Home
Eknath Shinde
Eknath Shinde News
-
Maharashtra: షిండే-పవార్ భేటీ.. సుప్రియా సూలే కీలక వ్యాఖ్యలు..
Maharashtra: మహారాష్ట్ర రాజకీయాల్లో శివసేన అధినేత, డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండే, ఎన్సీపీ(ఎస్పీ) చీఫ్ శరద్ పవార్ భేటీ సంచలనంగా మారింది. ఈ భేటీపై ఎంపీ, పవార్ కుమార్తె సుప్రియా సూలే స్పందించారు. ఈ భేటీపై జరుగుతున్న చర్చల్ని ‘‘టీకప్పులో తుఫాను’’గా అభివర్ణించారు. ఈ భేటీకి ఇంత ప్రచారం అవసరం లేదని చెప్పారు. ఇది మర్యాదపూర్వకంగా జరిగిన చిన్న సమావేశమని, దీనికి రాజకీయ రంగు పులమాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ఇదే సమయంలో కొందరు శరద్… -
Maharashtra: ఉద్ధవ్ ఠాక్రేకు భారీ షాక్.. షిండే గూటికి చేరిన ఆరుగురు ఎంపీలు
మహారాష్ట్ర రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన (యూబీటీ)కి చెందిన ఆరుగురు లోక్సభ సభ్యులు సోమవారం ఉప ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేనలో అధికారికంగా చేరారు. దీంతో ఉద్ధవ్ ఠాక్రే వర్గానికి గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లైంది. -
Uddhav Shiv Sena: ఉద్ధవ్పై కోపం లేదు, నిధుల కోసమే తిరుగుబాటు: రెబల్ ఎంపీ..
Uddhav Shiv Sena: ఉద్ధవ్ థాకరే నేతృత్వంలోని శివసేన (యూబీటీ)కి చెందిన ఆరుగురు ఎంపీలు కూడా షిండే శివసేనలో చేరడంపై స్పష్టత వచ్చింది. తిరుగుబాటు చేసిన ఉద్ధవ్ వర్గం ఎంపీలు త్వరలో ఏక్నాథ్ షిండే శివసేనలో చేరబోతున్నారు. ఈ విషయాన్ని రెబల్ ఎంపీ నాగేష్ పాటిల్ అష్టికర్ వెల్లడించారు. తన లోక్సభ నియోజకవర్గ అభివృద్ధి నిధుల కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పుకొచ్చారు. ప్రతిపక్ష పార్టీలో ఉండటం వల్ల నియోజకవర్గంలో డెవలప్మెంట్ పనులకు నిధుల కొరత ఏర్పడిందని,… -
Uddhav Shiv sena: ముగింపుకు ఉద్ధవ్ సేన సంక్షోభం.. మీడియా ముందుకు తిరుగుబాటు ఎంపీలు..
Uddhav Shiv sena: మహారాష్ట్ర రాజకీయాల్లో ఈ రోజు కీలకంగా మారబోతోంది. ఉద్ధవ్ ఠాక్రేకు చెందిన శివసేన(యూబీటీ) సంక్షోభం చివరకు చేరింది. ఉద్ధవ్ పార్టీపై తిరుగుబాటు చేసిన ఆరుగురు ఎంపీలు ఆదివారం మీడియా ముందు రాబోతున్నారు. తామెందుకు తిరుగుబాటు చేశామనే వివరాలను మీడియా ముందు వెళ్లడించనున్నారు. ఠాక్రేలు తమ సిద్ధాంతాలకు విరుద్ధంగా ప్రవర్తించడంతో తాము తమ దారి చూసుకోవాల్సి వచ్చిందని ఇప్పటికే ఎంపీలు చెబుతున్నారు. తిరుగుబాటు ఎంపీలు ఆదివారం సంయుక్త విలేకరుల సమావేశం నిర్వహించి, లోక్సభ స్పీకర్… -
60 Years of Shiv Sena: 60 ఏళ్లలో 6 ముక్కలైన శివసేన.. ఆవిరైన బాలాసాహెబ్ ఆశయాలు?
Shiv Sena 60 Years: హిందూహృదయ్ సామ్రాట్ బాల్ ఠాక్రే స్థాపించిన ‘శివసేన’ నేటితో సరిగ్గా 60 వసంతాలు పూర్తి చేసుకుని వజ్రోత్సవ వేడుకలకు చేరుకుంది. 1966 జూన్ 19న ముంబైలోని చారిత్రాత్మక శివాజీ పార్క్లో బాల్ ఠాక్రే కొబ్బరికాయ కొట్టి ఈ పార్టీని ప్రారంభించారు. నాడు కొద్దిమంది మద్దతుదారులు, వేలాది మంది ‘మరాఠీ మానుస్’ సాక్షిగా పురుడుపోసుకున్న ఈ ప్రాంతీయ మహావృక్షం.. సరిగ్గా ఆరు దశాబ్దాల తర్వాత నేడు రెండు ముక్కలుగా చీలిపోయింది. విచిత్రమేమిటంటే.. బాల్… -
Sanjay Raut: తప్పంతా సుప్రీంకోర్టుదే.. ఎంపీల తిరుగుబాటుపై సంజయ్ రౌత్..
Sanjay Raut: ఉద్ధవ్ ఠాక్రే శివసేన(యూబీటీ)లో మరోసారి తిరుగుబాటు చెలరేగింది. 9 మంది ఎంపీల్లో ఆరుగురు ఎంపీలు ఏక్నాథ్ షిండే శివసేనలో చేరేందుకు సిద్ధమయ్యారు. ఈ పరిణామాలతో ఉద్ధవ్ సన్నిహితుడు, రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్ తీవ్ర అసహనం, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మీడియా సమక్షంలోనే తిరుగుబాటు ఎంపీలపై బూతుల వర్షం కురిపిస్తున్నారు. తాజాగా గురువారం కూడా సంజయ్ రౌత్ మరోసారి ఎంపీలపై దూషణలకు దిగారు. అంతటితో ఆగకుండా ఈ వ్యవహారాన్ని సుప్రీంకోర్టుకు ముడిపెట్టారు. న్యూఢిల్లీలో మీడియాతో… -
Uddhav Thackeray: కాంగ్రెస్లో కలుపుతారనే భయం.. ఉద్ధవ్ ఎంపీల తిరుగుబాటు వెనక అసలు స్టోరీ..
Uddhav Thackeray: ఉద్ధవ్ ఠాక్రే పార్టీ మరోసారి చీలిపోయింది. శివసేన(యూబీటీ) ఎంపీలు తిరుగుబాటు చేశారు. ఉద్ధవ్ సేనకు 9 మంది ఎంపీలు ఉంటే, వీరిలో ఆరుగురు రెబల్ వర్గంగా విడిపోయారు. చడిచప్పుడు కాకుండా అర్ధరాత్రి ఢిల్లీకి చేరుకోవడం, మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండేతో రహస్య భేటీ, లోక్సభ స్పీకర్కు లేఖ ఇవ్వడం ఇలా అన్ని ప్రణాళికాబద్ధంగా సాగాయి. శివసేన యూబీటీ ఎంపీలు తిరుగుబాటు ఎవరికీ తెలియకుండా చాలా జాగ్రత్తగా వ్యవహరించారు. పక్కా ప్లాన్తో ఢిల్లీకి.. తిరుగుబాటు చేసిన… -
Sanhay Raut: ఒక్కో ఎంపీని రూ. 50 కోట్లతో కొన్నారు.. సంజయ్ రౌత్ సంచలన ఆరోపణలు..
Sanhay Raut: ఉద్ధవ్ ఠాక్రేకు చెందిన శివసేన (యూబీటీ) మరోసారి చీలిక వర్గంగా మారింది. ఆ పార్టీకి 9 మంది ఎంపీలు ఉంటే ఆరుగురు ఎంపీలు తిరుగుబాటు చేయడం దేశ రాజకీయాల్లో సంచలనంగా మారింది. తిరుగుబాటు చేసిన ఎంపీలు ఢిల్లీకి వెళ్లారు. వీరంతా స్పీకర్ను తమది ప్రత్యేక వర్గంగా గుర్తించాలని కోరారు. మమతా బెనర్జీ తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ)కి ఎదురైన పరిస్థితులే, ఇప్పుడు ఉద్ధవ్ ఠాక్రే పార్టీ ఎదుర్కోంటోంది. ఈ తిరుగుబాటుపై ఉద్ధవ్ సన్నిహితుడు, రాజ్యసభ ఎంపీ సంజయ్… -
Uddhav Thackeray: ఉద్ధవ్ శివసేన మళ్లీ చీలిపోయింది.. ఎంపీల తిరుగుబాటు..
Uddhav Thackeray: శివసేన మరోసారి చీలిపోయింది. ఉద్ధవ్ ఠాక్రేకు చెందిన శివసేన(యూబీటీ) ఎంపీలు బిగ్ షాక్ ఇచ్చారు. 9 మంది ఎంపీల్లో ఆరుగురు తిరుగుబాటు చేశారు. ఉద్ధవ్ వర్గాన్ని వీడి, వీరంతా అసలైన శివసేన ఏక్నాథ్ షిండే వర్గంలో చేరేందుకు సిద్ధమయ్యారు. తమను ఒక ప్రత్యేక బృందంగా పరిగణించాలని కోరుతూ ఆరుగురు ఎంపీలు స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు. లేఖ రాసిన వారిలో ఉద్ధవ్ ఎంపీలు సంజయ్ జాదవ్, సంజయ్ దేశ్ముఖ్, నగేష్ పాటిల్ అస్తికర్,… -
Maharashtra Politics: ఉద్ధవ్ ఠాక్రే కోటలో మరోసారి చీలిక.. షిండే, లోక్సభ స్పీకర్తో భేటీకి ఎంపీలు రెడీ..
Maharashtra Politics: మహారాష్ట్ర రాజకీయాల్లో మరో భారీ కుదుపునకు తెర లేచింది. శివసేనలో గతంలో జరిగిన చీలిక గుర్తు తెచ్చేలా, ఇప్పుడు ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన (యుబిటి)ని లక్ష్యంగా చేసుకుని ‘ఆపరేషన్ టైగర్’ తుది అంకానికి చేరుకుంది. ఉద్ధవ్ సేనకు చెందిన 9 మంది లోక్సభ ఎంపీల్లో ఆరుగురు పార్టీ వీడి, ముఖ్యమంత్రి ఏకనాథ్ షిండే వైపు వెళ్లేందుకు సర్వం సిద్ధమైంది. దీంతో మహారాష్ట్ర రాజకీయ రణరంగం కాస్తా దేశ రాజధాని ఢిల్లీకి మారింది. గతంలో…
తాజావార్తలు
-
Nick Jonas: హాలీవుడ్ రేంజ్కి ఎదిగిన బాలీవుడ్ హీరోయిన్తో తన ప్రేమ ఎలా మొదలైందో చెప్పిన ప్రియాంక చోప్రా భర్త!
-
Ambati Rayudu: ‘విరాట్ కోహ్లీ ఊహించని తప్పు చేశాడు.. అందుకే ఫామ్ కోల్పోయాడు’..
-
Uttar Pradesh: అజాంఖాన్ డ్రీమ్ ప్రాజెక్ట్పై యోగి బుల్డోజర్ యాక్షన్..
-
Trump: ట్రంప్ చిత్రంతో బంగారు నాణెం విడుదల.. ప్రత్యేకత ఇదే
-
CM Chandrababu: అమరావతి 2.0 ఇంటిగ్రేటేడ్ మాస్టర్ ప్లాన్ పై సీఎం సమీక్ష.. ప్రపంచస్థాయి నగరంగా..!
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!