వరంగల్లో దొంగనోట్లు ముద్రిస్తున్న ముఠా అరెస్టు…
వరంగల్ లో నకిలీ కరెన్సీ నోట్లను ముద్రించి మార్కెట్లో చెలామణి చేస్తున్న దంపతులను టాస్క్ఫోర్స్ మరియు ఇంతేజార్ గంజ్ పోలీసులు సంయుక్తంగా కల్సి అరెస్టు చేసారు. వారి నుండి సుమారు 10లక్షల 9వేల 960 రూపాయల నకిలీ కరెన్సీని సీజ్ చేశారు పోలీసులు.. వారి నుండి కరెన్సీని ముద్రించేందుకు వినియోగిస్తున్న కలర్ ప్రింటర్, బాండ్ పేపర్లు, ఒక కట్టర్ ను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.
వివరాల్లోకి వెళ్తే… వరంగల్ కాశిబుగ్గ, తిలకోడ్ ప్రాంతానికి చెందిన వంగరి రమేష్, వంగరి సరస్వతి, దంపతులు.. కాశిబుగ్గ ప్రాంతంలోనే చికెన్ సెంటర్ తో పాటుగా ఫ్యాన్సీ షాపు మ్యారేజ్ బ్యూరో నిర్వహించేవారు. ఈ క్రమంలో వారికి ఆర్థిక ఇబ్బందులు రావడంతో సులభంగా డబ్బు సంపాదించాలనే ఆలోచనతో ఈ కిలాడీ దంపతులు అనుకున్నదే తడువుగా నకిలీ నోట్లను ముద్రించి వాటిని రద్దీ ప్రాంతాల్లో చెలామణి చేయాలని ప్రణాళికను రూపొందించుకున్నారు. ఈ ఇందులో భాగంగా ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో వున్న స్కానర్తో కూడిన కలర్ ప్రింటర్ తో పాటు, కరెన్సీ అవసరమయిన బాండ్ పేపర్లను కొనుగోలు చేసిన గత మూడు నెలలగా అసలు కరెన్సీకి సంబంధించిన 2 వేలు, ఐదువందలు, రెండువందలు, వంద, యాభై, ఇరువై, పది రూపాయలకు సంబంధించిన కొత్త మరియు పాత నోట్లను ముందుగా స్కానర్తో స్కాన్ చేసిన పిదప స్కాన్ చేసిన నోట్లను కలర్ ప్రింటర్ ద్వారా నకిలీ కరెన్సీని ముద్రించేవారు.
Also Read
- Bhatti Vikramarka : ప్రజలకు ఇబ్బంది కలగకుండా విద్యుత్ సరఫరా చేయడమే ప్రభుత్వ లక్ష్యం
- Tragedy : పాఠశాల ముందు మృత్యువు..! ఐదేళ్ల చిన్నారి ప్రాణం తీసిన నిర్లక్ష్యం
- Kavitha New Party: కవిత కొత్త పార్టీపై కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం..
- Software Engineer Suicide: మా కోడలికి ఆరుగురు బాయ్ ఫ్రెండ్స్.. ప్రవర్తన నచ్చకే కొడుకు ఆత్మహత్య చేసుకున్నాడు.. తండ్రి ఆవేదన.!
ముద్రించిన నకిలీ కరెన్సీని ఎవరికి అనుమానం రానివిధంగా నోట్లను రూపోందించి హన్మకొండ, వరంగల్ లో రద్దీ గా వుండే షాపుల్లో ఈ నకిలీ నోట్లను ఈ కిలాడీ దంపతులు చెలామణీ చేసేవారు.గత కొద్ది రోజులుగా వరంగల్ ట్రై సిటీ పరిధిలోని షాపుల్లో నకిలీ నోట్ల చలామణి అవుతున్నట్లుగా పలు ఫిర్యాదులు రావడంతో పోలీస్ కమిషనర్ అదేశాల మేరకు వరంగల్ పోలీస్ కమిషనరేట్ టాస్క్ఫోర్స్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇందులో భాగంగా పోలీసులకు అందిన సమాచారం మేరకు టాస్క్ఫోర్స్ మరియు ఇంతేజార్గంజ్ పోలీసులు సంయుక్తంగా కల్సి నకిలీ కరెన్సీ నోట్లను ముద్రిస్తున్న ఇంటిపై ఆకస్మిక తనిఖీ చేయడంతో దంపతులను అదుపులోకి తీసుకోవడంతో పాటు వారి నుండి నకిలీ కరెన్సీ నోట్ల ముద్రించేందుకుగా వినియోగించే సామగ్రితో పాటు రెండు వేలు 376, ఐదువందలు 204, రెండువందలు 420, వంద 471, యాభై 471, ఇరువై 62, పదిరూపాయలకు సంబంధించి 7 నకిలీ కరెన్సీ నోట్లను పోలీసులు స్వాధీనం చేసుకోని కేసు నమోదు చేసారు.
తాజావార్తలు
-
Mangli: వివాదాల నడుమ మంగ్లీ కొత్త సాంగ్ రిలీజ్
-
IPL 2026 సీజన్లో 41 మ్యాచ్ల్లోనే 10 సార్లు 200+ రన్ ఛేజ్.. ఐపీఎల్ స్వరూపాన్నే మార్చేసిన ఒకే ఒక్క రూల్ ఇదే..
-
Sorakaya Paratha Recipe : మెత్తని సొరకాయ జొన్న పరాటాలు.. బరువు తగ్గాలనుకునే వారికి పర్ఫెక్ట్ హెల్తీ బ్రేక్ఫాస్ట్.!
-
Sajjala Ramakrishna Reddy: ఓట్లు తొలగింపుపై జాగ్రత్త.. వైసీపీ నేతలకు సజ్జల కీలక సూచనలు..
-
Abhishek-Travis Head: అభిషేక్ ఆటతీరుపై ట్రావిస్ హెడ్ సంచలన వ్యాఖ్యలు.. ఇలా ఎప్పుడూ ఆడలేదంటూ..
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!