Uddhav Thackeray: శివసేన మళ్లీ చీలిపోవచ్చు.. బీజేపీకి షిండే భయపడుతున్నాడు..
- శివసేన మళ్లీ చీలిపోతుంది..
- షిండే రిసార్ట్ పాలిటిక్స్పై ఉద్ధవ్ ఠాక్రే..
- బీజేపీకి షిండే భయపడుతున్నాడని కామెంట్స్..
Uddhav Thackeray: ముంబై మున్సిపల్ కార్పొరేషన్(బీఎంసీ) ఎన్నికల్లో ఠాక్రేల ఆధిపత్యానికి గండికొడుతూ.. 25 ఏళ్ల తర్వాత బీజేపీ+షిండే శివసేన సత్తా చాటాయి. 227 స్థానాలు ఉన్న ముంబైలో మెజారిటీ మార్క్ 114. బీజేపీ 89 స్థానాలు సాధించగా, షిండే శివసేన 29 స్థానాల్లో గెలిచింది. ఈ రెండు పార్టీలు కలిస్తే మొత్తం సంఖ్య 118, ఇది మెజారిటీ మార్కును సులభంగా దాటుతుంది. అయితే, ఇక్కడే షిండే సేన ‘‘కింగ్ మేకర్’’ స్థానంలో నిలిచింది. తమకే ముంబై మేయర్ పీఠం కావాలని బీజేపీపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తోంది.
ఈ నేపథ్యంలో శివసేన యూబీటీ నేత ఉద్ధవ్ ఠాక్రే సంచలన వ్యాఖ్యలు చేశారు. “ఏక్నాథ్ షిండే తన కార్పొరేటర్లను ఫైవ్-స్టార్ హోటల్లో ఉంచారు కాబట్టి అతను బీజేపీకి భయపడుతున్నాడు. వారు ఒకసారి చీలిపోయినప్పుడు, మళ్లీ చీలిపోగలరని అతనికి తెలుసు” అని అన్నారు. 2022లో శివసేన రెండుగా చీలిపోయింది. ఆ సమయంలో 40 మంది ఎమ్మెల్యేలు షిండేకు మద్దతుగా నిలిచారు. ఈ పరిణామాల తర్వాత శివసేన+కాంగ్రెస్+ఎన్సీపీ ప్రభుత్వం పడిపోయి, బీజేపీ + షిండే శివసేన అధికారాన్ని ఏర్పాటు చేశాయి.
Also Read
Read Also: Iran: ట్రంప్ ఒక ‘‘క్రిమినల్’’.. ఇరాన్ పరిణామాలకు కారణం ఆయనే..
షిండే శివసేన కార్పొరేటర్లు ‘‘రిసార్ట్ పాలిటిక్స్’’ మొదలుపెట్టిన నేపథ్యంలో ఉద్ధవ్ నుంచి ఈ వ్యాఖ్యలు వచ్చాయి. 29 మంది శివసేన కార్పొరేటర్లు ముంబైలోని తాజ్ ల్యాండ్స్ ఎండ్ హోటల్కు వెళ్లారు. ఈ ఎన్నికల్లో ఉద్ధవ్ ఠాక్రే శివసేన, రాజ్ ఠాక్రే ఎంఎన్ఎస్ పార్టీలు కలిసి పోటీ చేశాయి. 71 స్థానాలను కైవసం చేసుకున్నాయి. ముంబైలోని మరాఠా ప్రాబల్యం ఉన్న ప్రాంతాల్లో ఈ కూటమి సత్తా చాటింది. తమ పట్టును నిలుపుకుంది.
ముంబైలో తమ మేయర్ ఉండాలన్నదే తమ కల అని, కానీ సంఖ్యా బలం తమకు అనుకూలంగా లేదని ఉద్ధవ్ చెప్పారు. బీజేపీ కాగితంపై శివసేనను అంతం చేయగలదు కానీ, క్షేత్రస్థాయిలో కాదని అన్నారు. కానీ బీజేపీ కాగితాలపైనే కనిపిస్తోందని, క్షేత్రస్థాయిలో లేదని అన్నారు. ఫిరాయింపుదారుల్ని వారి వైపు తిప్పుకోవడానికి మహాయుతి ప్రభుత్వం దుర్వినియోగాలకు పాల్పడిందని, అధికారం, డబ్బు, బెదిరింపులకు పాల్పడిందని ఠాక్రే ఆరోపించారు. మా సభలకు భారీగా జనాలు వచ్చారని, బీజేపీ కార్యక్రమాల్లో ఖాళీ కుర్చీలు దర్శనమిచ్చాయని, అయినా వారికి అన్ని సీట్లు ఎలా వచ్చాయని అనుమానాలు ఉన్నాయని అన్నారు.
తాజావార్తలు
-
Sorakaya Garelu Recipe: కరకరలాడే కమ్మని సొరకాయ గారెలు.. 10 నిమిషాల్లో ఇలా రెడీ చేసేయండి.!
-
Petrol Shortage: పెట్రోల్ బంకుల్లో నిబంధనలు.. ద్విచక్ర వాహనానికి రూ.200, కారుకు రూ.1000 మాత్రమే..
-
Sun Pharma: అమెరికా గడ్డపై భారత ఫార్మా జెండా.. లక్ష కోట్లతో దిగ్గజ కంపెనీని కొనుగోలు చేసిన సన్ ఫార్మా!
-
వందేళ్ల వైభవానికి అరుదైన గౌరవం.. Andhra Universityకు కేంద్రం ప్రత్యేక గుర్తింపు
-
Fire Accident : అంబర్పేటలో భారీ అగ్నిప్రమాదం.. తగలబడిన షోరూం గోదాం..
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!