అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ హక్కు పత్రాలు వస్తాయి: సబితా ఇంద్రారెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రభుత్వం పోడు భూముల సమస్యలను పరిష్కరించేందుకు, ఈ సమస్యకు శాశ్వత పరిష్కారానికి తీసుకోవాల్సిన సూచనలు, ప్రతిపాదనలకు సంబంధించి ఒక కమిటీ వేశారు. ఆయా జిల్లాలకు సంబంధించి మంత్రుల ఆధ్వర్యంలో ఈ కమిటీ అఖిల పక్షం సూచనలు తీసుకుంటుంది. దాని అమలు సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తుంది. రంగారెడ్డి జిల్లాకు సంబంధించి మంత్రి సబిత ఇంద్రారెడ్డి శనివారం అఖిలపక్ష నాయకులతో సమావేశంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు.
పోడు భూముల సమస్యకు శాశ్వత పరిష్కారం ఇవ్వాలని సీఎం కేసీఆర్ కమిటీ వేశారన్నారు. నవంబర్ 8వ తేదీ నుంచి పోడు భూములపై క్లైమ్స్ తీసుకుంటాం. ఒక లక్ష 8 వేల ఎకరాల అటవీ వైశాల్యం ఉన్న జిల్లా వికారాబాద్లో ఉందన్నారు. 2006 లో అటవీ హక్కుల చట్టం అమల్లోకి వచ్చిందని, చట్టం వచ్చాక 672 క్లెయిమ్స్ను 1,131 ఎకరాలకు సంబంధించి హక్కు పత్రాలు ఇచ్చినట్టు మంత్రి తెలిపారు. 2,449 ఎకరాల్లో పోడు భూములు సాగు చేసుకున్నట్లు రికార్డుల్లో ఉందన్నారు. ఇది చాలా పాతదైనందున ఇంకా విస్తీర్ణం పెరిగే అవకాశం ఉందన్నారు.
Also Read
- Off The Record : మంత్రుల వైఖరి తో నారాజ్ గా ఉమ్మడి మెదక్ కాంగ్రెస్ కేడర్
- Ghost SIM Scam: 'ఘోస్ట్ సిమ్’ గ్యాంగ్ గుట్టురట్టు.. 13 రాష్ట్రాల్లో ఆపరేషన్ ఆక్టోపస్.!
- Off The Record : కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారుల పర్యటనలు అంటేనే భయపడుతున్న రాష్ట్ర అధికారులు
- TGPSC : నిరుద్యోగులకు డబుల్ బెనిఫిట్.. వయోపరిమితి పెంపు.. తెలుగులో ఎగ్జామ్..!
తెలంగాణ ప్రభుత్వం వచ్చాక 68 లక్షల ఎకరాల అడవి భూమి ఉన్నట్టు అధికారులు గుర్తించారని మంత్రి సబిత ఇంద్రారెడ్డి తెలిపారు. 2006 కు ముందే 6 లక్షల ఎకరాలకు పైగా అటవీ భూమి సాగులో ఉంది. కొత్తగా పోడు ఆపాలని సీఎం కేసిఆర్ కొత్త క్లెయిమ్స్ తీసుకోవడం ఆపారు. అప్పటికే పోడు చేసుకుంటున్న వారికి అన్యాయం జరుగొద్దు అనేది ప్రభుత్వ ఆలోచన. ఇకపై ఇంకో ఇంచు అడుగు కూడా పోడు కాకుండా చూడాలని అడవిని రక్షించాలని సీఎం కేసిఆర్ గారు ఆలోచించారు. ఆర్ ఓఎఫ్ఆర్ అర్హులందరికీ పట్టాలు ఇస్తామని వెల్లడించారు. 2005 నుంచి నేటి వరకు శాటిలైట్ మ్యాప్స్ మా దగ్గర ఉన్నాయన్నారు.
అఖిల పక్షం లో వచ్చిన సలహాలు, సూచనలను స్వీకరిస్తూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. సర్వే జరిగే సమయంలో గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు, పార్టీల నేతలు దగ్గరుండి పరిశీలించాలి.గతంలో హక్కులు ఇచ్చిన వారు కబ్జాలో ఉన్నారో లేదో చూడాలి. ఇంతకు ముందు వేసిన రోడ్లకు ఇబ్బందులు పెట్టొద్దు అని ముఖ్యమంత్రి ఇప్పటికే చెప్పారు. సర్వే చేసి హద్దులు నిర్ణయిస్తే భవిష్యత్తు లో సమస్యలు రావు. కొత్తగా ఎవరు కబ్జాకు ప్రయత్నం చేయకుండా చూడాలని మంత్రి పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Rupee: రూపాయి గరిష్ట పతనంపై.. ఆర్బీఐ సంచలన నిర్ణయం..
-
KKR Vs MI: కేకేఆర్ బౌలర్ల ధాటికి ముంబై విలవిల.. కోల్కతా టార్గెట్ ఎంతంటే..
-
Off The Record : జీడీ నెల్లూరు ఎమ్మెల్యే థామస్ గురించి టీడీపీలో చర్చలు
-
Uttar Pradesh: జిమ్లలో హిందూ మహిళలే టార్గెట్.. నిందితులపై యోగి సర్కార్ ఉక్కుపాదం..
-
Story Board : రూపాయి పతనం సెంచరీకి చేరువౌతోందా..? ఇరాన్ యుద్ధమే కొంప ముంచుతోందా..?
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!