ప్రేమ జంటలు టార్గెట్గా వసూళ్లు..# ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు..# నగర శివారులో ఏకాంతంగా కనిపించే ప్రేమ జంటలే టార్గెట్..# బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు, బంగారం దోపిడీ..
Fake Certificates: ఫేక్ సర్టిఫికెట్లు తయారు చేస్తున్న ముఠా గుట్టురట్టు అయింది. నకిలీ ఓటర్ కార్డు, ఆధార్, బర్త్ సర్టిఫికెట్లు తయారు చేస్తున్న ముఠాను నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. మహంకాళి పోలీసులతో కలిసి జాయింట్ అపరేషన్ నిర్వహించారు. ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
ఛత్తీస్గఢ్లోని రాయ్పూర్లో దారుణ ఘటన వెలుగు చూసింది. ఇద్దరు అక్కాచెల్లెళ్లు రక్షాబంధన్ జరుపుకుని తిరిగి వస్తుండంగా సామూహిక అత్యాచారానికి గురయ్యారు.
హైదరాబాదులో భారీ మోసం వెలుగు చూసింది. కార్లను అద్దెకు తీసుకొని బహిరంగ మార్కెట్లో అమ్ముకుంటుంది ఓ ముఠా. ప్రముఖ కంపెనీ నుంచి కారు లను అద్దెకు తీసుకున్న ముఠా… సబ్సిడీ కార్ల పేరుతోటి బహిరంగ మార్కెట్లో అమ్మేస్తుంది. ప్రభుత్వం నుంచి సబ్సిడీలో కార్లు వస్తున్నాయంటూ మోసం చేస్తుంది. హైదరాబాదులో పలు సంస్థల నుంచి కార్లను అద్దెకు తీసుకున్న ఆరుగురు సభ్యుల ముఠాను అరెస్ట్ చేసారు సైబర్ బాద్ పోలీసులు. ముఠా నుంచి 50 అత్యంత ఖరీదైన కార్లను…
వరంగల్ లో నకిలీ కరెన్సీ నోట్లను ముద్రించి మార్కెట్లో చెలామణి చేస్తున్న దంపతులను టాస్క్ఫోర్స్ మరియు ఇంతేజార్ గంజ్ పోలీసులు సంయుక్తంగా కల్సి అరెస్టు చేసారు. వారి నుండి సుమారు 10లక్షల 9వేల 960 రూపాయల నకిలీ కరెన్సీని సీజ్ చేశారు పోలీసులు.. వారి నుండి కరెన్సీని ముద్రించేందుకు వినియోగిస్తున్న కలర్ ప్రింటర్, బాండ్ పేపర్లు, ఒక కట్టర్ ను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. వివరాల్లోకి వెళ్తే… వరంగల్ కాశిబుగ్గ, తిలకోడ్ ప్రాంతానికి చెందిన వంగరి రమేష్,…
కరోనా మహమ్మారికి ప్రజల జీవితాలు ఆసుపత్రుల పాలవుతుంటే , కొంత మంది ఆసుపత్రిలో పని చేసే సిబ్బంది మాత్రమే ఇదే అదనుగా భావించి కరోనా సోకినా వ్యక్తికి అందించే రెమెడీసీవర్ ఇంజెక్షన్లను అధిక ధరలకు అమ్ముతూ డబ్బులు దండుకుంటున్నారు. కరీంనగర్ లో కరోనా చికిత్స కోసం ఆసుపత్రిలో చేరే రోగులకు అందించే రెమెడీసీవర్ ఇంజెక్షన్లను ఆసుపత్రులలో పని చేసే కొంత మంది సిబ్బంది స్వలాభం కోసం రెమెడీసీవర్ ఇంజెక్షన్లను అధిక ధరలకు అమ్ముతున్నారన్న సమాచారం రావడంతో…