Parliament Of CJI: సీజేఐ లేకుండానే ఎన్నికల సంఘం నియామకం.. బిల్లుకు రెడీ అయిన కేంద్రం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Parliament Of CJI: కేంద్రం ఎన్నికల సంఘం నియామకంలో సుప్రీంకోర్టు ప్రధనా న్యాయమూర్తి(సీజేఐ) పాత్ర లేకుండా చేయడానికి కేంద్రం పావులు కదుపుతున్నట్టు తెలుస్తోంది. ఇకపై కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్(సీఈసీ)తోపాటు ఎన్నికల కమిషనర్ల నియామకం ప్యానల్ నుంచి సీజేఐని తొలగించి .. ఆయన స్థానంలో కేంద్ర కేబినెట్ మంత్రిని సభ్యుడిగా చేర్చాలని కేంద్రం భావిస్తున్నట్టు సమాచారం. ఇందుకు సంబంధించి కొత్త చట్టాన్ని రూపొందించడం కోసం పార్లమెంటలో ప్రతిపాదిత బిల్లుకు కేంద్రం సిద్ధమైనట్టు సమాచారం. ఆ బిల్లు కాస్త గురువారమే రాజ్యసభలో ప్రవేశ పెట్టే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇదే గనుక జరిగితే ఇకపై సీఈసీతోపాటు ఎన్నికల కమిషనర్ల నియామకంలో సీజేఐ లేకుండానే నియామకాలు జరిగిపోతాయి.
Read also: Suicide Attempt: కాకినాడ బీచ్ వద్ద విషాదం.. ప్రేమజంట ఆత్మహత్యాయత్నం
Also Read
- Ketan Agarwal Case: కేతన్ను లోయలోకి తోసేముందు చేతన్ ఏమన్నాడో తెలుసా.. వెలుగులోకి కొత్త విషయాలు
- Ketan Agarwal Case: కేతన్-సియా కేసులో కొత్త ట్విస్ట్.. బ్లాక్మెయిల్ కోణంలో దర్యాప్తు..
- Woman Constable: ఇదేం పద్దతి మేడం.. ఫిర్యాదు కోసం వచ్చిన వృద్ధుడి ఎదుట.. టేబుల్పై కాళ్లు పెట్టిన మహిళా కానిస్టేబుల్
- Ayodhya: అయోధ్య రామాలయ విరాళాల కుంభకోణంలో కీలక పరిణామం.. ట్రస్ట్ కీలక సభ్యులు రాజీనామా..
ఈ ఏడాది మార్చిలో ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం ఎన్నికల కమిషనర్ల నియామకంలో ప్రధాని, ప్రతిపక్ష నేత, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పాల్గొనాలని తీర్పునిచ్చింది. జస్టిస్ కేఎం జోసెఫ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం వెలువరించిన తీర్పులో.. ఎన్నికల కమిషనర్ల ఎంపిక ప్రక్రియపై పార్లమెంటు చట్టం రూపొందించే వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుందని తీర్పులో పేర్కొంది. ప్రధాన మంత్రి, ప్రతిపక్ష నేత, భారత ప్రధాన న్యాయమూర్తితో కూడిన ప్యానెల్ సలహాల ఆధారంగా ప్రధాన ఎన్నికల కమిషనర్, ఎన్నికల కమిషనర్ల నియామకాన్ని రాష్ట్రపతి చేపట్టాలని రాజ్యాంగ ధర్మాసనం వెలువరించిన తీర్పును తాజా బిల్లు బలహీనపర్చనుందని కాంగ్రెస్ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ప్రధాన ఎన్నికల కమిషనర్, ఇతర ఎన్నికల కమిషనర్ల (నియామకం, సర్వీసు నిబంధనలు, పదవీకాలం) బిల్లు-2023ను కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ఈ రోజు రాజ్యసభలో ప్రవేశపెట్టడానికి లిస్ట్ చేసినట్టు తెలిసింది. బీజేపీ నేతృత్వంలోని కేంద్రం కొత్త బిల్లును తీసుకురావడాన్ని కాంగ్రెస్ వ్యతిరేకిస్తుంది. కేంద్రం ముఖ్యమైన సంస్థలను నియంత్రించడానికి మరొక ప్రయత్నం చేస్తోందని కాంగ్రెస్ విమర్శించింది. ‘‘ప్రధాన ఎన్నికల కమిషనర్ని సిఫార్సు చేయడానికి ప్రధానమంత్రి సెలక్షన్ కమిటీ సభ్యునిగా సీజేఐ స్థానంలో ఒక కేంద్ర కేబినెట్ మంత్రిని నియమిస్తారు. ప్రతిపక్ష నాయకుడు కూడా సభ్యుడిగా ఉన్నప్పటికీ.. మెజారిటీ అధికార పార్టీకే ఉంటుంది. స్వతంత్రంగా ఉండాల్సిన సంస్థను నియంత్రించడానికి ఇది మరొక మార్గని కాంగ్రెస్ ఎంపీ సుస్మితా దేవ్ విమర్శించారు.
తాజావార్తలు
-
Ketan Agarwal Case: కేతన్ను లోయలోకి తోసేముందు చేతన్ ఏమన్నాడో తెలుసా.. వెలుగులోకి కొత్త విషయాలు
-
Ketan Agarwal Case: కేతన్-సియా కేసులో కొత్త ట్విస్ట్.. బ్లాక్మెయిల్ కోణంలో దర్యాప్తు..
-
IAS Krishna Teja: పంచాయతీ నిధుల గోల్మాల్.. వైరల్గా మారిన కమిషనర్ కృష్ణతేజ వార్నింగ్..
-
Sanjay Jaju : తెలంగాణ నూతన సీఎస్ గా సంజయ్ జాజు నియామకం
-
Varanasi Update: ‘వారణాసి’ నుంచి బిగ్ అప్డేట్.. ఈ సెప్టెంబర్ నాటికే..!
ట్రెండింగ్
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
-
Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉండే రుచికరమైన స్నాక్ “పెసర గారెలు” చేసేయండి ఇలా.!