MK Stalin: తమిళనాడులో లోక్సభ ఎన్నికల ప్రచారం వాడీవేడిగా సాగుతోంది. అధికార డీఎంకే, బీజేపీ మధ్య విమర్శల దాడి జరుగుతోంది. సీఎం ఎంకే స్టాలిన్ బీజేపీ, ప్రధాని మోడీ టార్గెట్గా విమర్శలు చేస్తున్నారు.
Kamal Haasan: నటుడు-రాజకీయ నాయకుడు కమల్ హాసన్ బీజేపీ, కేంద్ర ప్రభుత్వాన్ని ఉద్దేశించి విమర్శలు గుప్పించారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోడ్ ఎంపీ స్థానంలో పోటీ చేస్తున్న డీఎంకే అభ్యర్థి కేఈ ప్రకాష్కి మద్దతుగా ప్రచారం చేశారు. తమిళనాడుకు కేంద్రం ఇస్తున్న పన్నుల వాటాను ప్రస్తావిస్తూ విమర్శలు గుప్పించారు. కేంద్రం ప్రభుత్వానికి అందించిన ప్రతీ రూపాయిలో కేవలం 29 పైసలు మాత్రమే రాష్ట్రానికి తిరిగి వస్తున్నట్లు ఆరోపించారు.
డీఎంకే అధినేత, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ లోక్ సభ ఎన్నికల ప్రచారంలో స్పీడ్ పెంచారు. ఇవాళ (శనివారం) ఉదయం సేలంలో పార్టీ అభ్యర్థి తరపున ప్రచారం చేశారు. ఈ సందర్భంగా రోడ్డు పక్కన ఉన్న ఓ ఛాయ్ దుకాణంలోకి వెళ్లి.. అక్కడ ఛాయ్ పెట్టించుకుని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తాగారు.
PM Modi: శివసేన(యూబీటీ) నేత సంజయ్ రౌత్, డీఎంకే మంత్రి అనితా రాధాకృష్ణన్ ప్రధాని నరేంద్రమోడీని ఉద్దేశిస్తూ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర ఎన్నికల సంఘానికి(ఈసీ)కి బీజేపీ ఫిర్యాదు చేసింది. పీఎంని కించపరిచే విధంగా ఇద్దరు నేతలు వ్యాఖ్యలు చేశారని మంగళవారం ఫిర్యాదు చేశారు. విదర్భ ప్రాంతంలోని బుల్దానాలో జరిగిన ర్యాలీలో సంజయ్ రౌత్ ప్రసంగిస్తూ.. ప్రధాని మోడీని ఔరంగజేబులో పోల్చారు. తమిళనాడు పశుసంవర్థక శాఖ మంత్రి అని రాధాకృష్ణన్ రాష్ట్రంలో జరిగిన ఓ సభలో ప్రధానిపై అవమానకరమైన…
Udhayanidhi Stalin: ప్రధాని నరేంద్రమోడీని ఇంటికి సాగనంపే వరకు మేము నిద్రపోము అని డీఎంకే నేత, సీఎం స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్ అన్నారు. ఇటీవల తమిళనాడు పర్యటనకు వెళ్లిన ప్రధాని నరేంద్రమోడీ డీఎంకు, ఇండియా కూటమిని ఉద్దేశించి విమర్శలు చేశారు.
తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీపై హాట్ కామెంట్స్ చేశారు. దేశం ప్రశాంతంగా ఉండాలంటే మోడీ తిరిగి అధికారంలోకి రావొద్దని వ్యాఖ్యానించారు. ప్రధాని నరేంద్ర మోడీ మళ్లీ ప్రధాని అయితే దేశమంతా అల్లర్లతో అల్లకల్లోలంగా మారుతుందని ఓట్లర్లను ఆయన హెచ్చరించారు.
Annamalai: బీజేపీ దక్షిణాది రాష్ట్రాలని టార్గెట్ చేసింది. ముఖ్యంగా తమిళనాడులో ఎన్నడూ లేనంతగా బీజేపీకి ఆశలు చిగురిస్తున్నాయి. దీనికి కారణం మాజీ ఐపీఎస్ అధికారి, తమిళ సింగంగా పేరు తెచ్చుకున్న కె. అన్నామలై. 37 ఏళ్ల ఈ యంగ్ పొలిటిషియన్ని బీజేపీ తమ భవిష్యత్తుగా భావిస్తోంది. అందుకనే అతి తక్కువ వయసులో తమిళనాడు వంటి రాష్ట్రానికి బీజేపీ అధ్యక్షుడిగా నియమితులయ్యారు. బీజేపీ పార్టీ అన్నామలైని చాలా స్పెషల్గా భావిస్తోంది.
Supreme Court: తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవిపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. డీఎంకే నేత కే పొన్ముడిని మంత్రివర్గంలో చేర్చుకునేందుకు గవర్నర్ నిరాకరించడంపై ఈ రోజు అత్యున్నత న్యాయస్థానం తీవ్రంగా మండిపడింది. చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం ఘాటుగా వ్యాఖ్యానిస్తూ.. ‘గవర్నర్ సుప్రీంకోర్టును ధిక్కరిస్తున్నారు’’అని అన్నారు. గవర్నర్ రాజ్యాంగాన్ని అనుసరించకపోతే, ప్రభుత్వం ఏం చేస్తుంది..? అని కేంద్రాన్ని సుప్రీం ప్రశ్నించింది. పొన్ముడిని మంత్రిగా నియమించేందుకు గవర్నర్కి…
Electoral bonds: సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా ఎలక్టోరల్ బాండ్ల సమాచారాన్ని ఈ రోజు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) వివరాలను కేంద్రం ఎన్నికల సంఘానికి అందించింది. బాండ్లకు సంబంధించి అన్ని ముఖ్యమైన ప్రత్యేక నంబర్లను కూడా అందించింది. ఇది నిధులు ఇచ్చిన దాతలు, తీసుకున్న పార్టీల వివరాలను సరిపోల్చడానికి సహాయపడుతుంది. బ్యాంక్ ఇచ్చిన వివరాలను ఎన్నికల సంఘం త్వరలో తన వెబ్సైట్లో పొందుపరుచనుంది. అకౌంట్ నంబర్, కేవైసీ డిటెయిల్స్ వెల్లడి కానున్నాయి.
Shobha Karandlaje: బీజేపీ నాయకురాలు, కేంద్ర మంత్రి శోభా కరంద్లాజేపై కేంద్ర ఎన్నికల సంఘం చర్యలకు ఉపక్రమించింది. మార్చి 1న బెంగళూర్లో జరిగిన రామేశ్వరం కేఫ్ పేలుడును ఉద్దేశిస్తూ.. తమిళనాడు నుంచి వచ్చిన వ్యక్తి బాంబు పెట్టాడని వ్యాఖ్యలు చేశారు. తమిళులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారంటూ తమిళనాడు అధికార పార్టీ డీఎంకే కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. దీంతో ఆమెపై చర్యలు తీసుకోవాలని బుధవారం పోల్ ప్యానెల్ ఆదేశించింది.