EC: అక్టోబర్ 3 నుంచి తెలంగాణలో పర్యటించనున్న భారత ఎన్నికల సంఘం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) ఉన్నతాధికారుల బృందం అక్టోబర్ 3 నుంచి తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేకంగా సందర్శించనుందని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వికాస్ రాజ్ పేర్కొన్నారు. మూడు రోజుల పాటు జరిపే ఈ పర్యటనలో ఈ బృందం రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణ సంసిద్ధతను సమీక్షించడంతో పాటూ వివిధ భాగస్వామ్య పక్షాలను, స్థానిక అధికారులను సంప్రదిస్తుంది అని ఆయన తెలిపారు.
Read Also: Sanya Malhotra : క్లివేజ్ అందాలతో రెచ్చగొడుతున్న బాలీవుడ్ బ్యూటీ..
Also Read
- Denmark: డెన్మార్క్లో అజాన్పై బ్యాన్.. ఇస్లామీకీకరణపై ఆందోళన..
- Ketan Agarwal Case: కేతన్ను లోయలోకి తోసేముందు చేతన్ ఏమన్నాడో తెలుసా.. వెలుగులోకి కొత్త విషయాలు
- Ketan Agarwal Case: కేతన్-సియా కేసులో కొత్త ట్విస్ట్.. బ్లాక్మెయిల్ కోణంలో దర్యాప్తు..
- IAS Krishna Teja: పంచాయతీ నిధుల గోల్మాల్.. వైరల్గా మారిన కమిషనర్ కృష్ణతేజ వార్నింగ్..
మొదటి రోజున.. జాతీయ, రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలతో కీలక సమావేశాన్ని నిర్వహించడం ద్వారా కేంద్ర ఎన్నికల సంఘం తన పర్యటనకు శ్రీకారం చుడుతుంది.. త్వరలో జరగనున్న ఎన్నికలకు సంబంధించిన ముఖ్యమైన అంశాలపై ఎన్నికల నిర్వహణ అధికారులు, సంస్థలతో ఈసీఐ సమావేశం అవుతుందని వికాస్ రాజ్ అన్నారు. ఇక, రెండవ రోజున.. ఎన్నికల నిర్వహణకు సంబంధించి క్షేత్రస్థాయిలో సంసిద్ధతను సమీక్షించడంపై ఎక్కువగా దృష్టి కేంద్రీకరిస్తుంది అని సీఈఓ వికాస్ రాజ్ అన్నారు. తెలంగాణలోని 33 జిల్లాల ఎన్నికల అధికారులు (డీఈఓలు), పోలీసు సూపరింటెండెంట్ (ఎస్పీలు), పోలీస్ కమీషనర్లు (సీపీలు).. ఈ బృందానికి వారి వారి సన్నద్ధత నివేదికలను సవివరంగా సమర్పిస్తారు అంటూ ఆయన తెలిపారు.
Read Also: Niharika Konidela: ఆ ఒక్క పోస్టుతో అలాంటి వాళ్ళ నోళ్ళు మూయించిన నిహారిక
చివరి రోజయిన మూడవ రోజున ఓటర్లను క్రమపద్ధతిలో ఎలా చైతన్య పరుస్తున్నదీ.. ఎన్నికల్లో ఓటర్లు పాల్గొనడానికి సంబంధించిన (ఎస్వీవీఈపీ) కార్యకలాపాలపై ఒక ప్రదర్శన చేస్తారని మీడియా సమావేశంలో సీఈఓ వికాస్ రాజ్ తెలిపారు. ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగమైన ఎన్నికల్లో పాల్గొనడంపై ప్రజలను చైతన్య పరచడానికి రాష్ట్ర స్థాయిలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్న ప్రముఖులను, దివ్యాంగ ఓటర్లను, యువ ఓటర్లను కేంద్ర ఎన్నికల బృందం నేరుగా కలుస్తుంది.. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డైరక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) లతో కూడా ఈ టీమ్ ప్రత్యేకంగా సమావేశమై రాష్ట్ర ఎన్నికల అధికార యంత్రాంగాన్ని, భద్రతా సంస్థలను సమన్వయ పరచడంలో వారు చేస్తున్న కృషిని పరిశీలిస్తుంది అని వికాస్ రాజ్ చెప్పారు. ఈసీఐ రాష్ట్ర పర్యటనలో చివరగా.. పత్రికా విలేకరుల సమావేశాన్ని నిర్వహిస్తుందని చెప్పుకొచ్చారు.
Read Also:
తాజావార్తలు
-
Denmark: డెన్మార్క్లో అజాన్పై బ్యాన్.. ఇస్లామీకీకరణపై ఆందోళన..
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
YouTube vs Instagram: డబ్బు సంపాదించాలంటే ఇన్స్టా బెస్ట్ ఆ? యూట్యూబ్ బెస్ట్ ఆ? ఈ లెక్కలు చూస్తే షాకవుతారు!
-
Ketan Agarwal Case: కేతన్ను లోయలోకి తోసేముందు చేతన్ ఏమన్నాడో తెలుసా.. వెలుగులోకి కొత్త విషయాలు
-
Ketan Agarwal Case: కేతన్-సియా కేసులో కొత్త ట్విస్ట్.. బ్లాక్మెయిల్ కోణంలో దర్యాప్తు..
ట్రెండింగ్
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
-
Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉండే రుచికరమైన స్నాక్ “పెసర గారెలు” చేసేయండి ఇలా.!