తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో అధికార పార్టీ సత్తా చాటింది. ప్రతిపక్షాలపై స్పష్టమైన ఆధిపత్యం ప్రదర్శించింది. మెరుగైన ఫలితాల సాధనతో.. క్షేత్రస్థాయిలో కూడా కాంగ్రెస్ క్యాడర్ బలోపేతమైంది. ఈ విషయంలో రేవంత్ అండ్ టీమ్ సక్సెస్ అయ్యారని చెప్పడానికి సందేహించాల్సిన పనిలేదు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో విజయం దగ్గర్నుంచి తర్వాత కంటోన్మెంట్, జూబ్లీహిల్స్ ఉపఎన్నికలు, పంచాయతీ ఎన్నికలు, ఇప్పుడు మున్సిపోల్స్లో కాంగ్రెస్ విజయాల ఊపు కొనసాగుతోంది. అంతమాత్రాన మున్సిపల్ ఫలితాలను రెఫరెండంగా చూడలేం. ఎందుకంటే కొన్నిచోట్ల ఇది రెఫరెండం…
Off The Record: తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఘట్టం పూర్తయింది. ఇక ఫలితాలు మాత్రమే రావాల్సి ఉంది. ఈ క్రమంలో…. నో డౌట్, పూర్తి స్థాయి ఆధిపత్య ప్రదర్శన మనదే అన్న గట్టి నమ్మకంతో ఉన్నారు కాంగ్రెస్ నాయకులు. ఈ ఎలక్షన్స్కు మందు గ్రామ పంచాయతీ ఎన్నికల పర్వం ముగిసింది. పార్టీ గుర్తులతో సంబంధం లేకున్నా…. ఆ ఫలితాలతో హ్యాపీగా ఉన్నారు కాంగ్రెస్ నేతలు. ఇక చాలా రోజులుగా ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించాలని చూస్తున్నా… కొన్ని…
OTR: తెలంగాణలో మున్సిపల్ ఎలక్షన్స్కు ఎన్నికల సంఘం సమాయత్తమవుతోంది. చకచకా ప్రాసెస్ పూర్తి చేస్తున్నాయి. ఎన్నికలు జరిగే మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లకు ఛైర్ పర్సన్, మేయర్, వార్డుల రిజర్వేషన్లు సైతం ఖరారయ్యాయి. బీజేపీ కూడా పురపోరుకు సిద్దమవుతోంది. బృహన్ ముంబై కార్పొరేషన్ ఎన్నికల్లో విజయం ఉత్సాహంతో, గ్రేటర్ హైదరాబాద్తో పాటు మిగతా కార్పొరేషన్లలోనూ పాగా వేస్తామని చెబుతోంది. READ ALSO: Bangladesh: బంగ్లాదేశ్లో మరో దారుణం.. హిందూ వ్యాపారి లిటన్ దాస్ హత్య.. GHMC ఎన్నికలపై క్యాడర్కు…
GHMC Delimitation: జీహెచ్ఎంసీ డీలిమిటేషన్ అంశం న్యాయస్థానానికి చేరింది. 300 డివిజన్లకు సంబంధించిన వార్డు మ్యాప్లు, జనాభా వివరాలను 24 గంటల్లో పబ్లిక్ డొమైన్లో ఉంచాలని హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును రాష్ట్ర ప్రభుత్వం డివిజన్ బెంచ్లో సవాల్ చేసింది. సింగిల్ బెంచ్ ఆదేశాలు అమలైతే పాలనా పరంగా ఇబ్బందులు ఎదురవుతాయని ప్రభుత్వం తన పిటిషన్లో పేర్కొంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ వాదనలు, పిటిషనర్ల అభ్యంతరాలను పరిశీలించిన హైకోర్టు డివిజన్ బెంచ్ మధ్యంతర ఉత్తర్వులు జారీ…
గొప్ప విజనరీ ఉన్న నేత, స్మితప్రజ్ఞశాలీ మోడీ అని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. స్కాములకు నిదర్శనం కాంగ్రెస్ పార్టీ అని విమర్శించారు. కాంగ్రెస్ చరిత్రంత అవినీతి చరిత్ర.. ఎండ్లకు ఏండ్లు అవమాన పడి, కొట్లాడి, ఎదురునిలిచి త్యాగాలు చేసి తెలంగాణను సాధించుకున్నామని గుర్తు చేశారు. రేవంత్ వల్ల తెలంగాణ ఆతగౌరవం దెబ్బతిన్నదని ఆరోపించారు. రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని అవమానపరిచారన్నారు..
GHMC : హైదరాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఎంఐఎం) పార్టీ ఘన విజయం సాధించింది. ఎన్నికల్లో ఎంఐఎం అభ్యర్థి మీర్జా రియాజ్ఉల్ హాసన్ 63 ఓట్లు సాధించి, తన సమీప ప్రత్యర్థి, బీజేపీ అభ్యర్థి గౌతమ్రావు (25 ఓట్లు)పై భారీ ఆధిక్యంతో గెలుపొందారు. ఈ ఎన్నికల్లో మొత్తం 78.57 శాతం పోలింగ్ నమోదైంది. మొత్తం 112 ఓట్లకు గాను 88 ఓట్లు పోలయ్యాయి. ఇందులో 66 మంది కార్పొరేటర్లు, 22…
Bandi Sanjay : జీహెచ్ఎంసీ లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటింగ్ దూరంగా ఉండాలని బీఆర్ఎస్ తీసుకున్న నిర్ణయంతోపాటు ఎన్నికల్లో పోటీ చేయని కాంగ్రెస్ పైనా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. ప్రజాస్వామ్యంలో ఎన్నికలకు దూరంగా ఉండేది, ఓటింగ్ ను బహిష్కరించేది నక్సలైట్లు మాత్రమేనని అన్నారు. ఆ నక్సలైట్ల వారసులే కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలని మండిపడ్డారు. అలాంటి పార్టీలను రాబోయే ఎన్నికల్లో చిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్, బీఆర్ఎస్…
KTR : బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే.తారకరామారావు (కేటీఆర్) మరోసారి కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. హైదరాబాద్ వేదికగా పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి చేసిన ప్రసంగంలో ఆయన అధికార కాంగ్రెస్ ప్రభుత్వం పనితీరు, ప్రజల భావోద్వేగాలతో ఆడుకుంటున్న తీరును తీవ్రంగా ఎత్తిచూపారు. కేటీఆర్ మాట్లాడుతూ, “హైదరాబాద్ నగరంలో కాంగ్రెస్ పార్టీకి ఒక్క సీటు కూడా రావడం లేదు. ఇదే వారికి ప్రజల నుంచి వచ్చిన అసలైన తీర్పు,” అని పేర్కొన్నారు. జిల్లాల్లో మాత్రం కాంగ్రెస్…
కేంద్ర మంత్రి బండిసంజయ్ ఉగాది సందర్భంగా తెలుగు ప్రజలకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. కరీంనగర్ లోని తన నివాసంలో కేంద్ర మంత్రి మీడియాతో మాట్లాడారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాలనలో భారతదేశం ఆర్థిక ప్రగతిలో దూసుకుపోతోందని, ప్రధాని చేస్తున్న కృషిలో అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. జ్యోతిష్య పండితుల ప్రకారం.. ఈ ఏడాది దొంగతనాలు పెరిగే అవకాశముందని, ప్రజా ప్రతినిధులు, అధికారులు విచ్చలవిడిగా అవినీతికి పాల్పడతారని, కొత్త వ్యాధులు ప్రబలే సూచనలు ఉన్నాయని తెలిపారు. కాంగ్రెస్ పాలనను…
Bandi Sanjay : కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్కు హైకోర్టులో భారీ ఊరట లభించింది. గత జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచార సమయంలో మత విద్వేషాలు రెచ్చగొట్టేలా ప్రసంగించారనే ఆరోపణలపై సికింద్రాబాద్ మార్కెట్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఆయనపై ఛార్జ్షీట్ కూడా దాఖలైంది. అయితే, తగిన ఆధారాల్లేవన్న కారణంతో హైకోర్టు ఈ కేసును కొట్టివేసింది. జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా బీజేపీ నాయకుడు బండి సంజయ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ…