వరంగల్లో దొంగనోట్లు ముద్రిస్తున్న ముఠా అరెస్టు…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వరంగల్ లో నకిలీ కరెన్సీ నోట్లను ముద్రించి మార్కెట్లో చెలామణి చేస్తున్న దంపతులను టాస్క్ఫోర్స్ మరియు ఇంతేజార్ గంజ్ పోలీసులు సంయుక్తంగా కల్సి అరెస్టు చేసారు. వారి నుండి సుమారు 10లక్షల 9వేల 960 రూపాయల నకిలీ కరెన్సీని సీజ్ చేశారు పోలీసులు.. వారి నుండి కరెన్సీని ముద్రించేందుకు వినియోగిస్తున్న కలర్ ప్రింటర్, బాండ్ పేపర్లు, ఒక కట్టర్ ను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.
వివరాల్లోకి వెళ్తే… వరంగల్ కాశిబుగ్గ, తిలకోడ్ ప్రాంతానికి చెందిన వంగరి రమేష్, వంగరి సరస్వతి, దంపతులు.. కాశిబుగ్గ ప్రాంతంలోనే చికెన్ సెంటర్ తో పాటుగా ఫ్యాన్సీ షాపు మ్యారేజ్ బ్యూరో నిర్వహించేవారు. ఈ క్రమంలో వారికి ఆర్థిక ఇబ్బందులు రావడంతో సులభంగా డబ్బు సంపాదించాలనే ఆలోచనతో ఈ కిలాడీ దంపతులు అనుకున్నదే తడువుగా నకిలీ నోట్లను ముద్రించి వాటిని రద్దీ ప్రాంతాల్లో చెలామణి చేయాలని ప్రణాళికను రూపొందించుకున్నారు. ఈ ఇందులో భాగంగా ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో వున్న స్కానర్తో కూడిన కలర్ ప్రింటర్ తో పాటు, కరెన్సీ అవసరమయిన బాండ్ పేపర్లను కొనుగోలు చేసిన గత మూడు నెలలగా అసలు కరెన్సీకి సంబంధించిన 2 వేలు, ఐదువందలు, రెండువందలు, వంద, యాభై, ఇరువై, పది రూపాయలకు సంబంధించిన కొత్త మరియు పాత నోట్లను ముందుగా స్కానర్తో స్కాన్ చేసిన పిదప స్కాన్ చేసిన నోట్లను కలర్ ప్రింటర్ ద్వారా నకిలీ కరెన్సీని ముద్రించేవారు.
Also Read
- Cheyutha Pensions: చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు పెంపు.. చివరి తేదీ ఎప్పుడంటే..
- CM Revanth Reddy: ఈ 1000 రోజుల్లో కేసీఆర్ ఒక్కసారైనా జనం కోసం బయటకు వచ్చారా..?: సీఎం రేవంత్రెడ్డి
- Maharashtra: ఘోర విషాదం.. జీపు బోల్తా.. నలుగురు తెలంగాణ వాసుల మృతి
- CM Revanth Reddy : కేసీఆర్ అప్పులపై రేవంత్ ఫైర్.. ‘భారం మోస్తున్నాం’!
ముద్రించిన నకిలీ కరెన్సీని ఎవరికి అనుమానం రానివిధంగా నోట్లను రూపోందించి హన్మకొండ, వరంగల్ లో రద్దీ గా వుండే షాపుల్లో ఈ నకిలీ నోట్లను ఈ కిలాడీ దంపతులు చెలామణీ చేసేవారు.గత కొద్ది రోజులుగా వరంగల్ ట్రై సిటీ పరిధిలోని షాపుల్లో నకిలీ నోట్ల చలామణి అవుతున్నట్లుగా పలు ఫిర్యాదులు రావడంతో పోలీస్ కమిషనర్ అదేశాల మేరకు వరంగల్ పోలీస్ కమిషనరేట్ టాస్క్ఫోర్స్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇందులో భాగంగా పోలీసులకు అందిన సమాచారం మేరకు టాస్క్ఫోర్స్ మరియు ఇంతేజార్గంజ్ పోలీసులు సంయుక్తంగా కల్సి నకిలీ కరెన్సీ నోట్లను ముద్రిస్తున్న ఇంటిపై ఆకస్మిక తనిఖీ చేయడంతో దంపతులను అదుపులోకి తీసుకోవడంతో పాటు వారి నుండి నకిలీ కరెన్సీ నోట్ల ముద్రించేందుకుగా వినియోగించే సామగ్రితో పాటు రెండు వేలు 376, ఐదువందలు 204, రెండువందలు 420, వంద 471, యాభై 471, ఇరువై 62, పదిరూపాయలకు సంబంధించి 7 నకిలీ కరెన్సీ నోట్లను పోలీసులు స్వాధీనం చేసుకోని కేసు నమోదు చేసారు.
తాజావార్తలు
-
Kalki 2 : కల్కి 2 అప్డేట్ ఇచ్చిన నాగ్ అశ్విన్
-
Sardar 2 : సర్దార్ ఆన్ యాక్షన్.. స్పై థ్రిల్లర్తో మళ్లీ రాబోతున్న కార్తీ
-
Cheyutha Pensions: చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు పెంపు.. చివరి తేదీ ఎప్పుడంటే..
-
Anna Hazare: అన్నా హజారేకు సీరియస్.. ముంబై ఆస్పత్రికి తరలింపు
-
Messi Retirement: హార్మోన్ లోపం నుంచి ప్రపంచకప్ కల వరకు.. మెస్సీ జీవిత ప్రయాణం సాగిందిలా..
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!