Donald Trump: భారత్పై ‘‘జార్జ్ సోరోస్’’ కుట్రని వెల్లడించిన ట్రంప్..
- భారత్ని అస్థిరపరిచేందుకు జార్జ్ సోరోస్ కుట్ర..
- యూఎస్ ఫండ్స్తో పలు దేశాల్లో రాజకీయ సంక్షోభానికి యత్నం..
- సోరోస్ కుట్రలను వెల్లడించిన అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Donald Trump: ప్రధాని నరేంద్రమోడీ, బీజేపీ వ్యతిరేక వ్యక్తిగా పేరున్న అమెరికన్ బిలియనీర్ జార్జ్ సోరోస్ కుట్రలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. భారతదేశాన్ని అస్థిరపరిచేసందుకు సోరోస్ కుట్ర పన్నినట్లు అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్తో సహా బంగ్లాదేశ్తో పాటు అనేక దేశాల్లో అశాంతిని రేకెత్తించడానికి ఉపయోగించేందుకు, సోరోస్తో అనుబంధం ఉన్న అనేక సంస్థలకు నిధులు సమకూర్చినట్లు ట్రంప్ పేర్కొన్నారు. ఈ కార్యకలాపాల కోసం ఈ సంస్థలు 26 కోట్ల డాలర్లను అందుకున్నట్లు తేలింది. సోరోస్ ఈ నిధులతో ఆయా దేశాల్లో అశాంతిని, రాజకీయ అస్థిరతను సృష్టించేందుకు ఉపయోగించినట్లు ట్రంప్ పేర్కొన్నారు.
‘‘ సోరోస్ 270 మిలియన్ డాలర్లు అందుకున్నాడు. ఈ డబ్బుని శ్రీలంక, బంగ్లాదేశ్, ఉక్రెయిన్, సిరియా, ఇరాన్, పాకిస్తాన్, బ్రిటన్, ఇండియా, అమెరికాలలో అశాంతి, రాజకీయ సంక్షోభం, రాజకీయ ప్రయోజనాలకు కోసం ఉపయోగించాడు’’ అని ఎక్స్ వేదికగా ట్రంప్ వెల్లడించారు. పలు దేశాలకు యూఎస్ఎయిడ్ని నిలిపేసిన తర్వాత ట్రంప్ నుంచి ఈ వ్యాఖ్యలు వచ్చాయి.
Also Read
- Indus Waters Treaty: సింధు జలాల ఒప్పందంపై పాకిస్తాన్కు కెనడా షాక్..
- Congress: బంగ్లాదేశ్ ఉదాహరణతో కాంగ్రెస్కు కేంద్రం స్ట్రాంగ్ వార్నింగ్.. ప్రధాని నివాసం ముందు నిరసనపై ఫైర్
- Rahul Gandhi: రాహుల్గాంధీని ఈడ్చుకెళ్లిన పోలీసులు.. ముక్కుకు గాయం?
- Arijit Singh: గూండాల్లా విద్యార్థులపై దాడి చేస్తారా? ఢిల్లీ ఘటనపై ప్రముఖ సింగర్ ధ్వజం
Read Also: Bunny Vasu: కేసు ఫైల్ అయితే, వెనక్కి తీసుకోలేము..జాగ్రత్త !
గత 15 ఏళ్లలో USAID సోరోస్తో అనుబంధంగా ఉన్న సంస్థల సమన్వయంతో 270 మిలియన్ డాలర్లకు పైగా నిధులను సమకూర్చిందని నివేదికలు సూచించాయి. ఈస్ట్-వెస్ట్ మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్, సోరోస్ సంస్థ అయిన ఓపెన్ సొసైటీ ఫౌండేషన్తో కలిసి పనిచేస్తుంది. మరోవైపు టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ కూడా ట్రంప్ వాదనలకు మద్దతు ఇచ్చాడు. యూఎస్ఎయిడ్ వివాదాస్పద ప్రాజెక్టని చెప్పారు.
ఇదిలా ఉంటే, ఇదే తరహా వాదనల్ని భారత్, ముఖ్యంగా అధికారంలో ఉన్న బీజేపీ ఎప్పటి నుంచో లేవనెత్తుతోంది. భారత్ని అస్థిరపరిచేందుకు, అనవసర నిరసనలు, ఆందోళనలకు జార్జ్ సోరోస్ ఫండింగ్ చేస్తున్నట్లు ఆరోపించింది. పార్లమెంట్ శీతాకాల సమావేశాల సమయంలో.. బీజేపీ ఎంపీలు జార్జ్ సోరోస్ సంస్థలతో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి ఉన్న సంబంధాలను ప్రశ్నించారు.
తాజావార్తలు
-
Shamshabad : ఇండిగో ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ అత్యాచారయత్నం..!
-
Free Flight Journey: వారికి భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. ఒక రోజు ఉచిత విమాన ప్రయాణం..
-
Minister Seethakka : ములుగు టూర్కు వెళ్తున్నారా? మంత్రి సీతక్క కీలక హెచ్చరిక.!
-
Indus Waters Treaty: సింధు జలాల ఒప్పందంపై పాకిస్తాన్కు కెనడా షాక్..
-
Kavya Maran: పాకిస్థాన్ క్రికెటర్ను కొనుగోలు చేయడంపై చెలరేగిన రచ్చ.. కావ్య మారన్ రియాక్షన్ ఇదే!
ట్రెండింగ్
-
Cleaning Hacks : తుప్పు పట్టిన ఇనుప అల్మారా కొత్తదానిలా మెరవాలా? ఈ 4 చిట్కాలు చాలు.!
-
Remote Cleaning : వర్షాల్లో టీవీ రిమోట్ పనిచేయడం లేదా? ఈ 4 ట్రిక్స్తో కొత్తదానిలా మారుతుంది.!
-
Food Storage Tips : వంట నూనె ఇలా నిల్వ చేస్తే విషమే.! ఈ 5 సంకేతాలు కనిపిస్తే వెంటనే పారేయండి
-
Kitchen Tips : పుట్టగొడుగులు 2 రోజుల్లో పాడవుతున్నాయా? ఈ సీక్రెట్ ట్రిక్తో వారాల పాటు ఫ్రెష్.!
-
Sanju Samson: రోహిత్ భాయ్ సారీ.. నిన్ను నేను నమ్మలేదు.. సంజు ఆసక్తికర వ్యాఖ్యలు!