Srisailam Land Disputes: దేవాదాయ, ధర్మాదాయ శాఖ చరిత్రలో ఈ రోజు శుభదినంగా పేర్కొన్నారు మంత్రి కొట్టు సత్యనారాయణ.. అసెంబ్లీ మీడియా పాయింట్లో ఆయన మాట్లాడుతూ.. శ్రీశైలం దేవస్థానం సరిహద్దు సమస్యకు పరిష్కారం దొరికింది.. రెండో ప్రధాన ఆలయాన్ని పెద్ద ఎత్తున అభివృద్ధి చేయాలని సీఎం వైఎస్ జగన్ ఆదేశించారని తెలిపారు. అటవీశాఖతో చాలా కాలంగా భూవివాదం కొనసాగుతోంది.. అయితే, రెవెన్యూ, ఎండోమెంట్, ఫారెస్ట్ శాఖలతో సమీక్ష నిర్వహించాం.. మూడు శాఖలు సమన్వయంతో పనిచేసి సరిహద్దులు నిర్ణయం…
జార్ఖండ్లోని గర్వా, దాని పరిసర ప్రాంతాల్లో నలుగురు వ్యక్తుల ప్రాణాలను బలిగొన్న చిరుతపులిని చంపడానికి జార్ఖండ్ అటవీ శాఖ షరతులతో కూడిన అనుమతిని ఇచ్చిందని ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ (వన్యప్రాణి) బుధవారం తెలిపారు.
ఆదివాసీలపై జరుగుతున్న అటవీశాఖ దాడులపై సీతక్క కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో ఎన్టీవీతో ఎమ్మెల్యే సీతక్క మాట్లాడుతూ.. పోడు భూముల సమస్యను పరిష్కరించండీ అంటూ మండిపడ్డారు. కోయ పోఛగూడెంలో మహిళలు జైల్ జీవితం అనుభవించారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఆదివాసీలకు హక్కులేదా? అంటూ ప్రశ్నించారు. ఇష్టం వచ్చినట్టు అధికారులు కొడితే ఊరుకునేది లేదని, తిరగబడాల్సిందే అంటూ మండిపడ్డారు. కొత్త అడవిని కొడితే గ్రామసభలు పెట్టండీ అంతేకానీ.. ఇష్టం వచ్చినట్టుగా దాడులు చేస్తే ఎలా? అంటూ ప్రశ్నించారు…
అడవుల్లో వుండాల్సిన చిరుతపులులు, ఎలుగుబంట్ల, ఏనుగులు జనావాసాల్లోకి వచ్చిపడుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో చిరుతపులుల అలజడి జనానికి కంటిమీద కనుకు లేకుండా చేస్తోంది. తాజాగా అన్నమయ్య జిల్లాలో ఓ చిరుత పులి అలజడి కలిగిస్తోంది. గాలివీడు మండలం అరవీడు గ్రామం నడింపల్లె అటవీ ప్రాంతంలో చిరుత పులి హల్ చల్ చేసింది. మేతకు అడవికి వెళ్ళిన మేకల మంద పై దాడి చేసి రెండు మేకలను చంపింది చిరుత పులి. దీంతో ప్రాణ భయంతో అటవీ ప్రాంతం నుంచి…