Uddhav Thackeray: శివసేన మళ్లీ చీలిపోవచ్చు.. బీజేపీకి షిండే భయపడుతున్నాడు..
- శివసేన మళ్లీ చీలిపోతుంది..
- షిండే రిసార్ట్ పాలిటిక్స్పై ఉద్ధవ్ ఠాక్రే..
- బీజేపీకి షిండే భయపడుతున్నాడని కామెంట్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Uddhav Thackeray: ముంబై మున్సిపల్ కార్పొరేషన్(బీఎంసీ) ఎన్నికల్లో ఠాక్రేల ఆధిపత్యానికి గండికొడుతూ.. 25 ఏళ్ల తర్వాత బీజేపీ+షిండే శివసేన సత్తా చాటాయి. 227 స్థానాలు ఉన్న ముంబైలో మెజారిటీ మార్క్ 114. బీజేపీ 89 స్థానాలు సాధించగా, షిండే శివసేన 29 స్థానాల్లో గెలిచింది. ఈ రెండు పార్టీలు కలిస్తే మొత్తం సంఖ్య 118, ఇది మెజారిటీ మార్కును సులభంగా దాటుతుంది. అయితే, ఇక్కడే షిండే సేన ‘‘కింగ్ మేకర్’’ స్థానంలో నిలిచింది. తమకే ముంబై మేయర్ పీఠం కావాలని బీజేపీపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తోంది.
ఈ నేపథ్యంలో శివసేన యూబీటీ నేత ఉద్ధవ్ ఠాక్రే సంచలన వ్యాఖ్యలు చేశారు. “ఏక్నాథ్ షిండే తన కార్పొరేటర్లను ఫైవ్-స్టార్ హోటల్లో ఉంచారు కాబట్టి అతను బీజేపీకి భయపడుతున్నాడు. వారు ఒకసారి చీలిపోయినప్పుడు, మళ్లీ చీలిపోగలరని అతనికి తెలుసు” అని అన్నారు. 2022లో శివసేన రెండుగా చీలిపోయింది. ఆ సమయంలో 40 మంది ఎమ్మెల్యేలు షిండేకు మద్దతుగా నిలిచారు. ఈ పరిణామాల తర్వాత శివసేన+కాంగ్రెస్+ఎన్సీపీ ప్రభుత్వం పడిపోయి, బీజేపీ + షిండే శివసేన అధికారాన్ని ఏర్పాటు చేశాయి.
Also Read
- JNUలో ‘ఫ్రీ ఉమర్ ఖాలిద్’ నినాదాలు.. అసలేం జరుగుతోంది?
- JPSC: పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుల రాజీనామా.. 13 పరీక్షల్లో అక్రమాలు.. రాంచీకి వేలాదిగా తరలి వెళ్లిన విద్యార్థులు..
- Boy Living in Pond: చెరువే ఇల్లు.. నీటిలోకి దిగితేనే ఉపశమనం! ఐదేళ్లుగా ఇదే జీవితం.. 16 ఏళ్ల బాలుడి జీవితంలో మిస్టరీ ఏంటి?
- IRCTC Sri Lanka Ramayana Yatra 2026: రామాయణ పుణ్యక్షేత్రాలతో శ్రీలంక టూర్.. విమానం, హోటల్, భోజనం అన్నీ ప్యాకేజీలోనే!
Read Also: Iran: ట్రంప్ ఒక ‘‘క్రిమినల్’’.. ఇరాన్ పరిణామాలకు కారణం ఆయనే..
షిండే శివసేన కార్పొరేటర్లు ‘‘రిసార్ట్ పాలిటిక్స్’’ మొదలుపెట్టిన నేపథ్యంలో ఉద్ధవ్ నుంచి ఈ వ్యాఖ్యలు వచ్చాయి. 29 మంది శివసేన కార్పొరేటర్లు ముంబైలోని తాజ్ ల్యాండ్స్ ఎండ్ హోటల్కు వెళ్లారు. ఈ ఎన్నికల్లో ఉద్ధవ్ ఠాక్రే శివసేన, రాజ్ ఠాక్రే ఎంఎన్ఎస్ పార్టీలు కలిసి పోటీ చేశాయి. 71 స్థానాలను కైవసం చేసుకున్నాయి. ముంబైలోని మరాఠా ప్రాబల్యం ఉన్న ప్రాంతాల్లో ఈ కూటమి సత్తా చాటింది. తమ పట్టును నిలుపుకుంది.
ముంబైలో తమ మేయర్ ఉండాలన్నదే తమ కల అని, కానీ సంఖ్యా బలం తమకు అనుకూలంగా లేదని ఉద్ధవ్ చెప్పారు. బీజేపీ కాగితంపై శివసేనను అంతం చేయగలదు కానీ, క్షేత్రస్థాయిలో కాదని అన్నారు. కానీ బీజేపీ కాగితాలపైనే కనిపిస్తోందని, క్షేత్రస్థాయిలో లేదని అన్నారు. ఫిరాయింపుదారుల్ని వారి వైపు తిప్పుకోవడానికి మహాయుతి ప్రభుత్వం దుర్వినియోగాలకు పాల్పడిందని, అధికారం, డబ్బు, బెదిరింపులకు పాల్పడిందని ఠాక్రే ఆరోపించారు. మా సభలకు భారీగా జనాలు వచ్చారని, బీజేపీ కార్యక్రమాల్లో ఖాళీ కుర్చీలు దర్శనమిచ్చాయని, అయినా వారికి అన్ని సీట్లు ఎలా వచ్చాయని అనుమానాలు ఉన్నాయని అన్నారు.
తాజావార్తలు
-
Colombia Earthquake : కొలంబియాలో భారీ భూకంపం.. 47 మంది మృతి, కూలిన భవనాలు.!
-
OTR : అసెంబ్లీకి వైసీపీ..? DSC రచ్చ వేళ కూటమి అలర్ట్.. బీసీ బిల్లుపై కీలక నిర్ణయం..!
-
Chairmans Desk : దేశంలో వ్యవస్థలు ఎటు పోతున్నాయి..? పాలన కంటే రాజకీయమేముఖ్యమైపోయిందా..?
-
OTR: రెడ్ ఐ ఎవరి మీద..?
-
Chit Fund Scam: రూ.2,000 కోట్ల చిట్ఫండ్ స్కామ్.. వెల్ఫేర్ గ్రూప్పై ఈడీ దాడులు..
ట్రెండింగ్
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!