Katchatheevu: కచ్చతీవు ద్వీపంపై రాజకీయ రగడ.. కాంగ్రెస్, బీజేపీ, డీఎంకే మధ్య మాటల యుద్ధం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Katchatheevu: లోక్సభ ఎన్నికల నేపథ్యంలో కచ్చతీవు ద్వీపం అంశాన్ని బీజేపీ తెరపైకి తెచ్చింది. 1974లో ఆ ద్వీపాన్ని నాటి ప్రధాని ఇందిరాగాంధీ.. శ్రీలంకకు అప్పగించారని కమలం పార్టీ ఆరోపించింది. ఇక, ఉత్తర్ప్రదేశ్లోని మేరఠ్ ర్యాలీలోనూ కచ్చతీవును మోడీ ప్రస్తావిస్తూ.. కాంగ్రెస్, డీఎంకే పార్టీలపై ధ్వజమెత్తారు. స్వాతంత్య్రం వచ్చినప్పుడు కచ్చతీవు మన దగ్గరే ఉండగా.. శ్రీలంక, తమిళనాడు మధ్య ఉన్న ఆ దీవి భద్రతా పరంగా కీలకమైందన్నారు. కానీ, కాంగ్రెస్ ఆ ద్వీపం ఎందుకూ పనికిరాదంటూ శ్రీలంకకు అప్పగించిందని ఆరోపించారు. అలాగే, తమిళనాడు మత్స్యకారులు ఆ ద్వీపం వైపు వెళ్లినపుడు శ్రీలంక అధికారులు అరెస్టు చేస్తున్నారని తెలిపారు.. ఇక, తమ బోట్లను జప్తు చేస్తున్నారు.. కాంగ్రెస్తో పొత్తుకట్టిన డీఎంకే లాంటి పార్టీలు కూడా ఈ అంశంపై మాట్లాడటం లేదని ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్నారు.
Read Also: Congress: సీఈసీ ముందు ప్రతిపాదనలు.. నేడు ఏపీ కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా..!
Also Read
- Iran: భారీ ఆదాయం సమకూర్చుకునే పనిలో ఇరాన్.. వాటిపై ‘డిజిటల్ టాక్స్’ వసూలుకు ప్లాన్..
- Ambati Rambabu: పెట్రో ధరలపై రిక్షా తొక్కి అంబటి నిరసన.. రెడ్ బుక్ నా మీదే కాదు.. జనసేన వాళ్లపై కూడా అమలు..!
- Virat Kohli: కోహ్లీ ‘స్టంప్ మైక్’ సీక్రెట్ లీక్.. పంజాబ్ను దెబ్బకొట్టిన ఆర్సీబీ వ్యూహం.. ప్లేఆఫ్స్ వేళ సరికొత్త చర్చ..
- Greater Noida: కోటి రూపాయలతో పెళ్లి.. 14 నెలలకే విషాదాంతం! కట్నం వేధింపులకు వివాహిత బలి
ఇక, ప్రధాని మోడీ ఆరోపణలపై కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సీరియస్ అయ్యారు. తమిళనాడులో ఎన్నికల నేపథ్యంలోనే ఈ సున్నిత అంశాన్ని ప్రధాని రాజకీయం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. అధికారంలో ఉన్న పదేళ్లలో కచ్చతీవును ఎందుకు వెనక్కి తెచ్చుకోలేదు మోడీ ప్రభుత్వం అని ప్రశ్నించారు. తూర్పు లద్దాఖ్లోని గల్వాన్ లోయలో 20 మంది సైనికులు ప్రాణ త్యాగాలు చేసిన తర్వాత కూడా.. చైనాకు మోడీ ఎలా క్లీన్చిట్ ఇచ్చారని ఖర్గే నిలదీశారు. ఇక, మీ హయాంలో బంగ్లాదేశ్తో భూ సరిహద్దు ఒప్పందం చేసుకున్నారు.. స్నేహపూర్వక సంబంధాల్లో భాగంగా 55 ప్రాంతాలు భారత్కు వస్తే.. 111 ప్రాంతాలు బంగ్లాకు వెళ్లాయనే విషయాన్ని గుర్తు చేశారు. అలాంటి ఒప్పందంలో భాగంగానే గత ప్రభుత్వం శ్రీలంకకు కచ్చతీవు దీవిని అప్పగించిందని మల్లికార్జున ఖర్గే వెల్లడించారు.
Read Also: Premalu OTT: ప్రేమలు ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది..స్ట్రీమింగ్ అప్పుడే?
ఇక, 1974లో కచ్చతీవు ద్వీపాన్ని శ్రీలంకకు అప్పగించిందని ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలకు డీఎంకే పార్టీ నేతలు ఎదురుదాడి చేసింది. బీజేపీ ప్రతిపక్షాలపై నిందలు వేయడంలో నిమగ్నమైందని ఆ పార్టీ మండిపడింది. బీజేపీ ఈ పదేళ్లలో సాధించిన విజయాలను ప్రచారం చేసుకోలేక.. ఈలాంటి సున్నితమైన అంశాలతో రాజకీయం చేయాలని అనుకుంటుందని పేర్కొన్నారు. ఇలాంటి దౌర్భాగ్యమైన రాజకీయాలు చేయడం బీజేపీకి సిగ్గుమాలిన చర్య అని డీఎంకే పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది.
- Tags
- bjp
- congress
- DMK
- Kachchatheevu
- MK Stalin
తాజావార్తలు
-
IPL 2026: ఐపీఎల్ ప్లేఆఫ్స్ షెడ్యూల్ మారుతుందా? బీసీసీఐ, కేంద్రం ఆదేశాలపై ఉత్కంఠ!
-
Iran: భారీ ఆదాయం సమకూర్చుకునే పనిలో ఇరాన్.. వాటిపై ‘డిజిటల్ టాక్స్’ వసూలుకు ప్లాన్..
-
SEYON : శివకార్తికేయన్ & కమల్ హాసన్ ‘సెయాన్’ షూటింగ్ స్టార్ట్
-
Salman Khan: స్కూల్ పిల్లల కోసం..సల్మాన్ రూ.15 కోట్ల విరాళం..
-
Health Awareness Wedding: ఆలోచింపజేస్తున్న ఈ వధూవరుల నిర్ణయం.. ఆ టెస్ట్ తర్వాతే వివాహబంధంలోకి అడుగుపెట్టిన జంట
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..