Donald Trump: హమాస్కు హెచ్చరిక జారీ చేసిన అమెరికా అధ్యక్షుడు
- హమాస్కు హెచ్చరిక జారీ చేసిన అమెరికా అధ్యక్షుడు
- శనివారం మధ్యాహ్నం 12 గంటల వరకు డెడ్ లైన్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Donald Trump: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గాజాలో బందీలుగా ఉన్న వారిని వెంటనే విడుదల చేయాలని హమాస్కు గట్టి హెచ్చరిక చేశారు. శనివారం మధ్యాహ్నం 12 గంటల వరకు గాజాలో ఉన్న బందీలను విడుదల చేయాలని, లేకపోతే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పారు. ప్రపంచమంతా ఆ దృశ్యాలను చూసే అవకాశం ఉంటుందని ట్రంప్ హెచ్చరించారు. అంతేకాకుండా, యుద్ధ విరమణ ఒప్పందాన్ని రద్దు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నట్లు సంకేతాలు ఇచ్చారు. “అక్కడ మిగిలి ఉన్న బందీలను విడుదల చేయాలి. వారందరినీ సురక్షితంగా వెనక్కి పంపాలి” అని ట్రంప్ స్పష్టం చేశారు. బందీలను విడుదల చేయకపోతే పరిస్థితి మరింత దిగజారే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
Also Read: Fire Accident: పాతబస్తీలో 400 బట్టల దుకాణాలు దగ్ధం.. 24 గంటల పాటు శ్రమించిన ఫైర్ సిబ్బంది!
Also Read
- Tilak Varma: "నమ్మకమే నా బలం.." అలా ఆడడం అంటే ఎంతో ఇష్టం..!
- Mumbai Indians Win: తిలక్ వర్మ తుఫాన్ ఇన్నింగ్స్ దెబ్బ.. పంజాబ్ అబ్బా..
- Arshdeep Singh: వివాదంలో చిక్కుకున్న అర్ష్దీప్ సింగ్.. తిలక్ వర్మ చర్మ రంగుపై అసభ్యకర వ్యాఖ్యలు..
- Russia Oil: ముంచుకొస్తున్న సంక్షోభం.. భారత్కు నిలిచిపోనున్న రష్యా చమురు..
గాజాలో యుద్ధ విరమణ ఒప్పందం కింద గత మూడువారాలుగా ప్రతి శనివారం బందీలను విడిచిపెడుతున్నారు. ఈ శనివారానికి కూడా అందరూ అదే ఆశించారు. బందీల కుటుంబాలు అక్కడికి చేరుకున్నాయి. అయితే, ఈ సారి పరిస్థితులు అనుకున్నట్లుగా జరిగలేదు. దీనిపై కుటుంబసభ్యులు నిరసన చేపట్టి తెల్ అవీవ్ను ముట్టడించారు.
ఈ నేపథ్యంలో బందీలను విడుదల చేయకపోతే హమాస్ దీనికి తీవ్ర మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. అలాగే శనివారం మధ్యాహ్నం 12 గంటలలోపు అన్ని బందీలను తిరిగి ఇవ్వకపోతే, ఒప్పందాన్ని రద్దు చేసుకోవడానికి ఇదే సరైన సమయం అని నేను భావిస్తున్నాను అని ఆయన అన్నారు. అలాగే గాజా శరణార్థులను తీసుకోవడానికి జోర్డాన్, ఈజిప్ట్ నిరాకరిస్తే వారికి అందిస్తున్న సహాయాన్ని నిలిపివేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. అంతేకాకుండా గాజా నుంచి పాలస్తీనియన్లు తిరిగి వచ్చే హక్కు ఉండదని కూడా స్పష్టం చేశారు.
Also Read: PM Modi: ఫ్రాన్స్లో మోడీ పర్యటన.. మాక్రాన్ ఇచ్చిన విందుకు హాజరైన ప్రధాని
గాజాలో 15 నెలల యుద్ధం అనంతరం హమాస్, ఇజ్రాయెల్ మధ్య జనవరి 19 నుంచి యుద్ధ విరమణ అమలులోకి వచ్చింది. ఈ ఒప్పందం కింద 21 మంది బందీలను విడుదల చేశారు. ఇందులో 16 మంది ఇజ్రాయెలీ పౌరులు, ఐదుగురు థాయ్ పౌరులు ఉన్నారు. మరోవైపు సదరు బందీలకు బదులుగా వందలాది మంది పాలస్తీనా బందీలను విడుదల చేశారు. ఇప్పటికీ 70 మందికిపైగా బందీలు గాజాలో ఉన్నారు. బంధీల విడుదల జరుగుతుందా లేదా అన్న దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. ట్రంప్ హెచ్చరికతో గాజా పరిస్థితి మరింత దిగజారే సూచనలు కనిపిస్తున్నాయి.
తాజావార్తలు
-
Peddi: ‘పెద్ది’ రిలీజ్కు భారీ షాక్..
-
Delhi Work From Home: ప్రభుత్వం కీలక నిర్ణయం.. రెండు రోజులు వర్క్ ఫ్రమ్ హోమ్.. పొదుపు చర్యల జాబితా విడుదల
-
Jasprit Bumrah: “ఇక మిగిలింది వన్డే కెప్టెన్సీనే.. కానీ!”.. కెప్టెన్గా తొలి విజయంపై జస్ప్రీత్ బుమ్రా ఆసక్తికర వ్యాఖ్యలు..
-
Dragon: నేషనల్ మీడియా సమక్షంలో ‘డ్రాగన్’ ఫస్ట్ గ్లింప్స్ లాంచ్!
-
Tilak Varma: “నమ్మకమే నా బలం..” అలా ఆడడం అంటే ఎంతో ఇష్టం..!
ట్రెండింగ్
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!