Leopard: నలుగురిని బలిగొన్న చిరుతను చంపేందుకు అటవీ శాఖ అనుమతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Forest Officials Give Permission To Kill Leopard: జార్ఖండ్లోని గర్వా, దాని పరిసర ప్రాంతాల్లో నలుగురు వ్యక్తుల ప్రాణాలను బలిగొన్న చిరుతపులిని చంపడానికి జార్ఖండ్ అటవీ శాఖ షరతులతో కూడిన అనుమతిని ఇచ్చిందని ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ (వన్యప్రాణి) బుధవారం తెలిపారు. డిసెంబర్ 2022లో, ఈ చిరుతపులి వేర్వేరు సందర్భాలలో జార్ఖండ్లో కనీసం నలుగురి ప్రాణాలను బలిగొంది.
గతంలో, మనేంద్రగఢ్ ఫారెస్ట్ డివిజన్ పరిధిలోని జనక్పూర్ ఫారెస్ట్ రేంజ్లోని కున్వారి బీట్ కంపార్ట్మెంట్ 1341 సమీపంలోని అడవికి ఆనుకుని ఉన్న పొలంలో చిరుతపులి ఒక వ్యక్తిని చంపిందని అటవీ అధికారి తెలిపారు. ఆదివారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లు సమాచారం. మృతి చెందిన వ్యక్తిని రామ్దావన్గా గుర్తించారు. సమాచారం అందుకున్న అటవీశాఖ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. చిరుతను పట్టుకునేందుకు వివిధ విభాగాల నుంచి అధికారుల బృందం చేరుకుంది.
Also Read
- Kirti Chakra: అమరవీరుడు సిపాయి జంజాల్ ప్రవీణ్ ప్రభాకర్కు ‘కీర్తి చక్ర’ ప్రదానం.. రాష్ట్రపతి దగ్గర వెక్కి వెక్కి ఏడ్చిన తల్లి
- India-US Trade Deal: అమెరికాతో వాణిజ్య ఒప్పందం కుదిరేది అప్పుడే.. భారత్ ఎదురుచూపులు!
- HDFC Bank MCLR Hike: కస్టమర్లకు షాకిచ్చిన హెచ్డీఎఫ్సీ బ్యాంక్.. మరింత భారంగా EMIలు
- Vaibhav Sooryavanshi: ‘వైభవ్ సూర్యవంశీ డకౌట్ అవుతాడు’.. కపిల్ దేవ్ సంచలన వ్యాఖ్యలు..
Fake Website: అచ్చం ప్రభుత్వ పోర్టల్లాగే నకిలీ వెబ్సైట్.. మోసగాళ్ల ముఠా అరెస్ట్
జనక్పూర్ అటవీ రేంజ్లో చిరుతపులి దాడి కారణంగా ఇప్పటివరకు రెండు మరణాలు సహా మూడు సంఘటనలు ఉన్నాయని సర్గుజా వైల్డ్లైఫ్ ఫారెస్ట్ కన్జర్వేటర్ కేఆర్ బధాయి అన్నారు. ఆ సంఘటనలను దృష్టిలో ఉంచుకుని, అటవీ శాఖ వారు పట్టుకోవడానికి బోనులు, ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేశారని తెలిపారు. కానీ ఇప్పటికీ చిరుతను పట్టుకోవడంలో విఫలమైందన్నారు. చిరుతను ఎలాగైనా పట్టుకోవడానికి తమకు ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ అనుమతి లభించిందని ఆయన వెల్లడించారు. నిపుణుల బృందం కూడా చేరుకుందని.. చిరుతను వీలైనంత త్వరగా పట్టుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. ఇటీవల జనవరి 3న చిరుతపులి దాడితో ఓ మహిళ మృతి చెందింది. మనేంద్రగఢ్ అటవీ డివిజన్ పరిధిలో చిరుతపులి దాడుల కారణంగా 2022 డిసెంబర్ నుండి ఇప్పటివరకు ముగ్గురు మృతి చెందగా, ఒక చిన్నారికి గాయాలయ్యాయి.
తాజావార్తలు
-
Kirti Chakra: అమరవీరుడు సిపాయి జంజాల్ ప్రవీణ్ ప్రభాకర్కు ‘కీర్తి చక్ర’ ప్రదానం.. రాష్ట్రపతి దగ్గర వెక్కి వెక్కి ఏడ్చిన తల్లి
-
Peddi :బుచ్చిబాబుపై SC/ST అట్రాసిటీ కేసు పెట్టాలని డిమాండ్!
-
India-US Trade Deal: అమెరికాతో వాణిజ్య ఒప్పందం కుదిరేది అప్పుడే.. భారత్ ఎదురుచూపులు!
-
HDFC Bank MCLR Hike: కస్టమర్లకు షాకిచ్చిన హెచ్డీఎఫ్సీ బ్యాంక్.. మరింత భారంగా EMIలు
-
Vaibhav Sooryavanshi: ‘వైభవ్ సూర్యవంశీ డకౌట్ అవుతాడు’.. కపిల్ దేవ్ సంచలన వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!