Katchatheevu: కచ్చతీవు ద్వీపంపై రాజకీయ రగడ.. కాంగ్రెస్, బీజేపీ, డీఎంకే మధ్య మాటల యుద్ధం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Katchatheevu: లోక్సభ ఎన్నికల నేపథ్యంలో కచ్చతీవు ద్వీపం అంశాన్ని బీజేపీ తెరపైకి తెచ్చింది. 1974లో ఆ ద్వీపాన్ని నాటి ప్రధాని ఇందిరాగాంధీ.. శ్రీలంకకు అప్పగించారని కమలం పార్టీ ఆరోపించింది. ఇక, ఉత్తర్ప్రదేశ్లోని మేరఠ్ ర్యాలీలోనూ కచ్చతీవును మోడీ ప్రస్తావిస్తూ.. కాంగ్రెస్, డీఎంకే పార్టీలపై ధ్వజమెత్తారు. స్వాతంత్య్రం వచ్చినప్పుడు కచ్చతీవు మన దగ్గరే ఉండగా.. శ్రీలంక, తమిళనాడు మధ్య ఉన్న ఆ దీవి భద్రతా పరంగా కీలకమైందన్నారు. కానీ, కాంగ్రెస్ ఆ ద్వీపం ఎందుకూ పనికిరాదంటూ శ్రీలంకకు అప్పగించిందని ఆరోపించారు. అలాగే, తమిళనాడు మత్స్యకారులు ఆ ద్వీపం వైపు వెళ్లినపుడు శ్రీలంక అధికారులు అరెస్టు చేస్తున్నారని తెలిపారు.. ఇక, తమ బోట్లను జప్తు చేస్తున్నారు.. కాంగ్రెస్తో పొత్తుకట్టిన డీఎంకే లాంటి పార్టీలు కూడా ఈ అంశంపై మాట్లాడటం లేదని ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్నారు.
Read Also: Congress: సీఈసీ ముందు ప్రతిపాదనలు.. నేడు ఏపీ కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా..!
Also Read
ఇక, ప్రధాని మోడీ ఆరోపణలపై కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సీరియస్ అయ్యారు. తమిళనాడులో ఎన్నికల నేపథ్యంలోనే ఈ సున్నిత అంశాన్ని ప్రధాని రాజకీయం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. అధికారంలో ఉన్న పదేళ్లలో కచ్చతీవును ఎందుకు వెనక్కి తెచ్చుకోలేదు మోడీ ప్రభుత్వం అని ప్రశ్నించారు. తూర్పు లద్దాఖ్లోని గల్వాన్ లోయలో 20 మంది సైనికులు ప్రాణ త్యాగాలు చేసిన తర్వాత కూడా.. చైనాకు మోడీ ఎలా క్లీన్చిట్ ఇచ్చారని ఖర్గే నిలదీశారు. ఇక, మీ హయాంలో బంగ్లాదేశ్తో భూ సరిహద్దు ఒప్పందం చేసుకున్నారు.. స్నేహపూర్వక సంబంధాల్లో భాగంగా 55 ప్రాంతాలు భారత్కు వస్తే.. 111 ప్రాంతాలు బంగ్లాకు వెళ్లాయనే విషయాన్ని గుర్తు చేశారు. అలాంటి ఒప్పందంలో భాగంగానే గత ప్రభుత్వం శ్రీలంకకు కచ్చతీవు దీవిని అప్పగించిందని మల్లికార్జున ఖర్గే వెల్లడించారు.
Read Also: Premalu OTT: ప్రేమలు ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది..స్ట్రీమింగ్ అప్పుడే?
ఇక, 1974లో కచ్చతీవు ద్వీపాన్ని శ్రీలంకకు అప్పగించిందని ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలకు డీఎంకే పార్టీ నేతలు ఎదురుదాడి చేసింది. బీజేపీ ప్రతిపక్షాలపై నిందలు వేయడంలో నిమగ్నమైందని ఆ పార్టీ మండిపడింది. బీజేపీ ఈ పదేళ్లలో సాధించిన విజయాలను ప్రచారం చేసుకోలేక.. ఈలాంటి సున్నితమైన అంశాలతో రాజకీయం చేయాలని అనుకుంటుందని పేర్కొన్నారు. ఇలాంటి దౌర్భాగ్యమైన రాజకీయాలు చేయడం బీజేపీకి సిగ్గుమాలిన చర్య అని డీఎంకే పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది.
- Tags
- bjp
- congress
- DMK
- Kachchatheevu
- MK Stalin
తాజావార్తలు
-
Story Board : స్వతంత్ర భారత ప్రస్థానం ఎలా ఉంది..? ఇన్నేళ్లలో మనం ఏం సాధించాం..?
-
CM Revanth Reddy : ఉత్తర తెలంగాణకు సీఎం రేవంత్ వరాలు.. రూ.16 వేల కోట్ల పనులకు శ్రీకారం..
-
OTR: కోదండరాంకు యువత సెగ..! నాడు నమ్మినవాళ్లే ఇప్పుడు నిలదీస్తున్నారా..?
-
Nitin Nabin: నితిన్ నబీన్ ఏపీ పర్యటన ఖరారు.. ఆగస్టు 17 నుంచి 21 వరకు..
-
OTR: బీఆర్ఎస్కు కాంగ్రెస్ బిగ్ కౌంటర్..! 10 ఏళ్ల భూ కేటాయింపుల చిట్టా..!
ట్రెండింగ్
-
Home Hacks : గోడలపై ఫర్నిచర్ మరకలకు చెక్.. ఇంట్లోనే పాటించాల్సిన సులువైన చిట్కాలు.!
-
Homemade Ghee: ఇంట్లోనే సులభంగా కమ్మనైన, స్వచ్ఛమైన ‘నెయ్యి’ని తయారు చేయండి ఇలా..!
-
Redmi Note 17 5G vs Moto G Max 5G: మిడ్రేంజ్లో బెస్ట్ స్మార్ట్ఫోన్ ఏది.?
-
డిజైన్, ఫీచర్లలో భారీ అప్డేట్స్ తో సెప్టెంబర్ 5న రాబోతున్న Maruti Baleno Facelift..!
-
కొత్త పికప్ ట్రక్ Mahindra Scorpio Lifestyler వచ్చేస్తోంది.. ధర, ఫీచర్లు ఇవే!