కొత్త సెడాన్ కారును కొనుగోలు చేయాలనుకుంటున్నట్లయితే అదిరిపోయే శుభవార్త ఉంది. ప్రముఖ కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్.. సెడాన్ ఆరాపై ఈ (నవంబర్) నెలలో బంపర్ డిస్కౌంట్లను అందిస్తోంది. నవంబర్ 2024లో హ్యుందాయ్ ఆరాను కొనుగోలు చేసే వినియోగదారులు రూ. 43,000 వరకు ఆదా చేసుకోవచ్చు.
హ్యుందాయ్ వెర్నా రెండు కొత్త ఫీచర్లతో ముందుకొస్తుంది. ఈ కారు వెనుక స్పాయిలర్తో వస్తుంది. అంతేకాకుండా.. కొత్త గ్రే మోనోటోన్ కలర్ ఆప్షన్ లో వినియోగదారులకు అందుబాటులో ఉండనుంది. అలాగే.. హ్యుందాయ్ వెర్నా భారతీయ కస్టమర్ల కోసం మొత్తం 8 మోనోటోన్ షేడ్స్లో అందుబాటులో ఉంటుంది.
ఫ్రెంచ్ వాహన తయారీ సంస్థ సిట్రోయెన్ ఎయిర్క్రాస్ ప్రత్యేక ఎడిషన్ యాక్సెసరీ ప్యాకేజీని విడుదల చేసింది. సిట్రోయెన్ ఎయిర్క్రాస్ ఎక్స్ప్లోరర్ ఎడిషన్ పేరుతో విడుదలైంది. ఈ స్పెషల్ ఎడిషన్ యాక్సెసరీ ప్యాకేజీలు రెండు ఎంపికలలో లభిస్తాయి. స్టాండర్డ్ ప్యాక్ ధర ప్రస్తుత మోడల్ కంటే INR 24,000. ఆప్షనల్ ప్యాక్ ధర INR 51,700.
పండుగ సీజన్ను దృష్టిలో ఉంచుకుని దిగ్గజ కంపెనీలన్నీ ఆఫర్స్, డిస్కౌంట్స్ ప్రకటిస్తుంటే.. ట్రయంఫ్ కంపెనీ మాత్రం రూ. 19.39 లక్షల ఖరీదైన '2025 టైగర్ 1200' బైక్ను ఇండియాలో లాంచ్ చేసింది. ఈ బైక్ నాలుగు వేరియంట్లలో ముందుకొచ్చింది. అంతేకాకుండా.. కొత్త ఇంజిన్, మెరుగైన రైడ్ సౌకర్యం, ఎర్గోనామిక్స్, మరిన్ని ఎలక్ట్రానిక్ టూల్స్ ఉన్నాయి.
రాయల్ ఎన్ఫీల్డ్ మోటార్ బైకులకు ఇండియాలో ఎలాంటి క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దాదాపు.. ఇండియాలో ఈ బైక్ లే దర్శనమిస్తాయి. అయితే.. మీరు కూడా భవిష్యత్తులో రాయల్ ఎన్ఫీల్డ్ బైకును కొనుగోలు చేయాలనుకుంటున్నట్లయితే.. ఈ వార్త మీకు ఉపయోగ పడుతుంది. కంపెనీ తన మోస్ట్-వెయిటింగ్ రాయల్ ఎన్ఫీల్డ్ ఇంటర్సెప్టర్ బేర్ 650ని మార్కెట్లో లాంచ్ చేయడానికి సన్నాహాలు చేస్తోంది. అయితే.. గ్లోబల్ డెబ్యూకి ముందు, రాయల్ ఎన్ఫీల్డ్ ఇంటర్సెప్టర్ బేర్ 650 ఫీచర్లు లీక్ అయ్యాయి.
శాంసంగ్ A-సిరీస్ తాజా స్మార్ట్ఫోన్ను ఈ రోజు ఇండియాలో లాంచ్ చేసింది. శాంసంగ్ గెలాక్సీ ఏ 16 5జీ (Samsung Galaxy A16 5G)తో గత వారం యూరప్లో ప్రారంభమైంది. తాజాగా.. ఇండియాలో ఈ స్మార్ట్ ఫోన్ విడుదల అయింది. ఈ ఫోన్ 6.7 అంగుళాల ఫుల్ హెచ్డీ+ సూపర్ Super AMOLED డిస్ప్లే, 50MP ప్రైమరీ కెమెరా, 5000mAh బ్యాటరీ వంటి ఫీచర్లను కలిగి ఉంది.
మారుతి సుజుకి బాలెనో రీగల్ ఎడిషన్ను విడుదల చేసింది. బాలెనో మారుతి సుజుకి అత్యధికంగా అమ్ముడైన మోడళ్లలో ఒకటి. ఈ స్పెషల్ ఎడిషన్ హ్యాచ్బ్యాక్ అన్ని వేరియంట్లలో అందుబాటులో ఉంది. బాలెనో రీగల్ ఎడిషన్లో బాలెనో సాధారణ మోడల్కు భిన్నంగా ఉండే అప్డేట్లు ఉన్నాయి.
జియో భారత్ ఈరోజు 4G ఫీచర్ ఫోన్లను విడుదల చేసింది. జియోభారత్ V3, జియోభారత్ V4 పేరుతో మార్కెట్లో లాంచ్ చేసింది. ఇండియన్ మొబైల్ కాంగ్రెస్ 2023 సదస్సులో ఈ ఫీచర్ ఫోన్లను అందుబాటులోకి తీసుకొచ్చింది.
హానర్ కొత్త ట్యాబ్ను రిలీజ్ చేసేందుకు రెడీ అయింది. హానర్ టాబ్లెట్ జీటీ ప్రో (Honor Tablet GT Pro) వచ్చే వారం చైనాలో విడుదల కానుంది. అందుకు సంబంధించి కంపెనీ హానర్ టాబ్లెట్ జీటీ ప్రో డిజైన్, కలర్ ఆప్షన్స్, కొన్ని కీలక స్పెసిఫికేషన్లను వెల్లడించింది. ఈ ట్యాబ్ ను హానర్ X60 సిరీస్ స్మార్ట్ఫోన్తో ప్రారంభించనున్నారు. ట్యాబ్లో బేస్, ప్రో వేరియంట్లు ఉండే అవకాశం ఉంది. టాబ్లెట్ జీటీ ప్రో 12.3-అంగుళాల డిస్ప్లేను కలిగి…
Vivo ఈ సంవత్సరం జూలైలో Vivo Y28e 5Gతో పాటు Vivo Y28s 5Gని ప్రారంభించింది. కాగా.. తాజాగా కంపెనీ Vivo Y28S 5G స్మార్ట్ఫోన్ ధరను తగ్గించింది. ఈ ఫోన్లో MediaTek Dimension 6300 చిప్సెట్, 8GB వరకు RAM, 50MP ప్రైమరీ కెమెరా వంటి ఫీచర్లు ఉన్నాయి. ఈ హ్యాండ్సెట్ 6.56 అంగుళాల HD + డిస్ప్లేను కలిగి ఉంది.