Annamalai: క్రికెట్ స్టేడియం హామీ ఎన్నికల స్టంట్.. సీఎం స్టాలిన్పై అన్నామలై..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Annamalai: తమిళనాడులో ఎన్నికల ప్రచారం రసవత్తరంగా మారింది. అధికార డీఎంకే, బీజేపీ పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. కోయంబత్తూర్లో అత్యాధునిక క్రికెట్ స్టేడియం నిర్మిస్తామని సీఎం స్టాలిన్ హామీ ఇవ్వడంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై విరుచుకుపడ్దారు. ఇది ఎన్నికల స్టంట్ అని అభివర్ణించారు. కొత్త హామీలను ఇచ్చే ముందు గతంలో ప్రకటించిన 511 ఎన్నికల హామీలను తప్పనిసరిగా నెరవేర్చాలని డిమాండ్ చేశారు. కోయంబత్తూర్లో తమ అభ్యర్థిని గెలిపించుకునేందుకు డీఎంకే ఇలాంటి వాగ్దానాలు చేస్తుందని ఆయన అన్నారు.
Read Also: Iran: ఇజ్రాయిల్ ఎంబసీలు ఇక ఎంత మాత్రం సేఫ్ కావు.. ఇరాన్ వార్నింగ్..
Also Read
- NEET UG 2026: మే 3న నీట్ పరీక్ష, మే 12న రద్దు.. అసలు ఈ 10 రోజుల్లో ఏం జరిగింది? పూర్తి టైమ్లైన్ ఇదే..
- Udhayanidhi Stalin: అధికారం పోయినా మారని తీరు! సనాతన ధర్మంపై మరోసారి విషం చిమ్మిన ఉదయనిధి స్టాలిన్
- NEET UG 2026 అభ్యర్థులకు బిగ్ షాక్.. పరీక్ష రద్దు చేస్తూ కేంద్రం సంచలన నిర్ణయం
- Assam CM Himanta Biswa Sarma: రెండోసారి అస్సాం ముఖ్యమంత్రిగా 'హిమంత శర్మ' ప్రమాణ స్వీకారం..!
2021లో స్టాలిన్ ఇచ్చిన హామీలు ఇప్పటికీ నెరవేరలేదని, ఓడిపోతున్నామని గ్రహించి మరిన్ని హామీలను చేస్తున్నారని, ముందుగా ఇచ్చిన హామీలను స్టాలిన్కి గుర్తు చేయాలని అనుకుంటున్నానని ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. కోయంబత్తూర్ యువత, క్రీడా ప్రియులు మరింత అప్రమత్తంగా ఉన్నందున డీఎంకే హామీలు పనిచేయవని అన్నామలై అన్నారు. తాము గెలిస్తే కోయంబత్తూర్లో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం నిర్మిస్తామని స్టాలిన్ ఇటీవల ప్రకటించారు.
ఈసారి ఎలాగైనా, తమిళనాడులో బీజేపీ సత్తా చాటాలని అనుకుంటోంది. అన్నామలైని కోయంబత్తూర్ నుంచి లోక్సభ బరిలో నిలిపింది. మరోవైపు డీఎంకేకి కోయంబత్తూర్ ఎంపీ స్థానంలో సరైన ట్రాక్ రికార్డ్ లేదు. దీంతో డీఎంకే పార్టీ అన్నామలై ఓడించాలని పెద్ద ఎత్తున ప్రచారం చేస్తోంది. కోయంబత్తూర్ నుంచి డీఎంకే గణపతి పి కుమార్ని బరిలోకి దించింది. ఏఐడీఎంకే సింగై రామచంద్రన్ని పోటీలో నిలిపింది. తమిళనాడులోని 39 స్థానాలకు ఏప్రిల్ 19న మొదటి దశ ఎన్నికల్లో పోలింగ్ జరగనుంది. 2019 ఎన్నికల్లో రాష్ట్రంలోని 23 ఎంపీ స్థానాలను డీఎంకే గెలుచుకోగా.. మిత్రపక్షాలైన కాంగ్రెస్ 8 సీట్లు గెలుచుకోగా.. సీపీఐ రెండు, సీపీఎం, ఐయూఎంఎల్లు ఒక్కో స్థానాన్ని దక్కించుకోగా.. ఇద్దరు స్వతంత్రులు గెలుపొందారు.
We want to remind TN CM Thiru @mkstalin that the 511 poll promises he gave in 2021 remain unfulfilled, and he first attends to those before making further promises after sensing defeat.
The electoral stunts of DMK cannot deceive the youth & the sports enthusiasts in Coimbatore… https://t.co/8Qpr0fVzmz
— K.Annamalai (@annamalai_k) April 7, 2024
తాజావార్తలు
-
NEET UG 2026: మే 3న నీట్ పరీక్ష, మే 12న రద్దు.. అసలు ఈ 10 రోజుల్లో ఏం జరిగింది? పూర్తి టైమ్లైన్ ఇదే..
-
Hiro Vishal: 717 వైన్ షాపుల మూసివేత.. హీరో విశాల్ భావోద్వేగ పోస్ట్!
-
Axar Patel: విజయం సాధించిన లేని ఆనందం.. ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్కు భారీ జరిమానా..!
-
KTR: “23 లక్షల మందికి మానసిక క్షోభ”.. నీట్ ప్రశ్నాపత్రం లీక్పై మాజీ మంత్రి కేటీఆర్ ఫైర్..
-
Dragon :‘డ్రాగన్’ గ్లింప్స్ టైమ్ ఫిక్స్ ..?
ట్రెండింగ్
-
క్లచ్ లేకుండానే గేర్ మార్పులు.. ఈ-క్లచ్ టెక్నాలజీతో Honda NX500 లాంచ్..
-
స్టైలిష్ లుక్ + పవర్ ఫుల్ బ్యాటరీతో లాంచ్ కు సిద్దమైన Realme 16T 5G.!
-
TVK Floor Test: మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు.. బలపరీక్షకు ముందే టీవీకేకు కోలుకోలేని దెబ్బ!
-
Palak Paratha Recipe: హెల్దీగా, టేస్టీగా చేసే సూపర్ సాఫ్ట్ ‘పాలక్ పరోటా’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Samsung: సర్టిఫైడ్ రీ-న్యూడ్ ప్రోగ్రామ్ తో రిఫర్బిష్డ్ గెలాక్సీ S25, గెలాక్సీ A56 మోడళ్లను తీసుకొచ్చిన శాంసంగ్..!