Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Minister Sabita Indrareddy On Saturday Attended A Meeting With All Party Leaders

అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ హక్కు పత్రాలు వస్తాయి: సబితా ఇంద్రారెడ్డి

Published Date :October 30, 2021 , 7:38 pm
By NTV WebDesk
అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ హక్కు పత్రాలు వస్తాయి: సబితా ఇంద్రారెడ్డి
  • Follow Us :
  • google news
  • dailyhunt


ప్రభుత్వం పోడు భూముల సమస్యలను పరిష్కరించేందుకు, ఈ సమస్యకు శాశ్వత పరిష్కారానికి తీసుకోవాల్సిన సూచనలు, ప్రతిపాదనలకు సంబంధించి ఒక కమిటీ వేశారు. ఆయా జిల్లాలకు సంబంధించి మంత్రుల ఆధ్వర్యంలో ఈ కమిటీ అఖిల పక్షం సూచనలు తీసుకుంటుంది. దాని అమలు సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తుంది. రంగారెడ్డి జిల్లాకు సంబంధించి మంత్రి సబిత ఇంద్రారెడ్డి శనివారం అఖిలపక్ష నాయకులతో సమావేశంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు.

పోడు భూముల సమస్యకు శాశ్వత పరిష్కారం ఇవ్వాలని సీఎం కేసీఆర్‌ కమిటీ వేశారన్నారు. నవంబర్ 8వ తేదీ నుంచి పోడు భూములపై క్లైమ్స్ తీసుకుంటాం. ఒక లక్ష 8 వేల ఎకరాల అటవీ వైశాల్యం ఉన్న జిల్లా వికారాబాద్‌లో ఉందన్నారు. 2006 లో అటవీ హక్కుల చట్టం అమల్లోకి వచ్చిందని, చట్టం వచ్చాక 672 క్లెయిమ్స్‌ను 1,131 ఎకరాలకు సంబంధించి హక్కు పత్రాలు ఇచ్చినట్టు మంత్రి తెలిపారు. 2,449 ఎకరాల్లో పోడు భూములు సాగు చేసుకున్నట్లు రికార్డుల్లో ఉందన్నారు. ఇది చాలా పాతదైనందున ఇంకా విస్తీర్ణం పెరిగే అవకాశం ఉందన్నారు.

తెలంగాణ ప్రభుత్వం వచ్చాక 68 లక్షల ఎకరాల అడవి భూమి ఉన్నట్టు అధికారులు గుర్తించారని మంత్రి సబిత ఇంద్రారెడ్డి తెలిపారు. 2006 కు ముందే 6 లక్షల ఎకరాలకు పైగా అటవీ భూమి సాగులో ఉంది. కొత్తగా పోడు ఆపాలని సీఎం కేసిఆర్ కొత్త క్లెయిమ్స్ తీసుకోవడం ఆపారు. అప్పటికే పోడు చేసుకుంటున్న వారికి అన్యాయం జరుగొద్దు అనేది ప్రభుత్వ ఆలోచన. ఇకపై ఇంకో ఇంచు అడుగు కూడా పోడు కాకుండా చూడాలని అడవిని రక్షించాలని సీఎం కేసిఆర్ గారు ఆలోచించారు. ఆర్ ఓఎఫ్ఆర్ అర్హులందరికీ పట్టాలు ఇస్తామని వెల్లడించారు. 2005 నుంచి నేటి వరకు శాటిలైట్ మ్యాప్స్‌ మా దగ్గర ఉన్నాయన్నారు.

అఖిల పక్షం లో వచ్చిన సలహాలు, సూచనలను స్వీకరిస్తూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. సర్వే జరిగే సమయంలో గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు, పార్టీల నేతలు దగ్గరుండి పరిశీలించాలి.గతంలో హక్కులు ఇచ్చిన వారు కబ్జాలో ఉన్నారో లేదో చూడాలి. ఇంతకు ముందు వేసిన రోడ్లకు ఇబ్బందులు పెట్టొద్దు అని ముఖ్యమంత్రి ఇప్పటికే చెప్పారు. సర్వే చేసి హద్దులు నిర్ణయిస్తే భవిష్యత్తు లో సమస్యలు రావు. కొత్తగా ఎవరు కబ్జాకు ప్రయత్నం చేయకుండా చూడాలని మంత్రి పేర్కొన్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Farmers
  • kcr
  • Rangareddy
  • Sabita Indrareddy
  • TRS

తాజావార్తలు

  • Parents Smoking: తల్లితండ్రుల అలవాట్లు పిల్లల ఆరోగ్యంపై ప్రభావం.. కొత్త అధ్యనంలో షాకింగ్ విషయాలు..!

  • Daily Horoscope: బుధవారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి వృత్తి, వ్యాపారాల్లో డబ్బే డబ్బు!

  • Nora Fatehi Song Controversy: నోరా ఫతేహి పాట వివాదం.. వివరణ ఇచ్చిన గీత రచయిత.. తప్పు నాది కాదు..!

  • Off The Record: కూటమిలో ఉన్న నమ్మకం లేదా..? రాజమండ్రిలో బీజేపీ మాస్టర్ ప్లాన్..!

  • Off The Record : తంబళ్లపల్లి టీడీపీలో వర్గపోరు.. ఇంచార్జ్ పోస్ట్ కోసం ఫైట్..!!

ట్రెండింగ్‌

  • Pomegranate Benefits: ప్రతిరోజూ ఒక దానిమ్మ పండు.. మీ శరీరానికి కలిగే అద్భుత ప్రయోజనాలు

  • Swaasa : మీ దగ్గు విని వ్యాధిని చెప్పేస్తుంది.! ఈ కొత్త AI టెక్నాలజీ గురించి తెలుసా.?

  • Ugadi Special : ఉగాది నాడు మనం వేప, బెల్లం ఎందుకు తింటామో మీకు తెలుసా?

  • Health Tips : బెండకాయతో కలిపి వీటిని అస్సలు తినకండి.. ఆరోగ్యానికి ప్రమాదకరం..!

  • Summer Tips : 40°+ ఎండలో కూల్‌గా ఉండాలంటే.. ఈ సమ్మర్ సీక్రెట్స్ ట్రై చేయండి..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions