HYDRA : నగరంలో సోమవారం భారీ వర్షం కురిసింది. గంట వ్యవధిలో 7 నుంచి 8 సెంటీమీటర్ల వరకూ వర్షపాతం నమోదైంది. దీంతో రహదారులు, లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. భారీ వర్షం పడే అవకాశాలను రెండు గంటల ముందుగానే గ్రహించిన హైడ్రా కమిషనర్ క్షేత్ర స్థాయిలో ఉండే అధికారులను, సిబ్బందిని అప్రమత్తం చేశారు. ప్రజావాణి ఫిర్యాదులను పరిశీలిస్తున్న సమయంలోనే భారీ వర్షం కురవడంతో హైడ్రా కమిషనర్ నేరుగా వరద ముప్పు ఉన్న ప్రాంతాలకు వెళ్లారు. లకడికాపూల్,…
HYDRA : హైదరాబాద్ నగర అభివృద్ధిలో భాగంగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ బోరబండ, గచ్చిబౌలి, వనస్థలిపురం, బడంగిపేట తదితర ప్రాంతాల్లో నాళాలు, చెరువుల పరిస్థితిని పరిశీలించారు. ఈ సందర్భంగా పలు కీలక ఆదేశాలు, సూచనలు చేసిన ఆయన… అవసరమైన అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. బోరబండ హైటెన్షన్ రోడ్ విస్తరణ పనులపై కమిషనర్ ప్రత్యేక దృష్టి సారించారు. నాలాల్లో ఎలాంటి ఆటంకాలు లేకుండా చూడాలని, మురుగు నీరు వరద నీటిలో కలిసిపోకుండా కిందకి పోవేలా…
CM Revanth Reddy : హైదరాబాద్ సహా రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి అత్యవసరంగా అధికారులను అప్రమత్తం చేశారు. వర్షాల కారణంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. GHMC, HMDA, వాటర్ వర్క్స్ శాఖలు సమన్వయంతో పని చేయాలని ఆయన ఆదేశించారు. CM Chandrababu: “మనమీద నెట్టే రకం”.. మద్యం కుంభకోణంపై స్పందించిన సీఎం చంద్రబాబు.. మున్సిపల్ ప్రాంతాల్లో వర్షపునీటి సమస్యలు తలెత్తకుండా డైవర్షన్ పనులు,…
Hyderabad Rains : రాష్ట్ర రాజధాని హైదరాబాద్ (Hyderabad Rains) నగరంలో శుక్రవారం భారీ వర్షం కురుస్తోంది. అమీర్పేట, ఖైరతాబాద్, యూసుఫ్గూడ, ఉప్పల్, ఎల్బీనగర్, హయత్నగర్, కొత్తపేట, రాజేంద్రనగర్, ఓల్డ్ సిటీ, పంజాగుట్ట, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, శేరిలింగంపల్లి వంటి పలు ప్రాంతాల్లో వర్షం దంచికొడుతోంది. ఉరుములు, ఈదురు గాలులతో కూడిన ఈ వర్షం మరో గంటపాటు కొనసాగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం (HMD) వెల్లడించింది. భారీ వర్షం కారణంగా నగరంలోని ప్రధాన రహదారులపై నీరు…
Indiramma Canteen : తెలంగాణ ప్రభుత్వం తాజాగా ఇందిరమ్మ క్యాంటీన్లలో రూ.5కే అల్పాహారాన్ని అందించే పథకాన్ని అమలు చేయడానికి సిద్ధమైంది. ఇందిరమ్మ క్యాంటీన్లలో ఇవ్వబోయే బ్రేక్ఫాస్ట్ మెనూ గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (GHMC) సిద్ధం చేసింది. జీహెచ్ఎంసీ నిర్ణయం మేరకు ప్రజల నుంచి ఒక్కో టిఫిన్కు కేవలం రూ.5 మాత్రమే వసూలు చేయనుంది. మిగతా రూ.14 ఖర్చును ప్రభుత్వమే భరిస్తుంది. ఒక టిఫిన్కు మొత్తం ఖర్చు రూ.19గా అంచనా వేయగా, ప్రజలపై ఆర్ధిక భారం పడకుండా…
Heavy Rain: హైదరాబాద్ నగరంలో మరోసారి వర్షం బీభత్సం సృష్టిస్తుంది. నగరంలోని పలు ప్రాంతాల్లో అకస్మాత్తుగా కుండపోత వర్షాలు కురవడంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. ముఖ్యంగా జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఫిల్మ్ నగర్, కూకట్పల్లి, ఎల్బీ నగర్, మియాపూర్, అమీర్పేట, టోలిచౌకి, బీరంగూడ, పటాన్ చెరువు, బీహెచ్ఈఎల్, షేక్ పేట్, మెహిదీపట్నం, లంగర్ హౌస్, కోఠి, గచ్చిబౌలి, అత్తాపూర్ లాంటి ప్రాంతాల్లో వర్షానికి ట్రాఫిక్ తీవ్రంగా స్తంభించిపోయింది.
HYDRA : హైదరాబాద్ నగరంలోని మధురనగర్ మెట్రో స్టేషన్ సమీపంలోని ఎల్లారెడ్డిగూడలోని సాయి సారధి నగర్లో ఉన్న decades-old పార్కు స్థలాన్ని అక్రమంగా ఆక్రమించిన నిర్మాణాలను హైదరాబాద్ డెవలప్మెంట్ అథారిటీ (HYDRAA) ఆదివారం కూల్చివేసింది. వీకెండ్ స్పెషల్ డ్రైవ్లో భాగంగా ఈ చర్యలు చేపట్టారు. సాయి సారధినగర్ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఇచ్చిన ప్రజావాణి ఫిర్యాదు ఆధారంగా, హైడ్రా కమిషనర్ ఏ.వి. రంగనాథ్ ఆదేశాలతో అధికారులు రంగంలోకి దిగారు. అధికారులు నిర్వహించిన విచారణలో 1961లో రూపుదిద్దుకున్న 35…
పీజేఆర్ ఫ్లైఓవర్ ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ.. “20 నుంచి 25 ఏళ్లు నగరంలో పీజేఆర్ శకం నడిచింది.. ఇతర ప్రాంతాల నుంచి బ్రతుకు దెరువుకు వచ్చిన వారిపై ఎవరైనా దౌర్జన్యం చేసినా పీజేఆర్ అడ్డుకునేవారు.. పిలిస్తే పలికే నాయకుడు పీజేఆర్.. మంత్రిగా నిరంతరం సేవ చేస్తూ.. పేదవారికి అండగా నిలబడ్డాడు.. సీఎల్పీ నాయకుడిగా కూడా పీజేఆర్ ఎనలేని సేవ చేశాడు.. పీజేఆర్ ఇల్లు ప్రజల సమస్యలు తీర్చేందుకు…
Hyderabad: నేడు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) కార్యాలయం దగ్గర ధర్నా చేయనున్న బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు పిలుపునిచ్చారు. 5 రూపాయలకే పేదల కడుపు నింపే అన్నపూర్ణ క్యాంటీన్ల పేరు మార్చాలనే స్టాండింగ్ కమిటీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ నిరసన వ్యక్తం చేయనున్నారు.
Accident : హైదరాబాద్ శివారులోని బాచుపల్లి ప్రాంతంలో హృదయవిదారక రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మల్లంపేట సమీపంలోని పల్లవి స్కూల్ జంక్షన్ వద్ద టిప్పర్ ఒక స్కూటీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో స్కూటీపై ప్రయాణిస్తున్న ఆరేళ్ల బాలుడు అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడు అభిమన్యు రెడ్డి (6), నిజామాబాద్కు చెందినవాడు. కుటుంబంతో కలిసి ఇటీవల మల్లంపేటలో నివాసం ఉంటున్నాడు. బాలుడు గీతాంజలి ఇంటర్నేషనల్ స్కూల్లో 1వ తరగతి చదువుతున్నాడు. ఇవాళ ఉదయం మాదిరిగానే తల్లి స్కూటీపై అభిమన్యును స్కూల్కు…