EC: అక్టోబర్ 3 నుంచి తెలంగాణలో పర్యటించనున్న భారత ఎన్నికల సంఘం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) ఉన్నతాధికారుల బృందం అక్టోబర్ 3 నుంచి తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేకంగా సందర్శించనుందని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వికాస్ రాజ్ పేర్కొన్నారు. మూడు రోజుల పాటు జరిపే ఈ పర్యటనలో ఈ బృందం రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణ సంసిద్ధతను సమీక్షించడంతో పాటూ వివిధ భాగస్వామ్య పక్షాలను, స్థానిక అధికారులను సంప్రదిస్తుంది అని ఆయన తెలిపారు.
Read Also: Sanya Malhotra : క్లివేజ్ అందాలతో రెచ్చగొడుతున్న బాలీవుడ్ బ్యూటీ..
Also Read
- New Oppo: టెక్ లవర్స్ను తెగ ఆకట్టుకుంటున్న ఒప్పో కొత్త లుక్.. ఈ ఫీచర్లు తెలిస్తే వెంటనే అప్డేట్ చేస్తారు..
- TSLPRB: తెలంగాణ పోలీస్ ఉద్యోగాల ప్రిలిమినరీ పరీక్షల తేదీలు ఖరారు.. కానిస్టేబుల్, ఎస్సై పరీక్షలు ఎప్పుడంటే..
- Samsung Phones: పర్సుకి ఫోన్కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
- Supreme Court: 6వ తరగతిలో త్రిభాషా విధానంపై సుప్రీం కోర్టు కీలక సూచన
మొదటి రోజున.. జాతీయ, రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలతో కీలక సమావేశాన్ని నిర్వహించడం ద్వారా కేంద్ర ఎన్నికల సంఘం తన పర్యటనకు శ్రీకారం చుడుతుంది.. త్వరలో జరగనున్న ఎన్నికలకు సంబంధించిన ముఖ్యమైన అంశాలపై ఎన్నికల నిర్వహణ అధికారులు, సంస్థలతో ఈసీఐ సమావేశం అవుతుందని వికాస్ రాజ్ అన్నారు. ఇక, రెండవ రోజున.. ఎన్నికల నిర్వహణకు సంబంధించి క్షేత్రస్థాయిలో సంసిద్ధతను సమీక్షించడంపై ఎక్కువగా దృష్టి కేంద్రీకరిస్తుంది అని సీఈఓ వికాస్ రాజ్ అన్నారు. తెలంగాణలోని 33 జిల్లాల ఎన్నికల అధికారులు (డీఈఓలు), పోలీసు సూపరింటెండెంట్ (ఎస్పీలు), పోలీస్ కమీషనర్లు (సీపీలు).. ఈ బృందానికి వారి వారి సన్నద్ధత నివేదికలను సవివరంగా సమర్పిస్తారు అంటూ ఆయన తెలిపారు.
Read Also: Niharika Konidela: ఆ ఒక్క పోస్టుతో అలాంటి వాళ్ళ నోళ్ళు మూయించిన నిహారిక
చివరి రోజయిన మూడవ రోజున ఓటర్లను క్రమపద్ధతిలో ఎలా చైతన్య పరుస్తున్నదీ.. ఎన్నికల్లో ఓటర్లు పాల్గొనడానికి సంబంధించిన (ఎస్వీవీఈపీ) కార్యకలాపాలపై ఒక ప్రదర్శన చేస్తారని మీడియా సమావేశంలో సీఈఓ వికాస్ రాజ్ తెలిపారు. ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగమైన ఎన్నికల్లో పాల్గొనడంపై ప్రజలను చైతన్య పరచడానికి రాష్ట్ర స్థాయిలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్న ప్రముఖులను, దివ్యాంగ ఓటర్లను, యువ ఓటర్లను కేంద్ర ఎన్నికల బృందం నేరుగా కలుస్తుంది.. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డైరక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) లతో కూడా ఈ టీమ్ ప్రత్యేకంగా సమావేశమై రాష్ట్ర ఎన్నికల అధికార యంత్రాంగాన్ని, భద్రతా సంస్థలను సమన్వయ పరచడంలో వారు చేస్తున్న కృషిని పరిశీలిస్తుంది అని వికాస్ రాజ్ చెప్పారు. ఈసీఐ రాష్ట్ర పర్యటనలో చివరగా.. పత్రికా విలేకరుల సమావేశాన్ని నిర్వహిస్తుందని చెప్పుకొచ్చారు.
Read Also:
తాజావార్తలు
-
New Oppo: టెక్ లవర్స్ను తెగ ఆకట్టుకుంటున్న ఒప్పో కొత్త లుక్.. ఈ ఫీచర్లు తెలిస్తే వెంటనే అప్డేట్ చేస్తారు..
-
TSLPRB: తెలంగాణ పోలీస్ ఉద్యోగాల ప్రిలిమినరీ పరీక్షల తేదీలు ఖరారు.. కానిస్టేబుల్, ఎస్సై పరీక్షలు ఎప్పుడంటే..
-
Samsung Phones: పర్సుకి ఫోన్కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Supreme Court: 6వ తరగతిలో త్రిభాషా విధానంపై సుప్రీం కోర్టు కీలక సూచన
-
Accident: కాకినాడ జిల్లాలో రోడ్డు ప్రమాదం.. 30 మంది బంధువులు పెళ్లి వేడుక ముగించుకుని వెళ్తుండగా ఇలా..
ట్రెండింగ్
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!