Ponnam Prabhakar : తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆత్మీయ పండుగలలో ఒకటైన బోనాల పండుగను ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేపట్టింది. ఈ ఏడాది తొలి బోనం జూన్ 26న చారిత్రాత్మక గోల్కొండ కోటలో ప్రారంభం కానుందని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. తర్వాత వరుసగా బల్కంపేట ఎల్లమ్మ, ఉజ్జయిని మహంకాళి, లాల్ దర్వాజ బోనాలు జరగనున్నాయి. బోనాల పండుగను రాష్ట్ర గౌరవానికి మారు పేరుగా మార్చేందుకు ప్రభుత్వం ఇప్పటికే రూ. 20 కోట్లు…
Bar License Applications: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 24 బార్లు, మిగిలిన జిల్లాల్లోని నాలుగు బార్లకు సంబంధించిన దరఖాస్తులకు భారీ ఆదరణ లభించింది. మొత్తం 28 బార్ల టెండర్ కోసం 3,668 అప్లికేషన్లు వచ్చాయి.
హైదరాబాద్ నగరంలో జనాభా పెరుగుదల దృష్ట్యా పర్యావరణ సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని రవాణా శాఖ మంత్రి పొన్నం చొరవతో పెట్రోల్ ,డీజిల్ లేని 65 వేల కొత్త త్రి వీలర్ ఆటో రిక్షాలకు అనుమతి ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నగరంలో గత కొంతకాలంగా కొత్త ఆటో రిక్షాలకు పరిమితి ఉంది. కొత్త ఆటో రిక్షాలు పరిమిట్లు ఇవ్వడానికి లేదు. ఆ పరిమితిని సడలిస్తూ జీహెచ్ఎంసీ, ఓఆర్ఆర్ లోపల పరిమిత సంఖ్యలో ఎలక్ట్రిక్, సిఎన్జీ, ఎల్పీజీ…
GHMC : జీహెచ్ఎంసీ పరిధిలోని 24 బార్లకు మిగిలిన మూడు రోజుల వ్యవధిలో భారీగా దరఖాస్తులు వచ్చే అవకాశం ఉందని రంగారెడ్డి డిప్యూటీ కమిషనర్ పీ. దశరథ్ తెలిపారు. నాంపల్లి కార్యాలయంలో దరఖాస్తుల స్వీకరణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు చెప్పారు. ఇటీవల రూరల్ ప్రాంతాల్లో బార్లకు అనూహ్యంగా అధిక దరఖాస్తులు వచ్చాయని ఆయన తెలిపారు. మొత్తంగా జీహెచ్ఎంసీతో కలిపి 28 బార్లకు పునరుద్ధరణ కోసం దరఖాస్తులను ఆహ్వానించినట్లు పేర్కొన్నారు. ఇప్పటివరకు జీహెచ్ఎంసీ పరిధిలోని 24 బార్లకు…
అమరావతి: నేడు బెంగళూరుకు వైఎస్ జగన్. మధ్యామ్నం గన్నవరం విమానాశ్రయం నుంచి బెంగళూరుకు జగన్. అమరావతి: వైసీపీ ఆధ్వర్యంలో వెన్నుపోటు దినం నిరసన కార్యక్రమం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది సందర్భంగా కార్యక్రమం. రాష్ట్ర వ్యాప్తంగా నిరసన ర్యాలీలు చేపట్టునున్న వైసీపీ శ్రేణులు. సూపర్ సిక్స్ సహా 143 హామీలతో అధికారంలోకి వచ్చిన కూటమి. హామీలు అమలు చేయకుండా వెన్నుపోటు పొడిచారంటూ ఆరోపణలు. ఇవాళ ఏపీ వ్యాప్తంగా అత్యధిక ఉష్ణోగ్రతలు. కోస్తా జిల్లాల్లో 39-40 డిగ్రీల…
Fatehnagar Flyover: కనీస మెయింటెనెన్స్ లేక ఫతే నగర్ ఫ్లై ఓవర్ బ్రిడ్జి పెచ్చులూడుతుంది. బాలానగర్ నుంచి బల్కంపేట, సనత్ నగర్ వెళ్ళేందుకు నిర్మించిన ఫతే నగర్ బ్రిడ్జి.. రద్దీ ప్రదేశం కావడంతో ఉదయం నుంచి రాత్రి వరకు పూర్తి రద్దీతో ఉంటుంది.
Hyderabad: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రజా వాణిలో చిన్నారులు ఫిర్యాదు చేశారు. తమ ఏరియాలో ఉన్న పార్కును డెవలప్ చేయాలని అధికారులకు విన్న విన్నవించారు. ఇన్ని రోజుల పాటు కబ్జాలో ఉన్న పార్కు స్థలాన్ని పోలీసులు, అధికారులు కాపాడారని తెలిపారు.
Gulzar House: హైదరాబాద్లోని చార్మినార్ సమీపంలో చోటుచేసుకున్న గుల్జార్ హౌస్ అగ్ని ప్రమాదం పట్ల అధికార యంత్రాంగం సీరియస్గా స్పందిస్తోంది. భారీగా ప్రాణనష్టం చోటుచేసుకున్న ఈ ప్రమాదంపై దర్యాప్తు వేగవంతం చేశారు. ఇప్పటికే అనేక శాఖలు తమవంతుగా ఆధారాలను సేకరించడం ప్రారంభించాయి. ప్రస్తుతం ప్రమాద స్థలాన్ని నాగ్పూర్కు చెందిన ఫోరెన్సిక్ ఇంజనీరింగ్ బృందం పరిశీలిస్తోంది. నీలేష్ అఖండ నేతృత్వంలోని ఈ బృందం టెక్నికల్ విశ్లేషణల ద్వారా ప్రమాదానికి కారణాలపై దృష్టిసారించింది. ఈ బృందం నివేదిక కీలకంగా మారనుంది.…
CM Revanth Reddy: హైదరాబాద్ తో పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు పడుతున్నందున అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మరో మూడు రోజులు వర్షాలు పడే అవకాశముందని వాతావరణ శాఖ ఇచ్చిన సూచనలకు అనుగుణంగా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలు, మార్కెట్లలో ఉన్న ధాన్యం తడవకుండా తగిన రక్షణ చర్యలు చేపట్టాలని, కాంటాలు వేసిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు మిల్లులకు తరలించాలని అన్ని జిల్లాల కలెక్టర్లను ముఖ్యమంత్రి…
Ponnam Prabhakar : హైదరాబాద్ చార్మినార్ పరిసర ప్రాంతాల్లో గుల్జార్ హౌజ్ వద్ద ఈ నెల 18న జరిగిన అగ్ని ప్రమాదం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ దుర్ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడంతో పాటు, ఆరుగురు ఉన్నతాధికారులతో కూడిన ప్రత్యేక కమిటీని నియమించింది. ఈ నిర్ణయం నేపథ్యంలో హైదరాబాద్ ఇంచార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందిస్తూ, ప్రభుత్వ చర్యలపై స్పష్టతనిచ్చారు. ఈ విచారణ కమిటీకి జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ…