Annamalai: క్రికెట్ స్టేడియం హామీ ఎన్నికల స్టంట్.. సీఎం స్టాలిన్పై అన్నామలై..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Annamalai: తమిళనాడులో ఎన్నికల ప్రచారం రసవత్తరంగా మారింది. అధికార డీఎంకే, బీజేపీ పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. కోయంబత్తూర్లో అత్యాధునిక క్రికెట్ స్టేడియం నిర్మిస్తామని సీఎం స్టాలిన్ హామీ ఇవ్వడంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై విరుచుకుపడ్దారు. ఇది ఎన్నికల స్టంట్ అని అభివర్ణించారు. కొత్త హామీలను ఇచ్చే ముందు గతంలో ప్రకటించిన 511 ఎన్నికల హామీలను తప్పనిసరిగా నెరవేర్చాలని డిమాండ్ చేశారు. కోయంబత్తూర్లో తమ అభ్యర్థిని గెలిపించుకునేందుకు డీఎంకే ఇలాంటి వాగ్దానాలు చేస్తుందని ఆయన అన్నారు.
Read Also: Iran: ఇజ్రాయిల్ ఎంబసీలు ఇక ఎంత మాత్రం సేఫ్ కావు.. ఇరాన్ వార్నింగ్..
Also Read
- Train: మరీ చీఫ్గా దుప్పట్లు చోరీ.. కోచ్ అటెండెంట్లు గగ్గోలు.. ఎందుకంటే..!
- Supreme Court: ప్రేమికుల్ని నిలువరించడం సాధ్యమా? పోక్సో దుర్వినియోగంపై సుప్రీంకోర్టు చీవాట్లు
- India-US: అమెరికాతో ఒప్పందం వద్దనుకుంటున్నట్లు కథనాలు.. పీయూష్ గోయల్ క్లారిటీ
- Bengaluru: ప్రేమికుడిని పెళ్లాడిన 4 నెలలకే ఉపాధ్యాయురాలు ఆత్మహత్య.. సూసైడ్ నోట్లో ఏం రాసిందంటే..!
2021లో స్టాలిన్ ఇచ్చిన హామీలు ఇప్పటికీ నెరవేరలేదని, ఓడిపోతున్నామని గ్రహించి మరిన్ని హామీలను చేస్తున్నారని, ముందుగా ఇచ్చిన హామీలను స్టాలిన్కి గుర్తు చేయాలని అనుకుంటున్నానని ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. కోయంబత్తూర్ యువత, క్రీడా ప్రియులు మరింత అప్రమత్తంగా ఉన్నందున డీఎంకే హామీలు పనిచేయవని అన్నామలై అన్నారు. తాము గెలిస్తే కోయంబత్తూర్లో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం నిర్మిస్తామని స్టాలిన్ ఇటీవల ప్రకటించారు.
ఈసారి ఎలాగైనా, తమిళనాడులో బీజేపీ సత్తా చాటాలని అనుకుంటోంది. అన్నామలైని కోయంబత్తూర్ నుంచి లోక్సభ బరిలో నిలిపింది. మరోవైపు డీఎంకేకి కోయంబత్తూర్ ఎంపీ స్థానంలో సరైన ట్రాక్ రికార్డ్ లేదు. దీంతో డీఎంకే పార్టీ అన్నామలై ఓడించాలని పెద్ద ఎత్తున ప్రచారం చేస్తోంది. కోయంబత్తూర్ నుంచి డీఎంకే గణపతి పి కుమార్ని బరిలోకి దించింది. ఏఐడీఎంకే సింగై రామచంద్రన్ని పోటీలో నిలిపింది. తమిళనాడులోని 39 స్థానాలకు ఏప్రిల్ 19న మొదటి దశ ఎన్నికల్లో పోలింగ్ జరగనుంది. 2019 ఎన్నికల్లో రాష్ట్రంలోని 23 ఎంపీ స్థానాలను డీఎంకే గెలుచుకోగా.. మిత్రపక్షాలైన కాంగ్రెస్ 8 సీట్లు గెలుచుకోగా.. సీపీఐ రెండు, సీపీఎం, ఐయూఎంఎల్లు ఒక్కో స్థానాన్ని దక్కించుకోగా.. ఇద్దరు స్వతంత్రులు గెలుపొందారు.
We want to remind TN CM Thiru @mkstalin that the 511 poll promises he gave in 2021 remain unfulfilled, and he first attends to those before making further promises after sensing defeat.
The electoral stunts of DMK cannot deceive the youth & the sports enthusiasts in Coimbatore… https://t.co/8Qpr0fVzmz
— K.Annamalai (@annamalai_k) April 7, 2024
తాజావార్తలు
-
Fake Shopping Offers : రూ.999 ఆఫర్.. ఖాతా ఖాళీ.! సైబర్ మోసగాళ్ల కొత్త ట్రిక్
-
OTR: కలెక్టర్ vs పోలీస్?.. పెద్దపల్లిలో హాట్ టాపిక్గా మారిన రివ్యూ మీటింగ్
-
OTR: ఎమ్మెల్యే మాధవి వైఖరి మిగతా ఎమ్మెల్యేలకు ఇబ్బందిగా మారిందా?
-
Train: మరీ చీఫ్గా దుప్పట్లు చోరీ.. కోచ్ అటెండెంట్లు గగ్గోలు.. ఎందుకంటే..!
-
ITR Filing: కొత్త ట్యాక్స్ విధానమే బెస్ట్? పాత విధానం ఎవరికి లాభం.. నిపుణులు ఏం చెబుతున్నారంటే?
ట్రెండింగ్
-
IPL 2027-CSK: సీఎస్కేకు క్రికెట్ దిగ్గజం గుడ్బై.. 18 ఏళ్ల బంధానికి ముగింపు!
-
IND vs ENG 1st ODI: ముగ్గురు మొనగాళ్లు వచ్చేశారు.. భారత్ ప్లేయింగ్ 11 ఇదే.. ఇక రచ్చరచ్చే!
-
APTRANSCO Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. APTRANSCOలో 200 AEE ఉద్యోగాలు.. రూ.2.08 లక్షల వరకు జీతం.!
-
5G, 4G మోడళ్లతో ఎంట్రీ ఇవ్వనున్న Lava Virat V1 సిరీస్.. ఫీచర్స్ ఇవే.!
-
BSNL ధమాకా.. రూ. 259కే 700GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.. ఉచిత OTT కూడా.!