రాజకీయ పార్టీలు ఇకపై తమ ఆడిట్రిపోర్ట్ లను భారత ఎన్నికల కమిషన్కు ఆన్లైన్లో సమర్పించవచ్చు. నేరుగా ఈసీఐ వెళ్లి సమర్పించాల్సిన అవసరం లేకుండా తమ ఆడిట్ రిపోర్టులను ఆన్లైన్లో సమర్పించడానికి అవకాశం కల్పించింది.
కర్ణాటకలో ఖాళీగా ఉన్న మూడు ఎమ్మెల్సీ స్థానాల్లో ఉప ఎన్నికలకు భారత ఎన్నికల సంఘం మంగళవారం షెడ్యూల్ విడుదల చేసింది. కర్ణాటక లెజిస్లేటివ్ కౌన్సిల్కు ఉప ఎన్నికలు జూన్ 30న జరుగుతాయని తెలిపింది.
Janasena: ఏపీలో జనసేన పార్టీకి కేంద్ర ఎన్నికల కమిషన్ ఝలక్ ఇచ్చింది. ఆ పార్టీ గుర్తు అయిన గాజు గ్లాసును ఫ్రీ సింబల్ జాబితాలో చేర్చింది. దేశవ్యాప్తంగా 26 రాష్ట్రాల్లో ఉన్న గుర్తింపు పొందిన రాష్ట్ర పార్టీల వివరాలను ఈసీ తాజాగా వెల్లడించింది.
ప్రధాని నరేంద్ర మోదీపై చేసిన వ్యాఖ్యలకు గాను కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే కుమారుడు ప్రియాంక్ ఖర్గేకు ఎన్నికల సంఘం షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఆయన వ్యాఖ్యలను ప్రాథమికంగా మోడల్ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినట్లు పేర్కొన్న ఎన్నికల సంఘం.. ఆయన వైపు నుంచి ఎటువంటి స్పందన లేకుంటే తగిన చర్యలు తీసుకుంటామని తెలిపింది.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు ఆసక్తి రేపుతున్నాయి. ఇప్పటికే నామినేషన్ల పర్వం ముగిసింది. అభ్యర్థులు పోటాపోటిగా ప్రచారం చేస్తున్నారు. ఇక, ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్న పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ నామినేషన్ను ఈసీ ఆమోదించింది.
ఈ ఏడాది రాజస్థాన్ రాష్ట్ర అసెంబ్లీ జరగనున్నాయి. ప్రధాన పార్టీ ఇప్పటినుంచే ఎన్నికలపై దృష్టి సారించాయి. కేంద్ర ఎన్నికల సంఘం రాజస్థాన్ ఎన్నికల కోసం సిద్ధమవుతోంది. త్వరలో నోటిఫికేషన్ జారీ చేయనుంది. ఈసారి రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు ఎం-3 ఈవీఎంలతో జరగనున్నాయి.
తమిళనాడులోని అఖిల భారత అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం (AIADMK) కార్యదర్శి పదవికి సంబంధించిన కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి కె పళనిస్వామిని ప్రధాన కార్యదర్శిగా ఎలక్షన్ కమిషన్ అంగీకరించింది. ఈ విషయంలో ఇప్పటికే మద్రాస్ హైకోర్టు సైతం తీర్పు వెలువరించింది.
ఎన్నికలు ఎప్పుడు వచ్చినా మద్యం, డబ్బు భారీగా పట్టుబడుతోంది. ఎన్నికల్లో ధన ప్రవాహం అడ్డూ అదుపులేకుండా సాగుతోంది. ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు పార్టీలు డబ్బును వెదజల్లుతున్నాయి. భారీగా మద్యం సరఫరా చేస్తున్నాయి.