Uddhav Thackeray: శివసేన మళ్లీ చీలిపోవచ్చు.. బీజేపీకి షిండే భయపడుతున్నాడు..
- శివసేన మళ్లీ చీలిపోతుంది..
- షిండే రిసార్ట్ పాలిటిక్స్పై ఉద్ధవ్ ఠాక్రే..
- బీజేపీకి షిండే భయపడుతున్నాడని కామెంట్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Uddhav Thackeray: ముంబై మున్సిపల్ కార్పొరేషన్(బీఎంసీ) ఎన్నికల్లో ఠాక్రేల ఆధిపత్యానికి గండికొడుతూ.. 25 ఏళ్ల తర్వాత బీజేపీ+షిండే శివసేన సత్తా చాటాయి. 227 స్థానాలు ఉన్న ముంబైలో మెజారిటీ మార్క్ 114. బీజేపీ 89 స్థానాలు సాధించగా, షిండే శివసేన 29 స్థానాల్లో గెలిచింది. ఈ రెండు పార్టీలు కలిస్తే మొత్తం సంఖ్య 118, ఇది మెజారిటీ మార్కును సులభంగా దాటుతుంది. అయితే, ఇక్కడే షిండే సేన ‘‘కింగ్ మేకర్’’ స్థానంలో నిలిచింది. తమకే ముంబై మేయర్ పీఠం కావాలని బీజేపీపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తోంది.
ఈ నేపథ్యంలో శివసేన యూబీటీ నేత ఉద్ధవ్ ఠాక్రే సంచలన వ్యాఖ్యలు చేశారు. “ఏక్నాథ్ షిండే తన కార్పొరేటర్లను ఫైవ్-స్టార్ హోటల్లో ఉంచారు కాబట్టి అతను బీజేపీకి భయపడుతున్నాడు. వారు ఒకసారి చీలిపోయినప్పుడు, మళ్లీ చీలిపోగలరని అతనికి తెలుసు” అని అన్నారు. 2022లో శివసేన రెండుగా చీలిపోయింది. ఆ సమయంలో 40 మంది ఎమ్మెల్యేలు షిండేకు మద్దతుగా నిలిచారు. ఈ పరిణామాల తర్వాత శివసేన+కాంగ్రెస్+ఎన్సీపీ ప్రభుత్వం పడిపోయి, బీజేపీ + షిండే శివసేన అధికారాన్ని ఏర్పాటు చేశాయి.
Also Read
Read Also: Iran: ట్రంప్ ఒక ‘‘క్రిమినల్’’.. ఇరాన్ పరిణామాలకు కారణం ఆయనే..
షిండే శివసేన కార్పొరేటర్లు ‘‘రిసార్ట్ పాలిటిక్స్’’ మొదలుపెట్టిన నేపథ్యంలో ఉద్ధవ్ నుంచి ఈ వ్యాఖ్యలు వచ్చాయి. 29 మంది శివసేన కార్పొరేటర్లు ముంబైలోని తాజ్ ల్యాండ్స్ ఎండ్ హోటల్కు వెళ్లారు. ఈ ఎన్నికల్లో ఉద్ధవ్ ఠాక్రే శివసేన, రాజ్ ఠాక్రే ఎంఎన్ఎస్ పార్టీలు కలిసి పోటీ చేశాయి. 71 స్థానాలను కైవసం చేసుకున్నాయి. ముంబైలోని మరాఠా ప్రాబల్యం ఉన్న ప్రాంతాల్లో ఈ కూటమి సత్తా చాటింది. తమ పట్టును నిలుపుకుంది.
ముంబైలో తమ మేయర్ ఉండాలన్నదే తమ కల అని, కానీ సంఖ్యా బలం తమకు అనుకూలంగా లేదని ఉద్ధవ్ చెప్పారు. బీజేపీ కాగితంపై శివసేనను అంతం చేయగలదు కానీ, క్షేత్రస్థాయిలో కాదని అన్నారు. కానీ బీజేపీ కాగితాలపైనే కనిపిస్తోందని, క్షేత్రస్థాయిలో లేదని అన్నారు. ఫిరాయింపుదారుల్ని వారి వైపు తిప్పుకోవడానికి మహాయుతి ప్రభుత్వం దుర్వినియోగాలకు పాల్పడిందని, అధికారం, డబ్బు, బెదిరింపులకు పాల్పడిందని ఠాక్రే ఆరోపించారు. మా సభలకు భారీగా జనాలు వచ్చారని, బీజేపీ కార్యక్రమాల్లో ఖాళీ కుర్చీలు దర్శనమిచ్చాయని, అయినా వారికి అన్ని సీట్లు ఎలా వచ్చాయని అనుమానాలు ఉన్నాయని అన్నారు.
తాజావార్తలు
-
Pak Spy Network Busted: మేడ్ ఇన్ చైనా కెమెరాలు, పాక్కు లైవ్.. ఐఎస్ఐ గూఢచారి అరెస్ట్..
-
Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Uttar Pradesh: యూపీలో హిందూ లీడర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ హత్య..
-
North Cyprus: ఘోర ప్రమాదం.. సముద్రంలో ఫెర్రీ బోల్తా.. 270 మంది ఉన్నట్లు సమాచారం
ట్రెండింగ్
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!