Udhayanidhi Stalin: ప్రధాని మోడీ ఇంటికి పంపే వరకు మేం నిద్రపోం.. డీఎంకే అధినేత కీలక వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Udhayanidhi Stalin: ప్రధాని నరేంద్రమోడీని ఇంటికి సాగనంపే వరకు మేము నిద్రపోము అని డీఎంకే నేత, సీఎం స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్ అన్నారు. ఇటీవల తమిళనాడు పర్యటనకు వెళ్లిన ప్రధాని నరేంద్రమోడీ డీఎంకు, ఇండియా కూటమిని ఉద్దేశించి విమర్శలు చేశారు. డీఎంకేకి నిద్రలేని రాత్రులు వచ్చాయని పీఎం మోడీ అన్నారు. ఈ వ్యాఖ్యలపై ఉదయనిధి స్టాలిన్ ఈ రోజు స్పందించారు. రాబోయే లోక్సభ ఎన్నికల్లో ప్రధాని మోడీని, బీజేపీని ఇంటికి పంపే వరకు తమ పార్టీ నిద్రపోదని ఆయన అన్నారు.
డీఎంకే పార్టీకి నిద్ర పట్టడం లేదని ప్రధాని విమర్శించిన నేపథ్యంలో.. అవును మిమ్మల్ని ఇంటికి పంపే వరకు మాకు నిద్రపట్టదంటూ ఉదయనిధి సెటైర్లు వేశారు. 2014లో గ్యాస్ సిలిండర్ ధర రూ. 450 ఉంటే ఇప్పుడు రూ. 1200కి పెరిగిందని, రూ. 100 తగ్గింది ప్రధాని మోడీ ఎన్నికల డ్రామాకు తెరతీశారని విమర్శించారు. ఎన్నికల తర్వాత మళ్లీ సిలిండర్ల ధరను రూ. 500కు పెంచుతారని తిరువన్నామలై జిల్లాలో జరిగిన ప్రచారంలో ఉదయనిధి ఆరోపించారు.
Also Read
- TMC: హెడ్ క్వార్టర్స్ కోల్పోయిన మమతా బెనర్జీ.. తృణమూల్ సంక్షోభం తీవ్రం..
- Mohan Bhagwat: ప్రవర్తనతో భారతీయ కుటుంబాలు ప్రపంచానికి ఆదర్శంగా ఉండాలి
- India On Indus Waters: ఎంత మొత్తుకున్నా నీళ్లు ఇయ్యం.. పాక్కు భారత్ స్పష్టీకరణ..
- US Woman Shocked: అమెరికాలో రూ.85 వేలు, భారత్లో రూ.35 మాత్రమే.. మందుల ధరలపై మహిళ షాక్..
Read Also: Pakistan: కాన్వాయ్పై ఆత్మాహుతి దాడి.. ఆరుగురు చైనా పౌరుల మృతి
ఇటీవల ప్రధాని మోడీని ‘‘28 పైసల ప్రధాని’’ అని పిలవాలంటూ ఉదయనిధి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇటీవల తమిళనాడు వెళ్లి ప్రధాని మోడీ డీఎంకే, ఇండియా కూటమిపై విరుచుకుపడ్డారు. ‘‘ అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభోత్సవంలో కాంగ్రెస్ దాని ‘ఘమాండియా’ కూటమికి సమస్యలు ఉన్నాయని, ఈ అభివృద్ధిని చూసి కాంగ్రెస్కి మాట్లాడే శక్తి లేదన్నారు. నేను అభివృద్ధి ప్రాజెక్టులు ప్రారంభించినప్పుడు ఎన్నికల వ్యూహం అని పిలుస్తారు. అయితే, ఇలాంటి లక్షణం కాంగ్రెస్ మాత్రమే ఉంది’’ అని ప్రధాని మార్చి 11న అన్నారు.
ప్రధానిపై దాడిని కొనసాగిస్తూ ఉదయనిధి.. గతేడాది మైచాంగ్ తుఫాన్ తాకిడికి తమిళనాడు ప్రభావితమైందని, ప్రధాని అక్కడికి వెళ్లలేదని ఆరోపించారు. మా సీఎం నిధులు కోరితే, ఇప్పటి వరకు ఒక్క రూపాయి ఇవ్వలేదని, రానున్న 22 రోజుల్లో ప్రతీ ఇంటికి మా కార్యకర్తలు వెళ్లి బాధ్యత తీసుకుంటారని, మీరంతా డీఎంకేని గెలిపించాలని ఉదయనిధి ప్రజల్ని కోరారు.
తాజావార్తలు
-
Story Board : ట్రంప్ తలనొప్పిని రెండున్నరేళ్లు భరించక తప్పదా..?
-
BRICS Trade Unions Summit : హైదరాబాద్లో బ్రిక్స్ ట్రేడ్ యూనియన్స్ సమ్మిట్
-
TMC: హెడ్ క్వార్టర్స్ కోల్పోయిన మమతా బెనర్జీ.. తృణమూల్ సంక్షోభం తీవ్రం..
-
Khamenei: ఖమేనీ అంత్యక్రియల్లో హృదయ విదారక దృశ్యం.. 14 నెలల మనవరాలి పార్థివదేహం
-
OTR: తాండూరు కాంగ్రెస్లో గ్రూప్ వార్.. ఎమ్మెల్యే vs ఎమ్మెల్సీ పోరు ముదిరిందా?
ట్రెండింగ్
-
Indonesia: దొంగతనానికి వచ్చి ‘మమ్మీ’లుగా మారిపోయారు.. వైరల్ వీడియో
-
Instagram: ఇంస్టాగ్రామ్కు కేంద్రం నోటీసులు.!
-
Smoking While Drinking Tea: ‘టీ’తో పాటు ‘సిగరెట్’ తాగుతున్నారా.? ఆ రోగాలకు రెడ్ కార్పెట్ పరిచినట్లే.!
-
Home Tips : ఇంట్లోకి తేళ్లు రాకుండా ఉండాలా.? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
14 రోజుల బ్యాటరీ, AMOLED డిస్ప్లేతో HUAWEI Band 11 సిరీస్ భారత్లో లాంచ్..!