High Court Serious: కార్పొరేషన్ అధికారులు కళ్లు మూసుకుని తిరుగుతుంటారా..? అధికారుల నిర్లక్ష్యంపై హైకోర్టు ఆగ్రహం..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
High Court Serious: హైదరాబాద్ నగరంలో పెరిగిపోతున్న అక్రమ నిర్మాణాలపై తెలంగాణ హైకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యంపై ప్రశ్నలు గుప్పిస్తూ, వారి వ్యవహార శైలిపై న్యాయస్థానం కఠినంగా స్పందించింది. ఒక భవన నిర్మాణ దారుడి పిటిషన్పై విచారణ సందర్భంగా హైకోర్టు.. భవనం పూర్తయ్యేంతవరకూ మున్సిపల్ అధికారులు ఏమి చేస్తున్నారు? అంటూ ప్రశ్నించింది. నిర్మాణం జరుగుతున్న సమయంలో కార్పొరేషన్ అధికారులు కళ్లు మూసుకుని తిరుగుతుంటారా? అని తీవ్ర వ్యాఖ్యలు చేసింది.
Read Also: Jawahar Navodaya: కొత్తగా ఏడు కొత్త నవోదయ విద్యాలయాలు.. జూలై 14 నుండి ప్రారంభం..!
Also Read
- Hyderabad: భాగ్యనగరంలో ఘనంగా ఆషాఢ బోనాలు ప్రారంభం.. గోల్కొండలో సందడి షురూ..
- Rohit Sharma Retirement: నేటి మ్యాచ్కు రోహిత్ పేరెంట్స్.. హిట్మ్యాన్ రిటైర్మెంట్పై క్లారిటీ ఇదిగో..
- Hyderabad: రైతుల దీక్షా శిబిరం తొలగించిన హైడ్రా.. బహదూర్గూడాలో హైటెన్షన్
- Covid 19-AP: ఏపీలో అప్రమత్తం.. ప్రత్యేక కొవిడ్ వార్డు ఏర్పాటు!
కోర్టు ఆదేశాలపై స్పందించడంలో కూడా అధికారులు తారతమ్యం చూపిస్తున్నారంటూ.. ఆదేశాలు జారీ అయిన తర్వాతే స్పీకింగ్ ఆర్డర్ ఇస్తారు, అప్పటికే భవనం నిర్మాణం పూర్తైపోతుంది. తర్వాత కూల్చివేత పేరుతో డ్రామాలు మొదలవుతాయి అంటూ హైకోర్టు వ్యాఖ్యానించింది. ప్రాంతాల వారీగా అధికారులు ఉన్నప్పటికీ, అక్రమ నిర్మాణాలు ఎలా వెలుసుతున్నాయో న్యాయస్థానం ప్రశ్నించింది. ఒకవైపు పన్నులు వసూలు చేసే సమయానికి ఆ భవనానికి సంబంధించిన సమస్త వివరాలు తెలిసిపోతాయన్న హైకోర్టు వ్యాఖ్యలు మున్సిపల్ యంత్రాంగంపై విమర్శలు ప్రదర్శించాయి.
Read Also: Digvesh Rathi: సంచలనం.. 5 బంతుల్లో 5 వికెట్లు తీసిన LSG స్పిన్నర్.. వీడియో వైరల్
ఈ వ్యవహారంలో భాగంగా శేరిలింగంపల్లి గుట్టల బేగంపేటలోని ఓ భవన నిర్మాణదారుడి పిటిషన్ను పరిశీలించిన హైకోర్టు, బిల్డింగ్ రెగ్యులరైజేషన్ స్కీమ్పై ప్రభుత్వం నిర్ణయం తీసుకునే వరకు యథాతథ స్థితి కొనసాగించాలని ఆదేశించింది. తదుపరి విచారణను వచ్చే నెలకు వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో హైకోర్టు సూచనలు, అభ్యంతరాలు మున్సిపల్ శాఖలపై ఒత్తిడిని పెంచనున్నాయని భావిస్తున్నారు. అక్రమ నిర్మాణాల నిరోధనకు చర్యలు తీసుకోవాల్సిన అవసరాన్ని కోర్టు స్పష్టంగా తెలిపింది.
తాజావార్తలు
-
Siddhanth Kapoor: శ్రద్ధా కపూర్ సోదరుడికి ఊరట.. డ్రగ్స్ కేసులో FIR కొట్టేసిన హైకోర్టు!
-
Hyderabad: భాగ్యనగరంలో ఘనంగా ఆషాఢ బోనాలు ప్రారంభం.. గోల్కొండలో సందడి షురూ..
-
Rohit Sharma Retirement: నేటి మ్యాచ్కు రోహిత్ పేరెంట్స్.. హిట్మ్యాన్ రిటైర్మెంట్పై క్లారిటీ ఇదిగో..
-
Hyderabad: రైతుల దీక్షా శిబిరం తొలగించిన హైడ్రా.. బహదూర్గూడాలో హైటెన్షన్
-
Amarnath Yatra 2026: నేటి నుంచి అమర్నాథ్ యాత్ర తాత్కాలికంగా నిలిపివేత.. మళ్లీ ఎప్పుడంటే?
ట్రెండింగ్
-
Rohit Sharma: టెన్షన్ అవసరం లేదు.. రోహిత్ శర్మ ఆడుతాడు: మోర్కెల్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!