Leopard: నలుగురిని బలిగొన్న చిరుతను చంపేందుకు అటవీ శాఖ అనుమతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Forest Officials Give Permission To Kill Leopard: జార్ఖండ్లోని గర్వా, దాని పరిసర ప్రాంతాల్లో నలుగురు వ్యక్తుల ప్రాణాలను బలిగొన్న చిరుతపులిని చంపడానికి జార్ఖండ్ అటవీ శాఖ షరతులతో కూడిన అనుమతిని ఇచ్చిందని ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ (వన్యప్రాణి) బుధవారం తెలిపారు. డిసెంబర్ 2022లో, ఈ చిరుతపులి వేర్వేరు సందర్భాలలో జార్ఖండ్లో కనీసం నలుగురి ప్రాణాలను బలిగొంది.
గతంలో, మనేంద్రగఢ్ ఫారెస్ట్ డివిజన్ పరిధిలోని జనక్పూర్ ఫారెస్ట్ రేంజ్లోని కున్వారి బీట్ కంపార్ట్మెంట్ 1341 సమీపంలోని అడవికి ఆనుకుని ఉన్న పొలంలో చిరుతపులి ఒక వ్యక్తిని చంపిందని అటవీ అధికారి తెలిపారు. ఆదివారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లు సమాచారం. మృతి చెందిన వ్యక్తిని రామ్దావన్గా గుర్తించారు. సమాచారం అందుకున్న అటవీశాఖ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. చిరుతను పట్టుకునేందుకు వివిధ విభాగాల నుంచి అధికారుల బృందం చేరుకుంది.
Also Read
- VVS Laxman: వీవీఎస్ లక్ష్మణ్ ‘నో’ చెప్పడం వల్లే గంభీర్కు ఊహించని అవకాశం.. ఎవరికీ తెలియని సీక్రెట్ రివీల్..
- CM Chandrababu: ‘ప్రియాంక మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు’.. బాధిత కుటుంబానికి రూ. 20 లక్షల ఆర్థిక సాయం..
- New Phones: గూగుల్ నుంచి కొత్త ఫోన్స్.. పిక్సెల్ 11, 11 ప్రో, 11 ప్రో XL , 11 ప్రో ఫోల్డ్.. ఫీచర్స్ అదరహో..
- Uttar Pradesh: ‘‘నా అల్లుడు 25 పెళ్లిళ్లు చేసుకున్నాడు’’.. బీజేపీ ఎమ్మెల్యే సంచలన ఆరోపణలు
Fake Website: అచ్చం ప్రభుత్వ పోర్టల్లాగే నకిలీ వెబ్సైట్.. మోసగాళ్ల ముఠా అరెస్ట్
జనక్పూర్ అటవీ రేంజ్లో చిరుతపులి దాడి కారణంగా ఇప్పటివరకు రెండు మరణాలు సహా మూడు సంఘటనలు ఉన్నాయని సర్గుజా వైల్డ్లైఫ్ ఫారెస్ట్ కన్జర్వేటర్ కేఆర్ బధాయి అన్నారు. ఆ సంఘటనలను దృష్టిలో ఉంచుకుని, అటవీ శాఖ వారు పట్టుకోవడానికి బోనులు, ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేశారని తెలిపారు. కానీ ఇప్పటికీ చిరుతను పట్టుకోవడంలో విఫలమైందన్నారు. చిరుతను ఎలాగైనా పట్టుకోవడానికి తమకు ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ అనుమతి లభించిందని ఆయన వెల్లడించారు. నిపుణుల బృందం కూడా చేరుకుందని.. చిరుతను వీలైనంత త్వరగా పట్టుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. ఇటీవల జనవరి 3న చిరుతపులి దాడితో ఓ మహిళ మృతి చెందింది. మనేంద్రగఢ్ అటవీ డివిజన్ పరిధిలో చిరుతపులి దాడుల కారణంగా 2022 డిసెంబర్ నుండి ఇప్పటివరకు ముగ్గురు మృతి చెందగా, ఒక చిన్నారికి గాయాలయ్యాయి.
తాజావార్తలు
-
Hash Oil : స్నాప్చాట్లో డ్రగ్స్ దందా.. ORR వద్ద పెడ్లర్ అరెస్ట్.!
-
VVS Laxman: వీవీఎస్ లక్ష్మణ్ ‘నో’ చెప్పడం వల్లే గంభీర్కు ఊహించని అవకాశం.. ఎవరికీ తెలియని సీక్రెట్ రివీల్..
-
CM Chandrababu: ‘ప్రియాంక మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు’.. బాధిత కుటుంబానికి రూ. 20 లక్షల ఆర్థిక సాయం..
-
New Phones: గూగుల్ నుంచి కొత్త ఫోన్స్.. పిక్సెల్ 11, 11 ప్రో, 11 ప్రో XL , 11 ప్రో ఫోల్డ్.. ఫీచర్స్ అదరహో..
-
Bhatti Vikramarka : యూసీ బర్క్లీలో భట్టి విక్రమార్క.. తెలంగాణ క్లీన్ ఎనర్జీపై బిగ్ ప్లాన్.!
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!