ప్రభుత్వ ఉద్యోగులు బాధ్యతారాహిత్యంగా మాట్లాడటం కరెక్ట్ కాదని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఉద్యోగుల ఆందోళనలపై స్పందించిన మంత్రి బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు. ఆందోళన చేస్తున్న ఉద్యోగులు కొంత మంది మాటలు బాధకరంగా ఉన్నాయన్నారు.
భాష అదుపులో ఉండాలి. సంయమనం లేకుండా ఉద్యోగులు మాట్లాడుతున్నారన్నారు. ఉద్యగులకు కావాల్సింది ఘర్షణా లేక సమస్యల పరిష్కారమా..? వారే నిర్ణయించుకోవాలన్నారు. బాధ్యత రహితంగా మాట్లాడుతున్న వారిని ఉద్యోగ సంఘాల నేతలు కట్టడి చేయాలన్నారు. చర్యకు ప్రతిచర్య ఉంటుందన్నారు. ఇలా మాట్లాడితే తీవ్ర పర్యవసానాలు చూడాల్సి వచ్చే పరిస్థితి వద్దని మంత్రి తెలిపారు.
Read Also: ఏపీలో అమాంతం పెరిగిన కోవిడ్ కేసులు..
ముఖ్యమంత్రి గారు తపన పడుతున్నారు… ఆర్థిక పరిస్థితి వల్ల చేయలేక పోతున్నారని మీరే చెప్పారుగా..? ఇప్పుడీ మాటలు ఏంటి?? ఉద్యోగులతో చర్చించిన తర్వాతే ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని బొత్స వెల్లడించారు. అధికారులు చెప్పిన లెక్కల్లో తేడాలు ఉన్నాయని అభ్యంతరాలు ఉంటే కాదని చెప్పాలన్నారు. ఉద్యోగస్తులు ఎవరి ప్రొవేకేషన్ లోకి వెళ్ళవద్దు అని కోరుతున్నానని బొత్స వ్యాఖ్యానించారు. సానుకూలంగా ఉండాలని కోరుకుంటున్నానని మంత్రి తెలిపారు. ప్రతిపక్షాలు రాజకీయం చేసి లబ్ధి పొందాలని చూస్తున్నాయన్నారు. ఉద్యోగులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే క్షమించేది లేదు. మంచి వాతావరణాన్ని పాడు చేయవద్దని బొత్స కోరారు.