Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Leopards Hulchul In Temple City Tirupati

Leopards Adda Tirupati: చిరుతపులులకు తిరుపతి అడ్డాగా మారుతోందా?

Published Date :August 17, 2022 , 5:33 pm
By NTV WebDesk
Leopards Adda Tirupati: చిరుతపులులకు తిరుపతి అడ్డాగా మారుతోందా?
  • Follow Us :
  • google news
  • dailyhunt

జనారణ్యంలో వుండాల్సిన వన్యమృగాలు జనంలోకి వచ్చేస్తున్నాయా? ఏపీలో చిరుతపులులు, పులులు, ఏనుగులు, ఎలుగుబంట్లు… ఇలా వన్యప్రాణులు జనానికి కంటిమీద కునుకే లేకుండా చేస్తున్నాయి. కలియుగ వైకుంఠం తిరుపతి వాసులకు కొత్త భయం పట్టుకుంది. చిరుతపులుల అడ్డాగా తిరుపతి మారుతుందా అంటే అవును అనే సమాధానమే అధికారుల నుంచి వినపడుతుంది… ఎన్నడూ లేని విధంగా తిరుపతి, తిరుమల కొండల్లో, జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో చిరుతల సంతతి పెరిగిందంటున్నారు… అయినా చిరుతపులులు సంచారంపై స్దానికుల్లో ఆందోళన పెరుగుతోంది. తాజాగా ఎస్వి వెటర్నరీ వర్శిటీలో చిరుతపులి సంచారానికి సంబంధించి సీసీటీవీ ఫుటేజ్ మరింత ఆందోళనకు కారణం అవుతోంది.

తిరుపతి సమీప ప్రాంతాలలో చిరుత పులుల సందడి పెరుగుతుంది. రోజూ ఏదో ఒకచోట చిరుతు పులుల అలజడులు సర్వసాధారణంగా మారాయి. దానికి ఇటీవల కాలంలో వరుసగా జరుగుతున్న దాడులు ఉదాహరణగా చెబుతున్నారు అటవీశాఖ అధికారులు .. శేషాచలం కొండల కేంద్రం తిరుమలలో వరుసగా చిరుతలు హల్ చల్ చేస్తుంటే… కొండ కింద తిరుపతిలోనూ అదే పరిస్థితులు నెలకొన్నాయి… తాజాగా ఎస్వీ వెటర్నరీ యూనివర్శిటీలో చిరుత సంచారం కలకలం రేపుతోంది.

Also Read

  • CM Chandrabbau: రాష్ట్రంలో డీజిల్, పెట్రోల్ కొరత.. బంకుల మూసివేతపై సీఎం సమీక్ష!
  • Petrol Shortage: పెట్రోల్, డీజిల్ కష్టాలు.. బంకుల దగ్గర వాహనాల బారులు!
  • న్యూ లుక్‌లో YS Jagan.. యూరప్ టూర్‌కు బయల్దేరిన మాజీ సీఎం.!
  • Off The Record : నెల్లిమర్ల ఎమ్మెల్యే పీఏపై తీవ్ర ఆరోపణలు

Read Also: CM KCR Medchal Meeting: తెలంగాణలో 24 గంటలు కరెంట్ పోదు.. ఢిల్లీలో 24 గంటలు కరెంట్ రాదు

యూనివర్సిటీ పరిపాలన భవనం ఆవరణలో నిన్న అర్ధరాత్రి చిరుత సంచరించింది. అక్కడ నిద్రిస్తున్న ఓ శునకాన్ని పట్టుకునే ప్రయత్నం కూడా చేసింది. అయితే ఈ దృశ్యాలు అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. నిన్న అర్ధరాత్రి సంచరించిన చిరుత జాడను ఇవాళ సాయంత్రం యూనివర్సిటీ సెక్యూరిటీ సిబ్బంది గుర్తించారు. వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. హుటాహుటిన రంగంలోకి దిగిన సిబ్బంది… యూనివర్సిటీ వద్దకు చేరుకొని చిరుత జాడలను గుర్తించారు. మరోసారి చిరుత యూనివర్సిటీ ఆవరణంలోకి ప్రవేశించకుండా చర్యలు తీసుకుంటున్నారు. విషయం తెలుసుకున్న స్థానిక గ్రామాల ప్రజలు కూడా తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. అటవీ శాఖ అధికారులు పులిని వెంటనే పట్టుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. 

కొన్నీ నెలల‌ కిందట యూనివర్సిటీలోని ఆవరణలో, సమీపంలోని పంట పొలాల్లో చిరుత సంచరించడం స్ధానికులు గమనించారు. అప్పుడు కూడా అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. అయితే అదే రోజు యూనివర్సిటీలోని ఓ శునకంపై దాడి చేసి గాయపరచడంతో విద్యార్థులు, సిబ్బంది తీవ్ర భయాందోళనకు గురి అయ్యారు. చిరుతపులులు సంఖ్య సైతం శేషాచలంలో బాగా పెరిగిందని అంటున్నారు జిల్లా అటవీ శాఖ అధికారులు. 1960 సంవత్సరంలో చిత్తూరు జిల్లాలో చిరుతపులులు సంచారం అసలు లేదని అంటున్నారు. అటు తరువాత ఇటు నల్లమల అటవీ ప్రాంతం నుండి చిరుతల రాక ప్రారంభమైందని నివేదికలు చెబుతున్నాయి.

గత ఐదేళ్ళలో వీటి సంఖ్య గణనీయంగా పెరిగిందంటున్నారు. 2018 నుండి ఇప్పటి వరకు అధికారులు చెబుతున్న లెక్కల ప్రకారం దాదాపు 40కిపైగా చిరుతపులులు ఉన్నట్లు చెబుతున్నారు. ఇవి కూడా తిరుమల,తిరుపతి సమీపంలో ప్రాంతాలలో ఎక్కువగా ఉన్నాయని…తిరుపతి శేషాచలం కొండల్లో మాత్రమే కాకుండా జిల్లాలోని పలమనేరు, శ్రీకాళహస్తి,చంద్రగిరి,పీలేరు , నగరి ,నియోజకవర్గాల్లోను చిరుతల సంచారం విపరీతంగా పెరిగిందని భావిస్తున్నారు అధికారులు ..ప్రస్తుతం జిల్లాలో దాదాపు 70 నుండి 100 వరకు ఉండొచ్చు అని అంచనా వేశారు. దీనికి ఉదాహరణగా వరుసగా అక్కడ జరుగుతూన్న చిరుత అలజడులను, దాడులను చెబుతున్నారు ..తాజాగా వర్శిటి సమీపంలోని అటవీ ప్రాంతం నుండి చిరుతలు క్యాంపస్ లోకి రావడం మరింతగా విద్యార్థులను,సిబ్బంది ని కలవరపాటుకు గురి చేస్తోంది. జన సంచారం లోకి వస్తున్న చిరుతలకు అటవీ శాఖ ఎలా చెక్ పెడుతుందో వేచి చూడాలి.

Read Also: Shyam Singha Roy: ఆస్కార్ బరిలో సాయి పల్లవి చిత్రం..

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • andhrapradesh
  • forest department
  • leopards
  • Pilgrims tension
  • Seven Hills

తాజావార్తలు

  • US-China AI Tech War: మక్కీకి మక్కీ కాపీ.. చైనా AI లపై అమెరికా నిఘా!

  • Love Marriage: నాలుగేళ్ల క్రితం ప్రేమ వివాహం.. ఇంతలోనే ఘోరం

  • AAP Crisis: హర్భజన్ సహా బీజేపీలో చేరిన ఎంపీలకు భారీ భద్రత..

  • MS Dhoni Re Entry: ఎంఎస్ ధోనీ ఫిట్, బట్ నో రీఎంట్రీ.. అసలు విషయం తెలిస్తే షాకే!

  • Astrology: లక్ష్మీ నారాయణ రాజయోగం.. ఈ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..

ట్రెండింగ్‌

  • Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్‌వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!

  • 7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!

  • 165Hz రిఫ్రెష్ రేట్‌, 12.3 అంగుళాల డిస్‌ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!

  • వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!

  • రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions