వాటెన్ ఐడియా.. గంజాయి సాగులో నయా ట్రెండ్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు గంజాయి గమ్మత్తుగా చిత్తు చేస్తోంది. రాజకీయాల్లో మాటల మంటలకు అదే కారణం అని చెప్పకతప్పదు. గుజరాత్లో దొరికిన మత్తు పదార్ధాల దగ్గర్నించి.. నిత్యం విశాఖ, ఏవోబీలో పట్టుబడే గంజాయి వరకూ అంతా రాజకీయ నేతల మధ్య వాగ్వాదానికి కారణం అవుతోంది. ఇదంతా ఒక ఎత్తయితే.. గంజాయిని సాగుచేసే రైతులు అనుసరిస్తున్న విధానాలు ఔరా అనిపించకమానవు.
ఇటీవల కాలంలో గంజాయి రవాణాపై దాడులు పెరుగుతున్న నేపథ్యంలో వ్యాపారులు కొత్త విధానాలు అవలంభిస్తున్నారు… ఇంతవరకు వ్యాపారస్తులే నేరుగా ఏజెన్సీకి వచ్చి కొనుగోలు చేసేవారు. ఈ క్రమంలో దాడులు జరిగితే నేరుగా వారిపై కేసులు నమోదవుతున్నాయి. వీటి నుంచి తప్పించుకునేందుకు వ్యాపారులు కొత్త విధానాలను తెరపైకి తెచ్చారు. ప్రస్తుతం గంజాయిని సాగుచేసే రైతులే నేరుగా వ్యాపారులు చెప్పిన చోటుకు అప్పజెప్పేవిధంగా ఒప్పందం చేసుకుంటున్నారు.
Also Read
- Illegal Ration Rice: అక్రమ రేషన్ బియ్యం మాఫియాపై పోలీసుల ఉక్కుపాదం.. 2 వేల కేజీల బియ్యం స్వాధీనం!
- Tirupati Crime News: తిరుపతిలో దారుణం.. బాలికపై బాబాయ్ అత్యాచారం!
- Off The Record : విచ్చలవిడిగా ఇసుక అక్రమాలు.. మైనింగ్ ఏడీ ఫణిభూషణ్ పై తీవ్ర ఆరోపణలు
- Off The Record : చీమకుర్తి గ్రానైట్ క్వారీల్లో అదృశ్య శక్తులు..? వైసీపీ ఎమ్మెల్యే క్వారీని టార్గెట్ చేశారా?
తాజాగా జరిగిన ఉదంతమే దీనికి ఉదాహరణగా చెప్పవచ్చు. గురువారం నర్సీపట్నం మండలం, గబ్బాడ వంతెన వద్ద పట్టుకున్న గంజాయి అక్రమ రవాణాలో రైతులే నేరుగా తరలిస్తూ పట్టుబడడం పోలీసులను ఆశ్చర్య చకితుల్ని చేసింది. ఈ ఘటనలో వాహనాలు తనిఖీ చేస్తున్న పోలీసులను చూసి, నర్సీపట్నం వైపు వస్తున్న ఐషర్ వ్యాన్ లో వున్న ఐదుగురిలో, ముగ్గురు వ్యక్తులు పరారయ్యారు. మిగిలిన ఇద్దరైన పాంగి రవి, కిముడు రాజేంద్రలను పట్టుకొని పోలీసులు ప్రశ్నించారు.
తమ పొలంలో తాము పండించిన గంజాయిని నేరుగా వ్యాపారస్తులకు అప్పగించి, నగదు తీసుకునే విధంగా ఒప్పందం చేసుకున్నామని వివరించారు. దీనిలో భాగంగా చేపల మేత మొక్కజొన్నల మాటున గంజాయిని రవాణా చేస్తున్నట్టు వివరించారు.
ఈ ఘటనలో 1,720కిలోల గంజాయిని పట్టుకున్న నర్సీపట్నం రూరల్ పోలీసులు ఇద్దరిపై కేసు నమోదు చేసి, వ్యాన్ సీజ్ చేశారు. ఇలాంటి రవాణా విధానం వల్ల వ్యాపారస్తులు తప్పించుకోవడం, పండించిన రైతులే కటకటాల పాలవడం జరుగుతుంది.
తాజావార్తలు
-
Ambati Rayudu: IPL 2026లో తోపు కెప్టెన్ అతనే..
-
Bermuda Triangle Mystery: బెర్ముడా రహస్యాన్ని ఛేదించిన శాస్త్రవేత్తలు.. అక్కడ ఏముందంటే..
-
Virat Kohli: కెప్టెన్గా కాదు.. స్నేహితుడిగా జట్టును నడిపించా.!
-
CNG Prices Hike: మరో బిగ్ షాక్.. సీఎన్జీ ధరలు భారీగా పెంపు..
-
Hyderabad Petrol Price: భాగ్యనగరంలో పెట్రోల్ మంట.. దేశంలోనే హైదరాబాద్లో అత్యధిక పెట్రోల్ ధర!
ట్రెండింగ్
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!