OTR: బృహన్ ముంబై కార్పొరేషన్ ఫలితాలతో గ్రేటర్ బీజేపీ కాన్ఫిడెన్స్
- గ్రేటర్ బీజేపీలో బృహన్ ముంబై కార్పొరేషన్ రిజల్ట్ జోష్
- రాబోయే గ్రేటర్ పోరులో ముంబై రిజల్ట్ రిపీట్ అంటూ లెక్కలు
- అక్కడి గెలుపు సంబరాలేనా...ఇక్కడెప్పుడు అని పార్టీలో చర్చ
- పట్టణ ఓటర్లపై కమలం గంపెడాశలు
- గ్రేటర్ బీజేపీకి అంత సత్తా వుందా?
- బీజేపీ వ్యూహాలేంటి?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
OTR: తెలంగాణలో మున్సిపల్ ఎలక్షన్స్కు ఎన్నికల సంఘం సమాయత్తమవుతోంది. చకచకా ప్రాసెస్ పూర్తి చేస్తున్నాయి. ఎన్నికలు జరిగే మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లకు ఛైర్ పర్సన్, మేయర్, వార్డుల రిజర్వేషన్లు సైతం ఖరారయ్యాయి. బీజేపీ కూడా పురపోరుకు సిద్దమవుతోంది. బృహన్ ముంబై కార్పొరేషన్ ఎన్నికల్లో విజయం ఉత్సాహంతో, గ్రేటర్ హైదరాబాద్తో పాటు మిగతా కార్పొరేషన్లలోనూ పాగా వేస్తామని చెబుతోంది.
READ ALSO: Bangladesh: బంగ్లాదేశ్లో మరో దారుణం.. హిందూ వ్యాపారి లిటన్ దాస్ హత్య..
Also Read
- OTR : వైసీపీ నేతలతో టచ్.. టీడీపీ ఎమ్మెల్యేతో మ్యాచ్? కాకినాడలో హాట్ టాపిక్
- OTR : బీజేపీలో బిగ్ ట్విస్ట్..ఈటెల ఇంట్లో ఏం జరిగింది? బండి సంజయ్తో రాజీ ఎలా కుదిరింది?
- OTR : ఒక్క దెబ్బకు రెండు పిట్టలు? ములుగులో సీతక్కకు చెక్ పెట్టేలా బీఆర్ఎస్ కొత్త స్కెచ్
- Off The Record: అవనిగడ్డ కూటమి పరిణామాలతోబుద్ధప్రసాద్ మధనపడుతున్నారా?
GHMC ఎన్నికలపై క్యాడర్కు దిశానిర్దేశం
ఇప్పటికే విజయ సంకల్ప సమావేశం నిర్వహించి కేడర్కి దిశా నిర్దేశం చేసింది బీజేపీ. ఈ సమావేశంలో వివిధ రాష్ట్రాల్లో పార్టీ వికసిస్తున్న తీరును పార్టీ నేతలు వివరించారు. కేరళలో కమ్యూనిస్టుల కంచుకోట తిరువనంతపురంలో బీజేపీ జెండా ఎగురవేసిన విషయాన్ని ప్రస్తావించారు. మహారాష్ర్ట మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ గెలిచిన తీరును గుర్తు చేశారు. అక్కడ కార్పొరేషన్లు గెలిచినందుకు హైదరాబాద్తో పాటు తెలంగాణలోనూ సంబరాలు చేసుకున్నారు. అయితే, బీజేపీ నేతలపై ఒక విమర్శ వుంది. ఎక్కడా గెలిచిన ఇక్కడ సెలబ్రేషన్స్ చేసుకునే బీజేపీ…మరి ఇక్కడి కార్పొరేషన్లో గెలిచేదెప్పుడు అని సెటైర్లు పేలుస్తున్నారు.
గ్రేటర్లో బృహన్ ముంబై రిజల్ట్ రిపీట్ అంటూ లెక్కలు
మహారాష్ట్ర ఫలితాలతో ఉప్పొంగిపోతున్న తెలంగాణ బీజేపీ నేతలు…గ్రేటర్ హైదరాబాద్లోనూ అవే రిజల్ట్స్ రిపీట్ అవుతాయని ఢంకా బజాయిస్తున్నారు. గతం వేరు, ప్రస్తుతం వేరని అంటున్నారు. తెలంగాణలో 8 మంది ఎంపీలను గెలిపించిన ప్రజలు …మొన్న జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో గ్రామీణ ప్రాంతాల్లో బీజేపీకి ఓట్లు వేశారని చెబుతున్నారు. పట్టణ ప్రాంత ఓటర్లు బీజేపీకి ఓటు వేసేందుకు సిద్ధంగా ఉన్నారని వ్యాఖ్యానిస్తున్నారు. ఈ ఎన్నికల్లో ఒంటరి పోరేనని..ఎవరితో పొత్తులు ఉండవని స్పష్టం చేస్తున్నారు. ఇలా ఎన్నో లెక్కల్లో తలనమునకలైన కమలనాథులు…చివరికి ఎలాంటి ఫలితాలు సాధిస్తారో చూడాలంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
READ ALSO: AI ఉద్యోగులను తొలగిస్తుందా..? కొత్త అవకాశాలు సృష్టిస్తుందా..? సంచలన నివేదిక..
తాజావార్తలు
-
OTR : వైసీపీ నేతలతో టచ్.. టీడీపీ ఎమ్మెల్యేతో మ్యాచ్? కాకినాడలో హాట్ టాపిక్
-
Story Board : ఇరాన్ యుద్ధం గల్ఫ్ కు చేసిన నష్టమేంటి..? దుబాయ్ గతానికి, ప్రస్తుతానికి తేడా ఏంటి..?
-
Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
-
Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
-
Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!