MK Stalin: తమిళనాడులో ఎన్నికల వేడి పెరుగుతోంది. అన్ని పార్టీలు కూడా విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. తాజాగా, సీఎం ఎంకే స్టాలిన్ బీజేపీని టార్గెట్ చేస్తూ తీవ్ర విమర్శలు చేశారు. మధురైలో జరిగిన ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ.. మధురైని మణిపూర్లా మార్చేందుకు బీజేపీ ప్రయత్నించిందని ఆరోపించారు. మధురైలో తిరుపరంకుండ్రం సుబ్రమణ్య స్వామి ఆలయ వివాదాన్ని స్టాలిన్ ప్రస్తావించారు.
Tamil Nadu Elections: తమిళనాడు ఎన్నికల్లో ఏ పార్టీ ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తుందనే క్లారిటీ వచ్చింది. ఈరోజు (శనివారం) డీఎంకే కూటమి తన పొత్తుల్ని ఖరారు చేసింది. మొత్తం 234 నియోజకవర్గాల్లో డీఎంకే 164 సీట్లలో పోటీ చేస్తుంటే, మిగిలిన 70 స్థానాలను తన మిత్రపక్షాలకు కేటాయించింది. కూటమిలో ఉన్న కాంగ్రెస్కు 28 సీట్లు, డీఎండీకేకు 10 సీట్లు, వీసీకేకు 8 సీట్లు, సీపీఐ, సీపీఎంలకు చెరో 5 స్థానాలు, ఎండీఎంకేకు 4 స్థానాలు కేటాయించింది.…
Tamil Nadu: తమిళనాడుతో పాటు కేరళ, అస్సాం, వెస్ట్ బెంగాల్, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికలకు ఈసీ షెడ్యూల్ విడుదల చేసేందుక రంగం సిద్ధమైంది. ఇదిలా ఉంటే, తమిళనాడులో మాత్రం ఓ విషయం ఇప్పుడు రాజకీయంగా సంచలనంగా మారింది. సినీ నటుడు విజయ్ కు చెందిన తమిళగా వెట్రి కజగం (TVK) సీనియర్ నాయకుడు ఒకరు చేసిన వ్యాఖ్యలు ఆ రాష్ట్రంలో చర్చనీయాంశమయ్యాయి. సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయాల్లోకి రావాలని ఆలోచించినప్పుడు ద్రవిడ మున్నేట్ర కజగం (DMK) ఆయన్ను…
Tamil Nadu: తమిళనాడులో ఎన్నికలు దగ్గర పడుతున్నాకొద్ది రాజకీయ ముఖచిత్రం మారుతోంది. గతంలో డీఎంకే, అన్నాడీఎంకేల మధ్య ఉన్న ద్విముఖ పోరు ఇప్పుడు, యాక్టర్ విజయ్ పార్టీ టీవీకే ఎంట్రీతో త్రిముఖపోరుగా మారింది. ఈ ఎన్నికల వేడిలో రాజకీయం హాట్ హాట్గా మారింది.
టీవీకే చీఫ్, నటుడు విజయ్ మరోసారి అధికార ద్రవిడ మున్నేట్ర కజగం (DMK), దాని ప్రత్యర్థి AIADMK లను లక్ష్యంగా చేసుకున్నారు. సోమవారం ఆయన రాష్ట్ర రాజకీయ ప్రముఖులపై తీవ్ర స్థాయిలో దాడి చేశారు. ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ పార్టీని తన రాజకీయ శత్రువుగా ఆయన అభివర్ణించారు. అఖిల భారత అన్నా ద్రవిడ మున్నేట్ర కజగంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. “ఆ రోజు, ఆ కన్నీళ్లను తుడవడానికి AIADMK ప్రారంభమైంది. అదేవిధంగా, 2021 ఎన్నికల తర్వాత, కామరాజర్…
తమిళనాడు ఎన్నికల ముంగిట అసెంబ్లీలో కీలక పరిణామం జరిగింది. స్టాలిన్ సర్కార్-రాజ్భవన్ మధ్య ఎప్పుడూ వార్ నడుస్తూనే ఉంటుంది. తాజాగా ఆ యుద్ధ వాతావరణం మరోసారి బయటపడింది. మంగళవారం ఉదయం తమిళనాడు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి.
Jana Nayagan vs Parasakthi: తమిళనాడులో రెండు సినిమాల మధ్య అరవ రాజకీయాలు హీటెక్కాయి. తమిళ స్టార్, టీవీకే అధినేత విజయ్ నటించిన ‘‘జన నాయగన్’’, శివకార్తికేయన్ నటించిన ‘‘పరాశక్తి’’ సినిమాల మధ్య వివాదం ముదురుతోంది.
SIR: కేంద్ర ఎన్నికల సంఘం ఓటర్ల ప్రక్షాళన కోసం చేపట్టిన ‘‘స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(SIR)’’ తమిళనాడులో నకిలీ ఓటర్లపై పంజా విసిరింది. తమిళనాడులో సమగ్ర ముసాయిదా ఓటర్ల జాబితా ఈరోజు(డిసెంబర్ 19)న విడుదలైంది. రాష్ట్రవ్యాప్తంగా ఏకంగా 97 లక్షల ఓటర్ల పేర్లను తొలగించారు. ఇందులో మరణించిన వారు 6,94,672 మంది, వేరే ప్రాంతాలకు వెళ్లిన వారు 66,44,881 మంది, ఒకే వ్యక్తికి అనేక చోట్ల ఓటు ఉన్నవారు 3,39,278 మంది ఓటర్లు ఉన్నారని డేటా పేర్కొంది. Read…
K Annamalai: తిరుప్పరకుండ్రం సుబ్రమణ్య స్వామి ఆలయంలో దీపం వెలిగింపు వివాదంగా మారింది. ఇటీవల మద్రాస్ హైకోర్ట్ న్యాయమూర్తి జిఆర్ స్వామినాథన్, కొండపై ఉన్న స్తంభంపై దీపం వెలిగించాలని తీర్పు చెప్పారు. అయితే, ఈ తీర్పును ప్రభుత్వం పాటించలేదు.