Vivo ఈ సంవత్సరం జూలైలో Vivo Y28e 5Gతో పాటు Vivo Y28s 5Gని ప్రారంభించింది. కాగా.. తాజాగా కంపెనీ Vivo Y28S 5G స్మార్ట్ఫోన్ ధరను తగ్గించింది. ఈ ఫోన్లో MediaTek Dimension 6300 చిప్సెట్, 8GB వరకు RAM, 50MP ప్రైమరీ కెమెరా వంటి ఫీచర్లు ఉన్నాయి. ఈ హ్యాండ్సెట్ 6.56 అంగుళాల HD + డిస్ప్లేను కలిగి ఉంది.
ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ అమెజాన్లో 'గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్' సేల్ నడుస్తుంది. అంతేకాకుండా.. అనేక ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలపై భారీ తగ్గింపులు అందుబాటులో ఉన్నాయి. 3 మోడళ్ల స్కూటర్లను 50% వరకు తగ్గింపుతో కొనుగోలు చేయవచ్చు. అందులో.. గ్రీన్ ఉడాన్ ఎలక్ట్రిక్ స్కూటర్, EOX E1 ఎలక్ట్రిక్ స్కూటర్, Komaki X-ONE స్మార్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్లు ఉన్నాయి.
ఇండియాలో లావా అగ్ని-సిరీస్ తాజా 5G స్మార్ట్ఫోన్ను విడుదల చేసింది. లావా అగ్ని 3 5G స్మార్ట్ఫోన్లో డ్యూయల్ డిస్ప్లే, 256GB వరకు స్టోరేజ్, 5000mAh బ్యాటరీ వంటి ఫీచర్లు ఉన్నాయి. లావా అగ్ని 3 5G 8GB ఇంబిల్ట్ RAM.. 8GB వర్చువల్ RAMతో 16 GB వరకు మొత్తం RAM సపోర్ట్ చేస్తుంది. 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP ప్రైమరీ రియర్ కెమెరా వంటి ఫీచర్లు ఉన్నాయి.
2022లో ప్రారంభించిన EV6 క్రాస్ఓవర్ తర్వాత కియా ఇండియా.. ఆల్-ఎలక్ట్రిక్ కారును భారత మార్కెట్లో రిలీజ్ చేసింది. EV9 ఆల్-ఎలక్ట్రిక్ SUV పూర్తిగా లోడ్ చేయబడిన GT-లైన్ AWD వేరియంట్లో అందిస్తున్నారు. ఈ కారు ధర రూ. 1.3 కోట్లు (ఎక్స్-షోరూమ్).
మరొక హై-స్పీడ్ స్కూటర్ జెలియో ఎబైక్స్ మిస్టరీ (Zelio eBikes Mystery) ఎలక్ట్రిక్ టూ వీలర్ భారత్ మార్కెట్లోకి వచ్చింది. ఈ స్కూటర్ను రూ.81,999 ప్రారంభ ధరతో మార్కెట్లోకి విడుదల చేయాలని కంపెనీ నిర్ణయించింది.మ
కరోనా వైరస్ కొత్త వేరియంట్ XEC కలవరపెడుతోంది. యూరోపియన్ దేశాలలో ఈ వైరస్ ఇన్ఫెక్షన్ కేసుల పెరుగుదల అధికంగా నమోదవుతోంది. పలు దేశాల్లో కరోనావైరస్ కొత్త వేరియంట్ XEC కేసులు వేగంగా పెరుగుతున్నట్లు శాస్త్రవేత్తలు వెల్లడించారు. త్వరలోనే ఇది ఆధిపత్య మహమ్మారిగా రూపాంతరం చెందే అవకాశం ఉందని నిపుణులు వెల్లడించారు.
యమహా మోటార్ భారత మార్కెట్లోకి కొత్త R15M బైక్ను విడుదల చేసింది. ఈ బైక్లో కొత్త కార్బన్ ఫైబర్ ట్రిమ్ వేరియంట్ అందుబాటులో ఉంది. అంతేకాకుండా.. కొత్త ఫీచర్లు చేర్చారు. మెటాలిక్ గ్రేలో R15M ధర రూ.1,98,300 లభిస్తుంది. కొత్త కార్బన్ ఫైబర్ ప్యాటర్న్ రూ.2,08,300కి అందుబాటులో ఉంది. రెండు ధరలు ఎక్స్-షోరూమ్. R15M బైక్ బాడీవర్క్ కార్బన్ ఫైబర్ నమూనాతో తయారు చేశారు.
హీరో కంపెనీ నుంచి ఎక్స్ట్రీమ్ 160ఆర్ బైక్ విడుదల అయింది. ఈ మోడల్ బైక్లో కంపెనీ కొన్ని కొత్త ఫీచర్లను చేర్చింది. స్పెసిఫికేషన్లలో మాత్రం ఎటువంటి మార్పు లేదు. అలాగే.. లుక్, డిజైన్ చాలా వరకు ఒకే విధంగా ఉన్నాయి. Xtreme 160R 2V సింగిల్ డిస్క్ వేరియంట్తో స్టీల్త్ బ్లాక్ కలర్లో మాత్రమే అందుబాటులో ఉండనుంది. ఈ బైక్ ధర రూ.1,11,111 ఎక్స్-షోరూమ్.
Mercedes-Benz ఇండియా మేబ్యాక్ EQS ఆల్-ఎలక్ట్రిక్ SUVని విడుదల చేసింది. దీని ధర.. రూ. 2.25 కోట్లు ఉంది. EQS 680 అనేది నెట్-ఎలక్ట్రిక్ లగ్జరీ SUV. ఇది గత ఏడాది ఏప్రిల్లో ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లోకి వచ్చింది. అయితే.. మంచి లగ్జరీ కారు కోసం చూస్తున్న కస్టమర్లకు ఈ కారు గొప్ప ఎంపిక. ఎందుకంటే ఈ కారు అనేక అధునాతన ఫీచర్లను కలిగి ఉంది. అంతేకాకుండా.. డిజైన్ చాలా ఫ్యూచరిస్టిక్గా ఉంది.
టాటా మోటార్స్ కర్వ్ యొక్క ICE (ఇంటర్నల్ కంబషన్ ఇంజన్) మోడల్ను లాంచ్ చేసింది. గత నెలలో కర్వ్ ఈవీ(Curvv EV) లాంచ్ అయిన సంగతి తెలిసిందే.. టాటా కర్వ్ కాంపాక్ట్ SUV సెగ్మెంట్లో రూ.9.99 లక్షల ప్రారంభ ధరతో మార్కెట్లోకి వచ్చింది. కాగా.. కర్వ్ టాప్ మోడల్ రూ. 17.69 లక్షలు ఉంది (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్). 2024 అక్టోబర్ 31 వరకు బుకింగ్లు ఉంటాయని కంపెనీ ప్రకటించింది.