రైతుల పాలిట తెలంగాణ సీఎం రాబందులా మారారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్… వరి బంద్ పథకాన్ని కేసీఆర్ స్టార్ట్ చేసిండు అంటూ ఎద్దేవా చేసిన ఆయన.. రైతులు వరి పండించకుండా ఏమి పంట వేయాలో ముఖ్యమంత్రి చెప్పాలని డిమాండ్ చేశారు. ఇప్పటికి వ్యవసాయ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేయలేదు.. ముఖ్యమంత్రి కన్ఫ్యూజ్ లో ఉంటాడు.. ఈయన కన్ఫ్యూజన్ ముఖ్యమంత్రి అంటూ సెటైర్లు వేసిన బండి.. కేసీఆర్ ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి…
భారతీయ జనతా పార్టీ నేతలకు సవాల్ విసిరారు తెలంగాణ వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి.. సాగు, ధాన్యం కొనుగోళ్ల విషయంలో టీఆర్ఎస్, బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తుండగా.. ఇవాళ మీడియాతో మాట్లాడిన ఆయన.. బీజేపీకి సవాల్ విసిరారు.. ఇవాళ సాయంత్రం 5 గంటల లోపు కేంద్రం నుంచి తెలంగాణలో యాసంగిలో వేసే ఏ పంట అయిన కొంటాం అని ఉత్తరం తీసుకురావాలన్నారు.. ఒక వేళ లెటర్ తీసుకురాకపోతే పదవులకు బండి సంజయ్, కిషన్ రెడ్డి…
ఉదయాన్నే ఆ ఊరికి చెందిన కొందరు వ్యక్తులు రోడ్డు పక్కన నిలబడి ఆటోలు ఆపుతుంటారు. ఆటో ఆగిన తరువాత ఆటో డ్రైవర్తో మాట్లాడుతారు. ఆ తరువాత అందులోని వ్యక్తులను తీసుకొని వెళ్తారు. ఎవరు వారంతా, ఎందుకు తీసుకెళ్తున్నారు. ఎక్కడికి తీసుకెళ్తారు అనే అనుమానాలు రావొచ్చు. ఆదిలాబాద్ జిల్లాలోని తాంసీ మండలంలో పొన్నారి అనే గ్రామం ఉన్నది. ఆ గ్రామంలో పత్తిపంట చేతికి వచ్చిన తరువాత పత్తిని తీసేందుకు కూలీల కోసం అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆదిలాబాద్ చుట్టుపక్కల…
తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు గంజాయి గమ్మత్తుగా చిత్తు చేస్తోంది. రాజకీయాల్లో మాటల మంటలకు అదే కారణం అని చెప్పకతప్పదు. గుజరాత్లో దొరికిన మత్తు పదార్ధాల దగ్గర్నించి.. నిత్యం విశాఖ, ఏవోబీలో పట్టుబడే గంజాయి వరకూ అంతా రాజకీయ నేతల మధ్య వాగ్వాదానికి కారణం అవుతోంది. ఇదంతా ఒక ఎత్తయితే.. గంజాయిని సాగుచేసే రైతులు అనుసరిస్తున్న విధానాలు ఔరా అనిపించకమానవు. ఇటీవల కాలంలో గంజాయి రవాణాపై దాడులు పెరుగుతున్న నేపథ్యంలో వ్యాపారులు కొత్త విధానాలు అవలంభిస్తున్నారు… ఇంతవరకు వ్యాపారస్తులే…
రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కూడా దొరకని పరిస్థితి వచ్చింది.. అయితే, ఏ పంట పడితే అది వేసి.. నష్టాలు చవిచూడొద్దని చెబుతున్నారు తెలంగాణ వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి.. ఈ యాసంగిలో మినుములు సాగు చేయాలని రాష్ట్ర రైతాంగానికి విజ్ఞప్తి చేశారు.. యాసంగిలో మినుములు విరివిగా సాగు చేయాలని కోరిన ఆయన.. పూర్తి స్థాయిలో మార్క్ ఫెడ్ ద్వారా మినుముల కొనుగోలుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.. రైతులు వెంటనే మినుములను విత్తుకోవాలని.. మినుముల…
తెలంగాణ రైతులకు ముఖ్యమంత్రి కేసీఆర్ శుభవార్త అందించారు. ప్రభుత్వమే ధాన్యం కొనుగోలు చేస్తుందని ప్రకటించారు. రైతులు అధైర్యపడొద్దని భరోసా ఇచ్చారు.ఇన్ని రోజులు ధాన్యం అమ్ముకునేందుకు రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కొనేవారు లేక ఇంట్లోనే ధాన్యం పేరుకుపోయిన పరిస్థితి. ఈ తరుణంలో వ్యవసాయ శాఖపై సమీక్ష నిర్వహించిన సీఎం కేసీఆర్.. ధాన్యం కొనుగోలు చేస్తామని ప్రకటించారు. ప్రతి గింజ ప్రభుత్వమే కొంటుందన్నారు. ధాన్యం కొనుగోలు విషయంలో రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. మద్దతు ధర ప్రకారమే…
లఖింపూర్ ఖేరీ ఘటనపై ఇంకా దేశంలో ఆందోళనలు జరుగుతూనే ఉన్నాయి. రైతుల ర్యాలీపైకి కేంద్రమంత్రి కుమారుడు అశిశ్ మిశ్రా కాన్వాయ్లోని కారు దూసుకుపోవడంతో నలుగురు రైతులు మృతి చెందారు. ఆ తరువాత జరిగిన సంఘటనలో మరో ఐదుగురు మృతి చెందారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. అశిశ్ మిశ్రాను పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ ఘటనపై రైతు సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నాయి. ఆశిశ్ మిశ్రాతో పాటుగా కేంద్ర…
వానాకాలపు పంట ప్రతీ గింజను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని…తెలంగాణ ఆర్థిక మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు. వర్షానికి తడిసిన పంటను తెలంగాణ ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని…రైతులు ఆందోళన చెందవద్దని హామీ ఇచ్చారు. టీఆర్ఎస్ రైతు బంధు పార్టీ అని…… బీజేపీ రైతులపై బందూకులు ఎత్తిన పార్టీ అని ఫైర్ అయ్యారు. రైతును రాజుగా చేయాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యమన్నారు. హుజూరాబాద్ లో ఐదు వేల ఇళ్లు కట్టించే బాధ్యత తనదేనని హామీ ఇచ్చారు మంత్రి…
అగ్రి ఇన్ఫ్రా ప్రాజెక్టులపై సమీక్ష నిర్వహించారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.. రైతులకు మంచి ధర అందేలా అధికారులు ప్రత్యేక దృష్టిపెట్టాలని ఆదేశించారు. వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోళ్లలో పోటీని పెంచేలా చూడాలని.. దీని వల్ల రైతులకు మంచి ధర వస్తుందన్నారు. ధరల విషయంలో ఎక్కడ ఇబ్బందులు ఉన్నా వెంటనే మార్కెట్లో జోక్యం చేసుకోవాలన్నారు. ధరల స్థిరీకరణ నిధి ద్వారా రైతులను ఆదుకునే చర్యలను దూకుడుగా చేపట్టాలని పేర్కొన్న సీఎం…
ఎంపీలు వరుణ్ గాంధీ, మేనకా గాంధీలకు షాకిచ్చింది భారతీయ జనతా పార్టీ.. 80మందితో బీజేపీ జాతీయ కార్యనిర్వాహక కమిటీని ఆ పార్టీ అధినాయకత్వం ప్రకటించింది. కమిటీలో ప్రధాని నరేంద్ర మోడీ, ఎల్కే అద్వానీ, డాక్టర్ మురళీమనోహర్ జోషీ, రాజ్నాథ్సింగ్, అమిత్ షా, నితిన్ గడ్కరీ, పీయూష్ గోయల్ సహా పలువురు కీలక నేతలు ఉన్నారు. ఈ జాబితాలో తెలుగు రాష్ట్రాల నుంచి ఐదుగురు నేతలకు చోటు దక్కింది. ఏపీ నుంచి కన్నా లక్ష్మీనారాయణ, తెలంగాణ నుంచి కేంద్రమంత్రి…