ఇక, ఆర్ఎస్ఎస్ విధానాల గురించి తెలుసుకోవాలంటే రాహుల్ లాంటి వారికి ఎన్నో జన్మలు ఎత్తాల్సి వస్తోందని కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ అన్నారు. విదేశాలకు వెళ్లి దేశాన్ని విమర్శించే వారికి ఆర్ఎస్ఎస్ భావజాలం గురించి తెలుసుకునే అవకాశం లేదు.. రాహుల్ ఎప్పటికీ ఆ వ్యవస్థ విధానాలను అర్థం చేసుకోరు.. ఆర్ఎస్ఎస్ భారతదేశ విలువలు, సంస్కృతి నుంచి పుట్టిందన్నారు. కాగా, అంతకముందు రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. భారత్ అంటే ఒకే ఆలోచన, భావజాలం అని ఆర్ఎస్ఎస్ నమ్ముతుంది, మహిళలు కేవలం ఇంటి పనికి, వంట పనికి మాత్రమే పరిమితమని భావిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత సంప్రదాయాలు, భాషలపై బీజేపీ దాడి చేస్తోందని ఆయన ఆరోపించారు. లోక్సభ ఎన్నికల ఫలితాల తర్వాత దేశంలో బీజేపీ, ఆర్ఎస్ఎస్పై వ్యతిరేక పోరాటం స్పష్టంగా కనిపించిందని రాహుల్ గాంధీ విమర్శించారు.
తాజావార్తలు
-
OTR : రాజ్యసభ ఎంపీ గొల్ల బాబూరావు అసంతృప్తి? వైసీపీలో ప్రాధాన్యం లేదంటూ ఫీల్!
-
IMD Alert: దేశవ్యాప్తంగా భారీ వర్షాల హెచ్చరిక.. 3 రాష్ట్రాలకు రెడ్ అలర్ట్
-
CM Revanth Reddy : జెన్-జీ గెలిచింది.. మోడీ తలవంచారన్న రేవంత్!
-
OTR: కోమటిరెడ్డి బ్రదర్స్ కు తుంగతుర్తి ఎమ్మెల్యే సీరియస్ వార్నింగ్..! అసలు ఏం జరిగింది ?
-
OTR: జనగామ కాంగ్రెస్లో వర్గపోరు.. డీసీసీ vs నియోజకవర్గ ఇంచార్జ్ వార్!
ట్రెండింగ్
-
Parents Alert: రోజూ ఫ్రూట్ జ్యూస్ ఇస్తున్నారా? పిల్లల్లో ఈ ప్రమాదం 52% పెరుగుతుందట.!
-
Easy Wall Cleaning Tips: గోడలపై మరకలా? ఖరీదైన క్లీనర్లు వద్దు.. ఇంట్లో ఉన్నవే చాలు.!
-
Smart Money Rules: జీవితాన్ని మార్చే స్మార్ట్ ‘మనీ రూల్స్’.! ఆర్థికంగా బలపడాలంటే తప్పక తెలుసుకోవాల్సిన సూత్రాలు ఇవే..
-
12.1 అంగుళాల 2.5K డిస్ప్లే, 10,200mAh బ్యాటరీతో రానున్న Moto Pad 70.!
-
3.2 అంగుళాల టచ్స్క్రీన్, Doubao AIతో HMD Touch AI ఫీచర్ ఫోన్ లాంచ్.!