Elephants Attack: పార్వతీపురంలో ఏనుగుల హల్ చల్.. రైతుల ఆందోళన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రెండు తెలుగు రాష్ట్రాల్లో గజరాజుల బెడద వేధిస్తూనే వుంది. పార్వతీపురం మన్యం జిల్లా బలిజిపేట మండలంలోకి శుక్రవారం సాయంకాలం ఏనుగులు రంగ ప్రవేశం చేసాయి. ఒడిస్సా రాష్ట్రం నుంచి పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం నుంచి కాలువ గట్టు మీదగా నారాయణపురం చేరుకున్నాయి గజరాజులు. నారాయణపురం నుంచి బలిజిపేట మండలం వెంగాపురం గ్రామం పొలిమేరలో గల పంట పొలాల్లోకి ప్రవేశించాయి. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. అటవీ ప్రాంతంలో సంచరించాల్సిన గజరాజులు మైదాన ప్రాంతంలోకి చేరుకోవడంతో ఎప్పుడు ఏం జరుగుతుందో అని ఈ ప్రాంత ప్రజలు భయాందోళన చెందుతున్నారు.
Read Also: Cyber Fraud: సూర్యాపేట వైద్యాధికారికి సైబర్ కేటుగాళ్ళ బురిడీ
Also Read
- AP Govt: కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం.. ఆగస్టు 1 నుంచి ప్రారంభం..
- Indrakeeladri: ఆషాఢ సారె ఉత్సవాలు.. ఇంద్రకీలాద్రికి పోటెత్తిన భక్తులు..
- AP Covid Cases: ఏపీలో పెరుగుతున్న కోవిడ్ కేసులు.. నేటికి ఆ సంఖ్య ఎంతకు చేరిందంటే..
- Donkey Wedding: వర్షాలు కురవాలని గాడిదలకు ఘనంగా పెళ్లి.. కళ్యాణదుర్గంలో వినూత్న సంప్రదాయం!
దీపావళి పండగ రావడంతో ఎక్కువ మంది ప్రజలు సామాన్లు కొనుగోలు కోసం రోడ్ల పైన తిరుగుతున్నారు. దీంతో ప్రజలు అనేక భయభ్రాంతులకు గురవుతున్నారు. చేతికి వచ్చిన పంటలు నష్టపోతామేమో అని వారు ఆందోళనకు గురవుతున్నారు. గతంలో అనేక సార్లు గజరాజులు ఇక్కడ హల్ చల్ చేశాయి. గత ఏడాది చిత్తూరు జిల్లాలో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. రామకుప్పం మండలం పాలరేవు గడ్డ గ్రామ సమీపంలో అడవి ఏనుగులు తిరుగుతున్నాయి.
గ్రామ సమీపంలోని టమోటా, వరి పంటలను అడవి ఏనుగులు ధ్వంసం చేశాయని, ఏనుగుల ప్రవేశం వల్ల తాము ఆందోళనతో పాటు నష్టాల పాలు అవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. టమోటా పంటలపై ఏనుగులు దాడిచేశాయి. కానీ ఏనుగుల వల్ల తమకు భారీగా నష్టం వస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏనుగులను అడవిలోకి తరమడానికి ప్రయత్నించారు. గత ఏడాది మే నెలలో పుత్తూరులోని కళ్యాణపురం ఎస్టీ కాలనీలో ఓ మామిడితోట కాపలాదారుడిపై ఏనుగుల గుంపు దాడి చేసి చంపేయడం కలకలం రేపింది. ఇప్పుడు పార్వతీపురంలో ఏనుగులు ఎలాంటి నష్టం కలిగిస్తాయో మరి.
Read Also: Green India Challange : గ్రీన్ఇండియా చాలెంజ్ భాగంగా మొక్కలు నాటిన రమేష్ రెడ్డి
తాజావార్తలు
-
Missing Girls: హైదరాబాద్లో ముగ్గురు మైనర్ బాలికలు అదృశ్యం
-
Jagga Reddy : కేటీఆర్ రక్తంలో నిజాయితీ, కృతజ్ఞత లేదు
-
Rohit Sharma Century: హిట్ హిట్ మ్యాన్.. రోహిత్ శర్మ రికార్డు సెంచరీ.. గెలుపు దిశగా ఇండియా..
-
Pregnancy Tips : నువ్వులు తినడం వల్ల గర్భస్రావం అవుతుందా.?
-
Supreme Court : ప్రైవేట్ వర్సిటీల ఇష్టారాజ్యంపై సుప్రీంకోర్టు సీరియస్.!
ట్రెండింగ్
-
Jagannath Prasadam Recipe : జగన్నాథుడి ప్రసాదం మాల్పువా.. ఇంట్లోనే ఇలా చేస్తే రుచి అదుర్స్.!
-
Rainy Season Tips: వర్షాకాలంలో గోడలకు, మెట్లకు పాకురు పట్టిందా.? ఈ చిట్కా ట్రై చేయండి.!
-
Virat Kohli Retirement: తప్పుకుంటా.. బీసీసీఐకి విరాట్ కోహ్లీ వార్నింగ్.. వీడియో వైరల్!
-
Rohit Sharma: టెన్షన్ అవసరం లేదు.. రోహిత్ శర్మ ఆడుతాడు: మోర్కెల్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!