Udhayanidhi Stalin: ప్రధాని మోడీ ఇంటికి పంపే వరకు మేం నిద్రపోం.. డీఎంకే అధినేత కీలక వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Udhayanidhi Stalin: ప్రధాని నరేంద్రమోడీని ఇంటికి సాగనంపే వరకు మేము నిద్రపోము అని డీఎంకే నేత, సీఎం స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్ అన్నారు. ఇటీవల తమిళనాడు పర్యటనకు వెళ్లిన ప్రధాని నరేంద్రమోడీ డీఎంకు, ఇండియా కూటమిని ఉద్దేశించి విమర్శలు చేశారు. డీఎంకేకి నిద్రలేని రాత్రులు వచ్చాయని పీఎం మోడీ అన్నారు. ఈ వ్యాఖ్యలపై ఉదయనిధి స్టాలిన్ ఈ రోజు స్పందించారు. రాబోయే లోక్సభ ఎన్నికల్లో ప్రధాని మోడీని, బీజేపీని ఇంటికి పంపే వరకు తమ పార్టీ నిద్రపోదని ఆయన అన్నారు.
డీఎంకే పార్టీకి నిద్ర పట్టడం లేదని ప్రధాని విమర్శించిన నేపథ్యంలో.. అవును మిమ్మల్ని ఇంటికి పంపే వరకు మాకు నిద్రపట్టదంటూ ఉదయనిధి సెటైర్లు వేశారు. 2014లో గ్యాస్ సిలిండర్ ధర రూ. 450 ఉంటే ఇప్పుడు రూ. 1200కి పెరిగిందని, రూ. 100 తగ్గింది ప్రధాని మోడీ ఎన్నికల డ్రామాకు తెరతీశారని విమర్శించారు. ఎన్నికల తర్వాత మళ్లీ సిలిండర్ల ధరను రూ. 500కు పెంచుతారని తిరువన్నామలై జిల్లాలో జరిగిన ప్రచారంలో ఉదయనిధి ఆరోపించారు.
Also Read
- Pakistan: శతాబ్ధం నాటి హిందూ ఆలయం కూల్చివేత.. పాక్పై భారత్ ఆగ్రహం..
- Swara Bhasker: ఇతర మహిళల్ని గౌరవించడం నేర్చుకో.. స్వరా భాస్కర్ వ్యాఖ్యలపై బీజేపీ..
- CM Vijay: సీఎం విజయ్ను కలిసిన టీఎంసీ రెబెల్ ఎంపీ సయానీ ఘోష్
- Yasin Malik: ‘‘నన్ను ఉరితీయక ముందే నిన్ను విముక్తి చేస్తా’’.. భార్యకు యాసిన్ మాలిక్ విడాకులు
Read Also: Pakistan: కాన్వాయ్పై ఆత్మాహుతి దాడి.. ఆరుగురు చైనా పౌరుల మృతి
ఇటీవల ప్రధాని మోడీని ‘‘28 పైసల ప్రధాని’’ అని పిలవాలంటూ ఉదయనిధి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇటీవల తమిళనాడు వెళ్లి ప్రధాని మోడీ డీఎంకే, ఇండియా కూటమిపై విరుచుకుపడ్డారు. ‘‘ అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభోత్సవంలో కాంగ్రెస్ దాని ‘ఘమాండియా’ కూటమికి సమస్యలు ఉన్నాయని, ఈ అభివృద్ధిని చూసి కాంగ్రెస్కి మాట్లాడే శక్తి లేదన్నారు. నేను అభివృద్ధి ప్రాజెక్టులు ప్రారంభించినప్పుడు ఎన్నికల వ్యూహం అని పిలుస్తారు. అయితే, ఇలాంటి లక్షణం కాంగ్రెస్ మాత్రమే ఉంది’’ అని ప్రధాని మార్చి 11న అన్నారు.
ప్రధానిపై దాడిని కొనసాగిస్తూ ఉదయనిధి.. గతేడాది మైచాంగ్ తుఫాన్ తాకిడికి తమిళనాడు ప్రభావితమైందని, ప్రధాని అక్కడికి వెళ్లలేదని ఆరోపించారు. మా సీఎం నిధులు కోరితే, ఇప్పటి వరకు ఒక్క రూపాయి ఇవ్వలేదని, రానున్న 22 రోజుల్లో ప్రతీ ఇంటికి మా కార్యకర్తలు వెళ్లి బాధ్యత తీసుకుంటారని, మీరంతా డీఎంకేని గెలిపించాలని ఉదయనిధి ప్రజల్ని కోరారు.
తాజావార్తలు
-
Razesh Danda : నిద్ర లేదు.. చాలా టెన్షన్ పడ్డాం!
-
Story Board: లక్షల ఓట్లు గల్లంతుకు కారణాలేంటి..? ఓటర్లకు ఓటింగ్ అంటేనే విరక్తి పుట్టిస్తారా..?
-
Irumudi : ‘ఇరుముడి’ అడవి సీక్రెట్ చెప్పేసిన శివ నిర్వాణ!
-
Shiva Nirvana : నెక్స్ట్ సినిమా ధనుష్తోనా? క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్ శివ నిర్వాణ
-
ICC Cricket World Cup 2027: ప్రపంచకప్లో టీమ్ఇండియా ఎక్స్ఫ్యాక్టర్ ఎవరు..? జాంటీ రోడ్స్ సంచలన వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్ఫోన్ లాంచ్.!