Donald Trump: హమాస్కు హెచ్చరిక జారీ చేసిన అమెరికా అధ్యక్షుడు
- హమాస్కు హెచ్చరిక జారీ చేసిన అమెరికా అధ్యక్షుడు
- శనివారం మధ్యాహ్నం 12 గంటల వరకు డెడ్ లైన్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Donald Trump: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గాజాలో బందీలుగా ఉన్న వారిని వెంటనే విడుదల చేయాలని హమాస్కు గట్టి హెచ్చరిక చేశారు. శనివారం మధ్యాహ్నం 12 గంటల వరకు గాజాలో ఉన్న బందీలను విడుదల చేయాలని, లేకపోతే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పారు. ప్రపంచమంతా ఆ దృశ్యాలను చూసే అవకాశం ఉంటుందని ట్రంప్ హెచ్చరించారు. అంతేకాకుండా, యుద్ధ విరమణ ఒప్పందాన్ని రద్దు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నట్లు సంకేతాలు ఇచ్చారు. “అక్కడ మిగిలి ఉన్న బందీలను విడుదల చేయాలి. వారందరినీ సురక్షితంగా వెనక్కి పంపాలి” అని ట్రంప్ స్పష్టం చేశారు. బందీలను విడుదల చేయకపోతే పరిస్థితి మరింత దిగజారే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
Also Read: Fire Accident: పాతబస్తీలో 400 బట్టల దుకాణాలు దగ్ధం.. 24 గంటల పాటు శ్రమించిన ఫైర్ సిబ్బంది!
Also Read
- Vaibhav Sooryavanshi: వైభవ్ క్రేజ్ మాములుగా లేదుగా.. క్షణాల్లో అమ్ముడుపోయిన టికెట్లు..
- SIP Investment: నెలకు రూ.20 వేల పెట్టుబడితో.. రూ.1 కోటి సంపాదించండి.. ఎలా అంటే..
- Bullet Trains: హైదరాబాదీలకు గుడ్న్యూస్.. బుల్లెట్ ట్రైన్ కారిడార్లు ప్రకటించిన కేంద్రం
- New T20 captain Shreyas Iyer: 'సింహాల్లా ఆడదాం'.. కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్ తొలి సందేశం..
గాజాలో యుద్ధ విరమణ ఒప్పందం కింద గత మూడువారాలుగా ప్రతి శనివారం బందీలను విడిచిపెడుతున్నారు. ఈ శనివారానికి కూడా అందరూ అదే ఆశించారు. బందీల కుటుంబాలు అక్కడికి చేరుకున్నాయి. అయితే, ఈ సారి పరిస్థితులు అనుకున్నట్లుగా జరిగలేదు. దీనిపై కుటుంబసభ్యులు నిరసన చేపట్టి తెల్ అవీవ్ను ముట్టడించారు.
ఈ నేపథ్యంలో బందీలను విడుదల చేయకపోతే హమాస్ దీనికి తీవ్ర మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. అలాగే శనివారం మధ్యాహ్నం 12 గంటలలోపు అన్ని బందీలను తిరిగి ఇవ్వకపోతే, ఒప్పందాన్ని రద్దు చేసుకోవడానికి ఇదే సరైన సమయం అని నేను భావిస్తున్నాను అని ఆయన అన్నారు. అలాగే గాజా శరణార్థులను తీసుకోవడానికి జోర్డాన్, ఈజిప్ట్ నిరాకరిస్తే వారికి అందిస్తున్న సహాయాన్ని నిలిపివేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. అంతేకాకుండా గాజా నుంచి పాలస్తీనియన్లు తిరిగి వచ్చే హక్కు ఉండదని కూడా స్పష్టం చేశారు.
Also Read: PM Modi: ఫ్రాన్స్లో మోడీ పర్యటన.. మాక్రాన్ ఇచ్చిన విందుకు హాజరైన ప్రధాని
గాజాలో 15 నెలల యుద్ధం అనంతరం హమాస్, ఇజ్రాయెల్ మధ్య జనవరి 19 నుంచి యుద్ధ విరమణ అమలులోకి వచ్చింది. ఈ ఒప్పందం కింద 21 మంది బందీలను విడుదల చేశారు. ఇందులో 16 మంది ఇజ్రాయెలీ పౌరులు, ఐదుగురు థాయ్ పౌరులు ఉన్నారు. మరోవైపు సదరు బందీలకు బదులుగా వందలాది మంది పాలస్తీనా బందీలను విడుదల చేశారు. ఇప్పటికీ 70 మందికిపైగా బందీలు గాజాలో ఉన్నారు. బంధీల విడుదల జరుగుతుందా లేదా అన్న దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. ట్రంప్ హెచ్చరికతో గాజా పరిస్థితి మరింత దిగజారే సూచనలు కనిపిస్తున్నాయి.
తాజావార్తలు
-
Shani Trayodashi 2026: రేపే శని త్రయోదశి.. పొరపాటున కూడా ఈ 5 తప్పులు చేయొద్దు..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ క్రేజ్ మాములుగా లేదుగా.. క్షణాల్లో అమ్ముడుపోయిన టికెట్లు..
-
SIP Investment: నెలకు రూ.20 వేల పెట్టుబడితో.. రూ.1 కోటి సంపాదించండి.. ఎలా అంటే..
-
Bullet Trains: హైదరాబాదీలకు గుడ్న్యూస్.. బుల్లెట్ ట్రైన్ కారిడార్లు ప్రకటించిన కేంద్రం
-
New T20 captain Shreyas Iyer: ‘సింహాల్లా ఆడదాం’.. కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్ తొలి సందేశం..
ట్రెండింగ్
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!