Eknath Shinde: ఉద్ధవ్ ఠాక్రే పాకిస్తాన్లో దసరా నిర్వహించి, ఆసిమ్ మునీర్ని ఆహ్వానించాలి..
- ఉద్ధవ్ ఠాక్రే దసరా పాక్లో చేయాలి, ఆసిమ్ మునీర్ని పిలవాలి..
- రాహుల్ గాంధీ పాకిస్తాన్ భాష మాట్లాడుతున్నారు..
- ముంబై దాడుల తర్వాత కాంగ్రెస్ పాక్పై ఎందుకు దాడి చేయలేదు..
- దసరా ర్యాలీలో కాంగ్రెస్, ఉద్ధవ్పై ఏక్ నాథ్ షిండే ఫైర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Eknath Shinde: 26/11 ముంబై ఉగ్ర దాడుల తర్వాత, అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం పాకిస్తాన్పై చర్యలు తీసుకోకపోవడం ‘‘ద్రోహం’’ అని శివసేన చీఫ్ ఏక్నాథ్ షిండే అన్నారు. ఎవరి ఒత్తిడితో కాంగ్రెస్ పాకిస్తాన్పై దాడికి సిద్ధ పడలేదని ప్రశ్నించారు. శివసేన వార్షిక దసరా ర్యాలీలో పాల్గొన్న ఆయన కాంగ్రెస్, ఉద్ధవ్ ఠాక్రే, రాహుల్ గాంధీపై విరుచుకుపడ్డారు. ఉద్ధవ్ ఠాక్రే తన సొంత పార్టీ అనుచరులకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారని ఆరోపించారు.
Read Also: Gandhi: దేశ విభజన తర్వాత.. మహాత్మా గాంధీ పాకిస్థాన్లో నివసించాలనుకున్నారా..? ఆశ్చర్యపరిచే నిజం..!
Also Read
- Kejriwal: సోనం వాంగ్చుక్కు కేజ్రీవాల్ మద్దతు.. యువత డిమాండ్లు నెరవేర్చాలని డిమాండ్
- Parliament Monsoon Session: 'వందే మాతరం'ను అవమానిస్తే జైలుకే.. కేంద్రం కీలక బిల్లు సిద్ధం
- Parliament: పార్లమెంట్ సమావేశాల్లో కాంగ్రెస్ వ్యూహం ఇదే! గరంగరమేనా?
- CM Vijay: అవినీతిపై సీఎం విజయ్ సీరియస్.. మంత్రులకు స్ట్రాంగ్ వార్నింగ్
ముంబై దాడుల తర్వాత, పాకిస్తాన్పై దాడి చేయకపోవడం అప్పటి యూపీఏ ప్రభుత్వం పిరికితనమని అన్నారు. ఇది భారత ప్రజలకు చేసిన ద్రోహంగా అభివర్ణించారు. ఇటీవల, అమెరికా ఒత్తిడి వల్ల పాక్పై దాడి చేయలేదని మాజీ కేంద్ర మంత్రి చిదంబరం చేసిన వ్యాఖ్యలపై ఏక్ నాథ్ షిండే విమర్శలు గుప్పించారు. పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత, భారత ప్రధాని నరేంద్రమోడీ తీవ్రంగా స్పందించారని, మన సైన్యం పాకిస్తాన్కు గుణపాఠం నేర్పిందని చెప్పారు. నక్క సింహం చర్మాన్ని ధరిస్తే సింహం అవ్వడని పాకిస్తాన్ గురించి చెప్పారు. నిజమైన సింహం ప్రధాని మోడీ అని అన్నారు.
ఉద్ధవ్ ఠాక్రే భారత సైన్యం పరాక్రమాన్ని ప్రశ్నించారని, ఆయన పాకిస్తాన్లో దసరా ర్యాలీ నిర్వహించి, పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ను ముఖ్య అతిథిగా ఆహ్వానించాలని షిండే ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పాకిస్తాన్ భాష మాట్లాడుతున్నారని అన్నారు. బీజేపీ, శివసేన, అజిత్ పవార్ ఎన్సీపీలు రాబోయే స్థానిక ఎన్నికల్లో కూటమిగా పోటీ చేస్తాయని ప్రకటించారు.
తాజావార్తలు
-
Bank Loan: ఎలాంటి పూచీ కత్తు లేకుండా రూ.20 లక్షల లోన్ .. ప్రాసెస్ ఇదే..
-
MG Motors: MG నుంచి కొత్త ADAPT టెక్నాలజీ.. EVలు, హైబ్రిడ్ కార్ల తయారీలో సంచలనం..
-
Kejriwal: సోనం వాంగ్చుక్కు కేజ్రీవాల్ మద్దతు.. యువత డిమాండ్లు నెరవేర్చాలని డిమాండ్
-
IND vs ENG 2nd ODI: సిరీస్ చేజిక్కించుకోవాలంటే బౌలర్ల చేతుల్లోనే.. ఇంగ్లాండ్ లక్ష్యం ఎంతంటే..
-
The Odyssey: ‘ది ఒడిస్సీ’ ప్రీ రివ్యూ ..
ట్రెండింగ్
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!