మార్కెట్లో రెమెడీసీవర్ బ్లాక్ దందా…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కరోనా మహమ్మారికి ప్రజల జీవితాలు ఆసుపత్రుల పాలవుతుంటే , కొంత మంది ఆసుపత్రిలో పని చేసే సిబ్బంది మాత్రమే ఇదే అదనుగా భావించి కరోనా సోకినా వ్యక్తికి అందించే రెమెడీసీవర్ ఇంజెక్షన్లను అధిక ధరలకు అమ్ముతూ డబ్బులు దండుకుంటున్నారు. కరీంనగర్ లో కరోనా చికిత్స కోసం ఆసుపత్రిలో చేరే రోగులకు అందించే రెమెడీసీవర్ ఇంజెక్షన్లను ఆసుపత్రులలో పని చేసే కొంత మంది సిబ్బంది స్వలాభం కోసం రెమెడీసీవర్ ఇంజెక్షన్లను అధిక ధరలకు అమ్ముతున్నారన్న సమాచారం రావడంతో వీరి యొక్క కదలికల పైన నిఘా ఉంచిన కరీంనగర్ టాస్క్ ఫోర్స్ పోలీస్ లు సైదాపూర్ మండలానికి చెందిన లావుడ్య అంజనీ కుమార్,క్రొత్తపల్లి మండలానికి చెందిన చోపరి గోపిచంద్, చొప్పదండి మండలానికి చెందిన గజ్జెల శ్యామ్ కుమార్ మరియు కరీంనగర్ లోని సావ్రన్ స్ట్రీట్ ప్రాంతానికి చెందిన గంటల యుగంధర్ లు వీరు నలుగురు కరీంనగర్ లోని ఆసుపత్రులలో ల్యాబ్ టెక్నీషియన్ ,అనేస్తేషియా టెక్నీషియన్ ,రిసెప్సనిస్ట్ మరియు డ్రైవర్ లుగా పని చేస్తూ రెమెడీసీవర్ ఇంజెక్షన్లను తమ యొక్క ఆసుపత్రిలో ఎవరైనా పేషెంట్ కు అవసరమైనపుడు వీరు ఒకరినొకరు తాము బ్లాక్ చేసి పెట్టుకున్న ఇంజెక్షన్లను అధిక ధరలకు పేషెంట్లకు అందిస్తున్నారన్న సమాచారం అందుకున్న కరీంనగర్ పోలీసులు కిసాన్ నగర్ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రవిష్టా అపార్ట్మెంట్ వద్ద ఇంజెక్షన్లను క్రయ విక్రయాలు చేస్తుండగా పోలీసులు పట్టుకోవడం జరిగింది .వీరి వద్ద నుండి ఏడు రెమెడీసీవర్ ఇంజెక్షన్లను, నాలుగువేల ఐదు వందల ముపై రూపాయల నగదు మరియు నాలుగు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకోవడం జరిగింది .
Also Read
తాజావార్తలు
-
Kapil Dev: ఫాలో ఆన్ ఇచ్చి కూడా గెలవలేరా? కపిల్ దేవ్ ప్రశ్నల వర్షంతో టీమిండియాలో ప్రకంపనలు..
-
NASA: అంగారక గ్రహంపై ఏలియన్ ‘జెల్లీఫిష్’ కలకలం.. నాసా ఫొటోతో వెలుగులోకి షాకింగ్ విషయాలు..
-
Food Poisoning: జగిత్యాల జిల్లాలో విషాదం.. పెళ్లి భోజనం తిని 15 మందికి అస్వస్థత..
-
Emraan Hashmi: సినిమా సక్సెస్ జోష్లో ఇమ్రాన్ హష్మీకి బిగ్ షాక్.. స్వైన్ ఫ్లూ పాజిటివ్!
-
T20 Cricket: కేవలం 7 పరుగులకే ఆలౌట్, 10 రన్స్కే కుప్పకూలిన జట్లు, టీ20 చరిత్రలోనే అత్యంత దారుణ స్కోర్లు ఇవే!
ట్రెండింగ్
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!