పోడు రైతుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం : మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గత కొంత కాంలంగా రాష్ట్రంలో పోడు భూములు సాగు చేసుకుంటున్న గిరిజన రైతులపై అనేక సార్లు అటవీఅధికారులు దాడికి పాల్పడ్డారు. ఇదే సమయంలో తమకు భూమి హక్కు పత్రాలు ఇవ్వాలని రైతులు ఎన్నో సార్లు ప్రభుత్వానికి మొర పెట్టుకున్నారు. తాజాగా శనివారం మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి నేతృత్వంలో పోడు రైతుల సమస్యలను పరిష్కరించేందుకు అఖిల పక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డితో పాటు ఎమ్మెల్యేలు, అధికారులు అఖిల పక్ష నాయకులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న మంత్రి ఇంద్ర కరణ్ రెడ్డి మాట్లాడారు. పోడు రైతుల సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని ఆయన చెప్పారు. ఇప్పటికే పోడు రైతులతో, అఖిలపక్షం నాయకులతో చర్చలు జరుపుతున్నట్టు ఆయన తెలిపారు. పోడు రైతుల సమస్యలను పరిష్కరించేందుకే సీఎం కేసీఆర్ సిద్ధంగా ఉన్నారని తెలిపారు. దీనికి శాశ్వత పరిష్కారం దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని తెలిపారు.
Also Read
ఇంకా మంత్రి మాట్లాడుతూ రైతులు సంయనంతో ఉండాలన్నారు. అటు రెవెన్యూ, అటవీ శాఖ అధికారులకు సహకరించాలన్నారు. అర్హులైన లబ్ధిదారులను గుర్తించాలని మంత్రి అధికారులకు సూచించారు. గతంలో పోడు రైతులను విస్మరించారని అఖిలపక్షం నాయకులు మంత్రి వద్ద మొరపెట్టుకున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఈ సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరించి రైతులకు హక్కు పత్రాలు ఇవ్వాలని కోరారు. అఖిల పక్షం నాయకులు అధికారులకు సహకరించాలని ప్రభుత్వం పోడు రైతుల సమస్యలను పరిష్కరించేందుకే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్టు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు.
తాజావార్తలు
-
Konda Surekha : కాంగ్రెస్ అధ్యక్షుడితో కొండా సురేఖ భేటీ.. కూతురి వ్యాఖ్యలపై ఖర్గే ఆరా
-
Telangana Auto Strike : ఆటో, క్యాబ్ సమ్మె క్యాన్సిల్.. ప్రభుత్వ చర్చలు సక్సెస్
-
AK-203: AK-203 ‘షేర్’.. రష్యన్ టెక్నాలజీ, మేడ్ ఇన్ ఇండియా రైఫిల్
-
NMMS Scholarship : విద్యార్థులకు రూ.48 వేల స్కాలర్షిప్.. రేపే లాస్ట్ ఛాన్స్.!
-
Varanasi: 50కి పైగా భాషల్లో ‘వారణాసి’.. డబ్బింగ్ కోసం 1600 మందికి పైగా ఆర్టిస్టులు!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!