స్థానిక ఎన్నికల సమయంలో మహారాష్ట్ర కూటమి ప్రభుత్వంలో అంతర్గత విభేదాలు తారాస్థాయికి చేరినట్లుగా తెలుస్తోంది. శివసేనకు చెందిన మంత్రి వ్యాఖ్యలతో రెండు పార్టీల మధ్య వార్ మొదలైనట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.
Eknath Shinde: 26/11 ముంబై ఉగ్ర దాడుల తర్వాత, అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం పాకిస్తాన్పై చర్యలు తీసుకోకపోవడం ‘‘ద్రోహం’’ అని శివసేన చీఫ్ ఏక్నాథ్ షిండే అన్నారు. ఎవరి ఒత్తిడితో కాంగ్రెస్ పాకిస్తాన్పై దాడికి సిద్ధ పడలేదని ప్రశ్నించారు. శివసేన వార్షిక దసరా ర్యాలీలో పాల్గొన్న ఆయన కాంగ్రెస్, ఉద్ధవ్ ఠాక్రే, రాహుల్ గాంధీపై విరుచుకుపడ్డారు. ఉద్ధవ్ ఠాక్రే తన సొంత పార్టీ అనుచరులకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారని ఆరోపించారు.
కునాల్ కమ్రా.. స్టాండప్ కమెడియన్. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండేపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి పాపులర్ అయ్యారు. ఇక ఆయనపై మహారాష్ట్రలో పలు కేసులు నమోదయ్యాయి.
Shiv Sena MLA: ముంబైలో హాస్టల్ క్యాంటీన్లో నాసిరకం భోజనం పెట్టారని శివసేన (షిండే) ఎమ్మెల్యే సంజయ్ గైక్వాడ్ క్యాంటిన్ సిబ్బందిపై దాడి చేయడం తీవ్ర కలకలం రేపింది. ఈ వివాదం సద్దుమణగక ముందే ఇవాళ (గురువారం) దక్షిణ భారతీయులను లక్ష్యంగా చేసుకుని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారాయన.
Eknath Shinde: పహల్గామ్ ఉగ్రదాడికి ప్రధాని నరేంద్రమోడీ తప్పకుండా ప్రతీకారం తీర్చుకుంటారని మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండే అన్నారు. ఇండియా ఉగ్రవాదాన్ని ఎదుర్కొనేందుకు బలమైన దౌత్య నిర్ణయాలు తీసుకుంది. దేశ ప్రజలు ప్రస్తుతం సైనిక ప్రతిస్పందన ఆశిస్తున్నారు. "ఇది చివరి దాడి అవుతుందని మన ప్రజలు నమ్ముతున్నారు. ప్రధాని మోడీ పాకిస్తాన్ను తుడిచిపెడతారు" అని షిండే చెప్పారు.
Shiv Sena MP: శివసేన ఎంపీ మానే చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. తన పార్టీ అధినేత, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండేని పొగుడుతూ ఆయన ‘‘ప్రజల సీఎం’’ అని అన్నారు. ఏక్ నాథ్ షిండే రికార్డుల్లో ఉపముఖ్యమంత్రి కావచ్చు, కానీ ఆయన ప్రజల ముఖ్యమంత్రి అని శివసేన ఎంపీ ధైర్యశీల్ మానే శనివారం అన్నారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కూటమి అఖండ విజయం సాధించిన తర్వాత, సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ పదవీ చేపట్టిని…
స్టాండప్ కమెడియన్ కునాల్ కమ్రా కేసు ముదురుతున్నట్లుగా కనిపిస్తోంది. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండేను ఉద్దేశించి కునాల్ కమ్రా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. శివసేనను చీల్చిన ‘ద్రోహి’ అంటూ సంబోధించారు. ఈ వ్యాఖ్యలే కునాల్ కుమ్రాను ఇరకాటంలో పడేశాయి. ఆయనపై మహారాష్ట్రలోని పలు స్టేషన్లలో శివసేన కార్యకర్తలు ఫిర్యాదు చేశారు. ఇక కునాల్పై నమోదైన కేసుల్లో భాగంగా ఆయనకు ముంబై పోలీసులు సమన్లు జారీ చేశారు.
స్టాండప్ కమెడియన్ కునాల్ కమ్రా మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈసారి ముంబై పోలీసులపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. సోమవారం ముంబైలోని కునాల్ కమ్రా తల్లిదండ్రుల నివాసానికి పోలీసులు వెళ్లారు. ఈ సందర్భాన్ని ఉద్దేశించి కుమాల్ కమ్రా కీలక వ్యాఖ్యలు చేశారు. గత 10 ఏళ్లుగా నివసించని చిరునామాకు వెళ్లి మీ సమయం వృధా చేసుకోవద్దు.. అలాగే ప్రజా ధనాన్ని వృధా చేయొద్దని ‘ఎక్స్’ ట్విట్టర్లో సెటైర్లు వేశారు.
స్టాండప్ కమెడియన్ కునాల్ కమ్రాకు రాజకీయ వ్యూహకర్త, జన్ సూరజ్ పార్టీ చీఫ్ ప్రశాంత్ కిషోర్ మద్దతు తెలిపారు. కునాల్ కమ్రా తన స్నేహితుడని.. తనకు తెలిసినంతవరకు కునాల్ రాజకీయాలు చేయడన్నారు. అతనికి అలాంటి ఉద్దేశాలు లేవని చెప్పారు. బహుశా కునాల్ మాటలను తప్పుగా అర్థం చేసుకున్నారని చెప్పారు.