Bandi Sanjay : బండి సంజయ్కు భారీ ఊరట.. ఆ కేసు కొట్టేసిన హైకోర్టు
- హైకోర్టులో బండి సంజయ్కు భారీ ఊరట
- జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో కేసు నమోదు
- ఆధారాల్లేవన్న న్యాయవాది వాదన – కేసు కొట్టివేత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bandi Sanjay : కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్కు హైకోర్టులో భారీ ఊరట లభించింది. గత జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచార సమయంలో మత విద్వేషాలు రెచ్చగొట్టేలా ప్రసంగించారనే ఆరోపణలపై సికింద్రాబాద్ మార్కెట్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఆయనపై ఛార్జ్షీట్ కూడా దాఖలైంది. అయితే, తగిన ఆధారాల్లేవన్న కారణంతో హైకోర్టు ఈ కేసును కొట్టివేసింది. జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా బీజేపీ నాయకుడు బండి సంజయ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మత విద్వేషాలను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారని కొందరు వ్యక్తులు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుతో స్పందించిన సికింద్రాబాద్ మార్కెట్ పోలీసులు ఆయనపై కేసు నమోదు చేసి, విచారణ అనంతరం ఛార్జ్షీట్ కూడా దాఖలు చేశారు.
బండి సంజయ్పై నమోదైన కేసు హైకోర్టులో విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా బండి సంజయ్ తరఫున న్యాయవాది కోర్టులో వాదనలు వినిపించారు. బండి సంజయ్ మత విద్వేషాలను రెచ్చగొట్టారని నిరూపించే ఆధారాలు లేవని న్యాయవాది వాదించారు. ఆధారాలు లేకుండా రాజకీయం చేయడానికి కేసు నమోదయ్యిందని కోర్టుకు వివరించారు. కేవలం రాజకీయ కారణాల రీత్యా ఈ కేసును పెట్టారని, న్యాయపరంగా దీని ఆధారభూతతను పరిశీలించాల్సిన అవసరం ఉందని తెలిపారు.
ఈ వాదనలను పరిశీలించిన హైకోర్టు న్యాయమూర్తి, బండి సంజయ్పై నమోదు చేసిన కేసులో తగిన ఆధారాలు లేవని తేల్చారు. ఎలాంటి నేరపూరిత ప్రకటనలు లేకుండా కేసు నమోదు చేయడం సరికాదని కోర్టు వ్యాఖ్యానించింది.
Also Read
- Sikandar Raza: ‘త్వరలోనే కొన్ని పరుగులు కొనుక్కుంటా’.. ఓటమిపై సికందర్ రజా ఆసక్తికర వ్యాఖ్యలు..
- Shreyas Iyer: ‘నా ఫస్ట్ విన్ క్రెడిట్ అతనికే’.. అయ్యర్ నోటి నుంచి ఊహించని మాట..
- Abhijeet Dipke: టైమ్ కావాలి, పంజాబ్ పేపర్ లీక్పై స్పందిస్తాము..
- Commonwealth Games 2026: కామన్వెల్త్ క్రీడల్లో భారత్కు తొలి స్వర్ణం.. చరిత్ర స్పష్టించిన మీరాబాయి చాను..
అన్ని వాదనలు పరిశీలించిన తర్వాత, బండి సంజయ్పై నమోదైన కేసును హైకోర్టు కొట్టివేసింది. తగిన ఆధారాల్లేకుండా నేరపూరిత ఉద్దేశంతో కేసు నమోదు చేయడం సరికాదని కోర్టు స్పష్టం చేసింది. హైకోర్టు తీర్పుపై బండి సంజయ్ అనుచరులు హర్షం వ్యక్తం చేశారు. ఇది రాజకీయ కక్ష సాధింపుకు నిదర్శనమని, న్యాయం గెలిచిందని బీజేపీ నేతలు పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Mojtaba Khamenei: హిజ్బుల్లాకు ఇరాన్ మద్దతు.. “జిహాద్, ప్రతిఘటనే ఏకైక మార్గం”.. మొజ్తబా ఖమేనీ కీలక వ్యాఖ్యలు
-
The Paradise: 20 కోట్ల వ్యూస్తో దుమ్మురేపిన ‘ఆయా షేర్’.. ‘ది ప్యారడైజ్’ రిలీజ్ డేట్పై బిగ్ అప్డేట్!
-
Indian Idol 16 Winner: ఇండియన్ ఐడల్ 16 విజేతగా జ్యోతిర్మయి నాయక్.. ట్రోఫీతో పాటు రూ. 20 లక్షల ప్రైజ్ మనీ
-
Ram Charan: రామ్ చరణ్కు గాయం.. సర్జరీ కోసం కోయంబత్తూరు, RC17పై ప్రభావం?
-
CM Revanth Reddy : యువతే గేమ్చేంజర్.. మోడీపై రేవంత్ విమర్శలు
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో చర్మ దురదకు చెక్.. త్రిఫలతో సహజ చిట్కాలు!
-
CSK-Hardik Pandya: ఇద్దరు టాప్ స్టార్ ప్లేయర్స్, రూ.10 కోట్లు.. హార్దిక్ పాండ్య కోసం సీఎస్కే భారీ ఆఫర్!
-
Ishan Kishan: వైభవ్ సూర్యవంశీకి అన్ని తెలుసు.. ఆ ఒక్క విషయంలో మాత్రం జాగ్రత్త అని హెచ్చరించాం!
-
IND vs ZIM 3rd T20: మరో ఇద్దరు అరంగేట్రం.. భారత్ ప్లేయింగ్ 11 ఇదే.. పిచ్, వెదర్, లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Parents Alert: రోజూ ఫ్రూట్ జ్యూస్ ఇస్తున్నారా? పిల్లల్లో ఈ ప్రమాదం 52% పెరుగుతుందట.!