EC: అక్టోబర్ 3 నుంచి తెలంగాణలో పర్యటించనున్న భారత ఎన్నికల సంఘం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) ఉన్నతాధికారుల బృందం అక్టోబర్ 3 నుంచి తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేకంగా సందర్శించనుందని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వికాస్ రాజ్ పేర్కొన్నారు. మూడు రోజుల పాటు జరిపే ఈ పర్యటనలో ఈ బృందం రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణ సంసిద్ధతను సమీక్షించడంతో పాటూ వివిధ భాగస్వామ్య పక్షాలను, స్థానిక అధికారులను సంప్రదిస్తుంది అని ఆయన తెలిపారు.
Read Also: Sanya Malhotra : క్లివేజ్ అందాలతో రెచ్చగొడుతున్న బాలీవుడ్ బ్యూటీ..
Also Read
- PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
- PM Modi: నెదర్లాండ్స్ రాజు, రాణితో మోడీ భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై కీలక చర్చలు
- Maharashtra: తుపాకీ గురిపెట్టినా భయపడలేదు.. దొంగలతో వీరోచితంగా పోరాడిన సిబ్బంది.. వీడియో వైరల్
- Bandi Bhagirath : పోలీసుల ఎదుట లొంగిపోయిన బండి భగీరథ్.!
మొదటి రోజున.. జాతీయ, రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలతో కీలక సమావేశాన్ని నిర్వహించడం ద్వారా కేంద్ర ఎన్నికల సంఘం తన పర్యటనకు శ్రీకారం చుడుతుంది.. త్వరలో జరగనున్న ఎన్నికలకు సంబంధించిన ముఖ్యమైన అంశాలపై ఎన్నికల నిర్వహణ అధికారులు, సంస్థలతో ఈసీఐ సమావేశం అవుతుందని వికాస్ రాజ్ అన్నారు. ఇక, రెండవ రోజున.. ఎన్నికల నిర్వహణకు సంబంధించి క్షేత్రస్థాయిలో సంసిద్ధతను సమీక్షించడంపై ఎక్కువగా దృష్టి కేంద్రీకరిస్తుంది అని సీఈఓ వికాస్ రాజ్ అన్నారు. తెలంగాణలోని 33 జిల్లాల ఎన్నికల అధికారులు (డీఈఓలు), పోలీసు సూపరింటెండెంట్ (ఎస్పీలు), పోలీస్ కమీషనర్లు (సీపీలు).. ఈ బృందానికి వారి వారి సన్నద్ధత నివేదికలను సవివరంగా సమర్పిస్తారు అంటూ ఆయన తెలిపారు.
Read Also: Niharika Konidela: ఆ ఒక్క పోస్టుతో అలాంటి వాళ్ళ నోళ్ళు మూయించిన నిహారిక
చివరి రోజయిన మూడవ రోజున ఓటర్లను క్రమపద్ధతిలో ఎలా చైతన్య పరుస్తున్నదీ.. ఎన్నికల్లో ఓటర్లు పాల్గొనడానికి సంబంధించిన (ఎస్వీవీఈపీ) కార్యకలాపాలపై ఒక ప్రదర్శన చేస్తారని మీడియా సమావేశంలో సీఈఓ వికాస్ రాజ్ తెలిపారు. ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగమైన ఎన్నికల్లో పాల్గొనడంపై ప్రజలను చైతన్య పరచడానికి రాష్ట్ర స్థాయిలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్న ప్రముఖులను, దివ్యాంగ ఓటర్లను, యువ ఓటర్లను కేంద్ర ఎన్నికల బృందం నేరుగా కలుస్తుంది.. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డైరక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) లతో కూడా ఈ టీమ్ ప్రత్యేకంగా సమావేశమై రాష్ట్ర ఎన్నికల అధికార యంత్రాంగాన్ని, భద్రతా సంస్థలను సమన్వయ పరచడంలో వారు చేస్తున్న కృషిని పరిశీలిస్తుంది అని వికాస్ రాజ్ చెప్పారు. ఈసీఐ రాష్ట్ర పర్యటనలో చివరగా.. పత్రికా విలేకరుల సమావేశాన్ని నిర్వహిస్తుందని చెప్పుకొచ్చారు.
Read Also:
తాజావార్తలు
-
Off The Record : రాంగ్ సిగ్నల్స్ రాకుండా జై ఆంధ్ర లైన్ తీసుకున్నారా?
-
Story Board : మహా సంక్షోభం ఎవరి చేతుల్లో లేదా? ప్రజలు జాగ్రత్తలు పాటించాల్సిందేనా?
-
PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
-
Off The Record : మొక్కుబడి తంతుగా ట్రైనింగ్ క్యాంపెయిన్
-
Peddi Suspense : రామ్ చరణ్ పెద్దికి లైన్ క్లియర్ అవ్వలేదా?
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..