Home
Employees
Employees News
-
ఉద్యోగుల ఆందోళన బల ప్రదర్శన వంటిదే-సజ్జల
ఆంధ్రప్రదేశ్లో పీఆర్సీ వ్యవహారం రచ్చరచ్చగా మారిపోయింది.. ఆందోళనలో భాగంగా ఇవాళ ఛలో విజయవాడ నిర్వహించారు ఉద్యోగులు.. అయితే, ఉద్యోగుల ఆందోళనను ప్రభుత్వం తప్పుబడుతోంది.. ప్రభుత్వం ముందు నుంచి చర్చలకు సిద్ధం అని చెబుతూనే ఉన్నామన్నారు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి.. ఇటువంటి ఆందోళన వల్ల బహిరంగ ఘర్షణ వాతావరణం ఏర్పడుతుంది తప్ప ఉపయోగం ఉండదన్న ఆయన.. ఛలో విజయవాడ బల ప్రదర్శన చేయటం వంటిదే అని వ్యాఖ్యయానించారు.. కోవిడ్ పరిస్థితుల నుంచి పూర్తిగా కోలుకోలేదు.. ఉన్న పరిస్థితుల్లో… -
ఛలో విజయవాడ సక్సెస్.. జగన్ నియంతృత్వానికి చెంపపెట్టు..!
పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకున్నా.. నిర్బంధించినా.. ఛలో విజయవాడ విజయవంతం అయ్యిందని చెబుతున్నాయి ఉద్యోగ సంఘాలు.. ఇక, ఛలో విజయవాడపై స్పందించిన సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ.. కర్నూలులో మాట్లాడుతూ.. ఉద్యోగుల ఛలో విజయవాడ కార్యక్రమం సక్సెస్.. ఇది సీఎం జగన్ నియంతృత్వానికి చెంపపెట్టు అని వ్యాఖ్యానించారు.. ఉద్యోగులు కొత్తవి ఏమీ కోరడం లేదన్నారు.. పీఆర్సీ అమలు సమయంలో సీనియర్ ఐఏఎస్ అధికారితో చర్చలు జరపడం ఆనవాయితీ.. కానీ, పీఆర్సీ నివేదికను ఉద్యోగులకు సీఎం జగన్ ఎందుకు ఇవ్వడం… -
ఉద్యోగుల వెనుక చంద్రబాబు ఉన్నారు… అందుకే ఆ మాటలు..!
ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగుల ఉద్యమం ఉధృతం అవుతోంది.. ఇవాళ ఛలో విజయవాడ ఉద్రిక్తతలకు దారి తీసింది.. అయితే, ఉద్యోగుల వెనుక టీడీపీ అధినేత చంద్రబాబు ఉన్నారని.. అందుకే ఇలాంటి పరిస్థితులు సృష్టిస్తున్నారని ఆరోపించారు డిప్యూటీ సీఎం నారాయణ స్వామి.. ఉద్యోగులంతా మా కుటుంబ సభ్యులేనని స్పష్టం చేసిన ఆయన.. చర్చలతోనే ఉద్యోగుల సమస్య పరిష్కారమవుతుందన్నారు.. కానీ, ఉద్యోగుల వెనుక చంద్రబాబు ఉన్నారు.. ఉద్యోగుల వెనుక ఆయన ఉన్నారు కాబట్టే.. సంఘాల నేతలు ఈ స్థాయిలో ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారని… -
ఉద్యోగులకు శుభవార్త.. ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
ఉద్యోగులకు శుభవార్త చెప్పింది తెలంగాణ ప్రభుత్వం.. ఉద్యోగుల పరస్పర బదిలీలకు (mutual transfers) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.. దీనికి సంబంధించిన ఉత్తర్వులు జారీ చేసింది.. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం.. బదిలీ కోరుకునే ఉద్యోగులు మార్చి 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కల్పించింది సర్కార్.. ఇక, ఉద్యోగులు మ్యూచువల్ను వెతుక్కోవడానికి నెల రోజుల అవకాశం ఉంటుంది.. దీంతో, ఒక ప్రాంతంలో ఉద్యోగం చేయడం ఇష్టం లేని వారు.. మరో ప్రాంతంలో ఉద్యోగం… -
డిప్యూటీ సీఎంకు ఉపాధ్యాయుల కౌంటర్.. దాట వేసేందుకే ఈ నాటకాలు..!
ఉద్యోగులు, ఉపాధ్యాయులపై ఏపీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు ఉపాధ్యాయ సంఘాల నేతలు.. నారాయణస్వామి వ్యాఖ్యలపై స్పందించిన ఫాప్టో ఛైర్మన్ సుధీర్ బాబు.. మా ఉపాధ్యాయుల పిల్లల్లో 50 శాతం పిల్లలు ప్రభుత్వ స్కూళ్లల్లోనే చదువుతున్నారు.. మరి మంత్రి నారాయణ స్వామి పిల్లలు, మనవళ్లు ఎక్కడ చదివారు..? అంటూ నిలదీశారు.. మంత్రి నారాయణ స్వామి బాధ్యతారాహిత్యంగా మాట్లాడకూడదని హితవుపలికిన ఆయన.. పీఆర్సీ సమస్యను పరిష్కరించలేక దాట వేసేందుకే మంత్రులు ఈ నాటకాలు… -
ఉపాధ్యాయులపై డిప్యూటీ సీఎం సంచలన వ్యాఖ్యలు
ఉద్యోగులు, ఉపాధ్యాయులు.. ఇలా అన్ని రంగాల వారు సమ్మె బాట పడుతున్న సమయంలో.. ఉద్యోగులు, ఉపాధ్యాయులపై సంచలన వ్యాఖ్యలు చేశారు ఏపీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి… ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత ఉద్యోగులు సహకరించాలని సూచించిన ఆయన.. ఉపాధ్యాయ వృత్తి పవిత్రమైనది.. వారు ఇష్టారాజ్యంగా మాట్లాడితే ఎలా..? అని ప్రశ్నించారు.. సీఎం వైఎస్ జగన్ గురించి టీచర్లు వాడిన భాష సరైంది కాదని హితవుపలికిన ఆయన.. టీచర్లు వారి పిల్లలను ప్రభుత్వ స్కూళ్లల్లో చదివిస్తున్నారా..?… -
మరింత ముదిరిన పీఆర్సీ ఫైట్..తగ్గేదిలే అంటున్న ఉద్యోగులు
ఏపీలో పీఆర్సీ రగడ ఇప్పట్లో ఆగేలా లేదు. ప్రభుత్వం సమ్మెకి దిగే ఉద్యోగుల పట్ల కఠినంగా వ్యవహరించాలని చూస్తుంటే… ఉద్యోగులు మాత్రం తగ్గేది లేదంటున్నారు.కొత్త పీఆర్సీ ప్రకారం జీతాలు, పెన్షన్లు చెల్లించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. డీడీవోలు, ట్రెజరీ అధికారుల ద్వారా కొత్త జీతాల ప్రక్రియ చేపట్టింది. అయితే తమ ఉద్యమం ఆగదని, పాత జీతాలే ఇవ్వాలని ఉద్యోగులు పట్టుబడుతున్నారు. -
హైకోర్టుకు హాజరు కాని ఉద్యోగ సంఘాల నేతలు
ఏపీలో పీఆర్సీ అంశం రోజుకో మలుపు తీసుకుంటుంది. ఇవాళ కోర్టులో పీఆర్సీ పై వాదనలు విన్న కోర్టు పూర్తి ఆధారాలతో రావాలని సూచించింది. కాగా సమ్మె నోటీసిచ్చే ఉద్యోగ సంఘ నేతలను హాజరు కావాల్సిందిగా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయినా ఇప్పటి వరకు ఉద్యోగ సంఘాల నేతలేవ్వరూ కోర్టుకు హాజరు కాలేదు. ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం కార్యాలయంలో పీఆర్సీ సాధన సమితి భేటీ అయింది. హైకోర్టు ఆదేశాలతో సమ్మె నోటీసును ఏవిధంగా ఇవ్వాలనే దానిపై… -
ఉద్యోగులకు గుడ్న్యూస్.. ట్యాక్స్ ఫ్రీ పరిమితి రెట్టింపు..!
ఉద్యోగులకు గుడ్న్యూస్ చెప్పేందుకు సిద్ధం అవుతుంది కేంద్ర ప్రభుత్వం.. ఈ నెల పార్లమెంబ్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానుండగా… ఫిబ్రవరి 1వ తేదీన పార్లమెంట్లో 2022-23 వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్.. రెండు విడతలగా బడ్జెట్ సెషన్ జరగబోతోంది.. అయితే, పన్ను రహిత ప్రావిడెంట్ ఫండ్ పరిమితిని పెంచే సూచనలు కనిపిస్తున్నాయి.. దీనిపై బడ్జెట్ 2022-2023లో క్లారిటీ రాబోతోంది.. పీఎఫ్ ఖాతాల్లో ఒక ఆర్థిక సంవత్సరంలో ఇకపై రూ. 5 లక్షల వరకు జమ… -
భవిష్యత్ కార్యచరణను ప్రకటించిన ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ
విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణలో భాగంగా ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ మరో అడుగు ముందుకు వేసింది. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ ఆపాలంటూ కేంద్ర ప్రభుత్వాన్ని గత కొన్ని రోజులుగా కోరుతున్నారు. అయినా కేంద్రం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో ఉద్యోగులు ఆందోళన బాట పట్టిన సంగతి తెల్సిందే.. ఈ ఉద్యమానికి రాజకీయ పార్టీలు సైతం మద్దతునిస్తున్నాయి. ఇప్పటికే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పలు మార్లు ఉక్కు ప్రైవేటీకరణను ఆపాలంటూ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.…
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!